Cricket News: ఇంగ్లాండ్తో ఐదో టెస్టుకు భారత స్క్వాడ్ ఇదే..
ఇంగ్లాండ్తో చివరి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. లఖ్నవూ సూపర్ జెయింట్స్ కూడా తమ వైస్ కెప్టెన్ను వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో ఐదో టెస్టు కోసం భారత స్క్వాడ్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఐపీఎల్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు కొత్త వైస్ కెప్టెన్ వచ్చాడు. అంపైరింగ్కు వీడ్కోలు చెబుతున్నట్లు సీనియర్ వెల్లడించాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
బుమ్రా వచ్చాడు.. కేఎల్ రాహుల్ లేడు
నాలుగో టెస్టులో విశ్రాంతి తీసుకున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్తో ఐదో టెస్టుకు సిద్ధమయ్యాడు. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా స్క్వాడ్ను అప్డేట్ చేస్తూ బీసీసీఐ ప్రకటన వెలువరించింది. గాయం కారణంగా దూరమైన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లోనూ ఆడటం లేదు. వాషింగ్టన్ సుందర్ను విడుదల చేయడంలో రంజీల్లో ఆడేందుకు వెళ్తాడు. ముంబయి-తమిళనాడు సెమీఫైనల్లో (మార్చి 2 నుంచి) సుందర్ ఆడతాడు. అది ముగిశాక అవసరమైతే జాతీయజట్టులో చేరతాడు.
స్క్వాడ్ ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదుత్ పడిక్కల్, ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్
కృనాల్ స్థానంలో పూరన్కు అవకాశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో 22 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈక్రమంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్కు డిప్యూటీగా వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ను నియమించింది. గత సీజన్ వరకు ఎల్ఎస్జీ వైస్ కెప్టెన్గా కృనాల్ పాండ్య ఉన్నాడు. వైస్ కెప్టెన్సీ జెర్సీని నికోలస్కు కేఎల్ రాహుల్ అందించాడు. గత వేలంలో పూరన్ను రూ.16 కోట్లు వెచ్చించి మరీ లఖ్నవూ సొంతం చేసుకుంది.
అంపైరింగ్కు మారియస్ ఎరాస్మస్ గుడ్బై
సీనియర్ అంపైర్ మారియస్ ఎరాస్మస్ తన కెరీర్కు వీడ్కోలు చెబుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీసే తనకు చివరిదని ఎరాస్మస్ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని బోలాండ్ క్రికెట్ జట్టుతో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ను ప్రారంభించిన ఎరాస్మస్.. ఆ తర్వాత అంపైరింగ్లోకి వచ్చాడు. ఫిబ్రవరి 2006లో తొలిసారి దక్షిణాఫ్రికా - ఆసీస్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్కు అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20లు, మరో 18 మహిళల టీ20లకు అంపైరింగ్ చేశాడు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఇంతటి గొప్ప గౌరవాన్ని, ట్రావెలింగ్ను మిస్ అవుతున్నా’’ అని వ్యాఖ్యానించాడు. ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మూడుసార్లు ఎరాస్మస్ సొంతం చేసుకున్నాడు. భారత్ ఆడిన చాలా మ్యాచులకూ అతడు అంపైరింగ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి