Team India: అప్పుడు ఇలానే ప్రయోగాలు.. మరి ఇప్పుడేమవుతుందో..!
ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ రానుంది. ఈ ఏడాది టీమ్ఇండియా (Team India) ఆడే మెగా టోర్నీలు ఇవి. ఇలాంటి సమయంలో జట్టు కూర్పులో ప్రయోగాలు చేస్తూ టీమ్ఇండియా విమర్శలపాలవుతోంది.
118/5, 181/10.. ఇదీ వెస్టిండీస్తో గత రెండు వన్డేల్లో (WI vs IND) భారత్ స్కోర్లు. తొలి మ్యాచ్లో అతికష్టం మీద గట్టెక్కగా.. రెండో వన్డేలో మాత్రం టీమ్ఇండియా (Team India) ఓటమిపాలై నిరాశపరిచింది. ఇషాన్ కిషన్ మినహా ఎవరూ ప్రభావం చూపించలేకపోయారు.
వారు లేకపోవడమా? ఆ మ్యాచ్ చూడాలంటేనే బోర్
తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) క్రీజ్లోకే రాలేదు. ఇక రెండో వన్డేలో మాత్రం వీరిద్దరూ బెంచ్కే పరిమితమయ్యారు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే ఇలా చేశామని మేనేజ్మెంట్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. ఫలితాలు సానుకూలంగా వస్తే ఫర్వాలేదు.. కానీ అనుకున్న విధంగా ఆటగాళ్ల ప్రదర్శన లేకపోవడంతో అభిమానుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా..? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
అప్పుడూ ఇలానే..!
గతేడాది టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ముందు కూడా భారత్ ప్రయోగాలు చేసింది. ఎక్కువ మంది ఆటగాళ్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కో సిరీస్కు ఒక్కో జట్టుతో బరిలోకి దిగింది. తీరా గత ఆసియా కప్ (అదీ టీ20 ఫార్మాట్) సహా పొట్టి కప్లో భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. ఆసియా కప్ 2022 లో గ్రూప్ స్టేజ్కే పరిమితం కాగా.. గత టీ20 ప్రపంచకప్లో సెమీస్ వరకూ చేరినా ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడింది. అప్పుడు పని ఒత్తిడి కారణంగా విడివిడి జట్లుగా ఎంపిక చేసి మరీ విదేశాల్లో సిరీస్లను ఆడించడం జరిగింది.
మరోసారి అదే బాటలోనా..?
పన్నెండేళ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2013లో చివరి సారిగా భారత్ ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. అప్పటి నుంచి జరిగిన టోర్నీల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాటర్లకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అవుతుందనే ఊహాగానాలూ వస్తున్నాయి. భారత్ వేదికగానే వన్డే ప్రపంచ కప్ జరగనుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి క్రమంలో అనవసర ప్రయోగాలకు పోతే.. వికటించే ప్రమాదం ఉంటుందని ఆందోళన అభిమానుల్లో నెలకొంది. రోహిత్, విరాట్తోపాటు ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో బరిలోకి దిగే ఆటగాళ్లను ఆడిస్తే బాగుంటుందని క్రికెట్ మాజీలు సూచించారు.
అతడు ఓకే.. మిగతా వారి పరిస్థితేంటి?
టీమ్ఇండియా గత రెండు వన్డేల్లో చేసిన ప్రయోగాలతో ఒక్క ఆటగాడు మాత్రమే తన సత్తా ఏంటో చూపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ త్యాగం చేయడంతో ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషన్ రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో అలరించాడు. మరో ఓపెనర్ గిల్ పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో మెగా టోర్నీల్లో రోహిత్కు తోడుగా ఇషాన్ ఓపెనింగ్ చేసే అవకాశాలను మెరుగుపర్చుకున్నాడు. సంజూ శాంసన్, హార్దిక్, సూర్యకుమార్ తేలిపోవడం కలిచివేస్తోంది. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న వేళ.. ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. టీ20ల్లో అదరగొట్టిన సూర్య కుమార్ వన్డే ఫార్మాట్లో ప్రభావం చూపించడం లేదు. అవకాశాలు రావడం లేదని బాధపడుతున్న సంజూ.. వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు.
ఆ మూడింటి వల్లే.. ఇప్పటి ఆటగాళ్లు ఇలా: కపిల్దేవ్
ఇక బౌలింగ్లో ముకేశ్ కుమార్ కాస్త ఫర్వాలేదనిపించినా.. బుమ్రా ఒకవేళ ఫిట్నెస్ సాధించకపోతే ఆ లోటును భర్తీ చేస్తాడని భావిస్తున్న ఉమ్రాన్ మాలిక్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. కుల్దీప్, జడేజా విషయంలో ఎలాంటి సమస్య లేదు. విండీస్తో జరగనున్న (ఆగస్ట్ 1న) చివరి వన్డేలోనూ టీమ్ఇండియా ప్రయోగాలు చేస్తుందో లేదో చూడాలి. అప్పుడు యుజ్వేంద్ర చాహల్కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. రెండో వన్డేలో ఎలాగూ అక్షర్ పటేల్ను బరిలోకి దింపారు. బ్యాటింగ్లో విఫలమైన అతడికి బౌలింగ్లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చారు. అందులో ఒక ఓవర్ మెయిడిన్ వేయడం విశేషం. అయితే, ఆసియా కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత టీమ్ఇండియా మేనేజ్మెంట్పై ఉంది.
మరి వారు వస్తే ఎలా..?
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం బాగానే ఉంది. ప్రస్తుతం కొందరు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉంటూ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వారిలో ప్రధానంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా ముఖ్యులు. షమీ కూడా ప్రస్తుతం విండీస్ పర్యటనలో లేడు. అలాగే మిడిలార్డర్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించే అజింక్య రహానె కూడా జట్టులో స్థానం ఆశిస్తున్నాడు. వీరందరూ అందుబాటులోకి వస్తే ఏం చేస్తారనేది మేనేజ్మెంట్ ముందున్న పరిస్థితి. బుమ్రా ప్రధాన పేసర్ కాబట్టి ఫిట్నెస్ నిరూపించుకుంటే అతడికి ఇబ్బంది ఉండదు. కేఎల్ రాహుల్, శ్రేయస్లో ఎవరు జట్టులోకి వస్తారో ఇప్పుడే చెప్పలేం. వారు ఫిట్నెస్ సాధించాల్సి ఉంటుంది. వీరిద్దరూ మిడిలార్డర్లో కీలకంగా మారే అవకాశం ఉంది. వికెట్ కీపర్గా ఇషాన్కు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మరో వైపు యువ బ్యాటర్ యశస్విని కూడా తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్