T20 World Cup 2024: ఆ ఇద్దరు.. ఆ కల నెలవేర్చుకుంటారా!
తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచ కప్ను నెగ్గిన టీమ్ఇండియా.. ఆ తర్వాత ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది.
వెస్టిండీస్... ఈ పేరు చెప్పగానే 2007 వన్డే ప్రపంచకప్ కళ్ల ముందు నిలుస్తుంది. భారత్ దారుణ పరాభవమే గుర్తుకొస్తుంది. కానీ అదే ఏడాదిలో జరిగిన టీ20 ప్రపంచకప్లో మహేంద్రసింగ్ ధోనీ భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టాడు. గాయాన్ని మాన్పి అభిమానులను ఉర్రూతలూగించాడు.
మళ్లీ వెస్టిండీస్లో ప్రపంచకప్ వచ్చింది. కాకపోతే విండీస్ సహ ఆతిథ్య జట్టు. కానీ భారత్ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. ఈసారీ వన్డే ప్రపంచకప్లో పరాభవం ఎదుర్కొంది. అయితే 2007లోలా తొలి రౌండ్లోనే ఇంటికి రాలేదు. సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో ఫైనల్కు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని బాధను మిగిల్చింది. అంటే 2007 వన్డే ప్రపంచకప్ నాటి మానసిక స్థితిలోనే ఉన్నారు ప్రస్తుత భారత అభిమానులు కూడా. ఈ బాధను ఇంకా మరిచిపోకమందే టీ20 ప్రపంచకప్ వచ్చింది. మరి ఈసారి 2007లో ఆడిన స్టార్లలో మిగిలిన రోహిత్శర్మ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు! 2007 వన్డే ప్రపంచకప్ సారథి అయిన రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకుంటారా! అభిమానుల బాధను తీరుస్తారా!
అతడొక్కడే
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో రోహిత్శర్మ సభ్యుడు. ప్రస్తుత జట్టులో అతడొక్కడు మాత్రమే టీ20 ప్రపంచకప్ ఆడుతున్నాడు. అపార అనుభవం ఉన్న రోహిత్పై ఇప్పుడు కెప్టెన్గా జట్టుకు కప్ అందించాల్సిన పెద్ద బాధ్యత ఉంది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియాను ఫైనల్కు చేర్చినా.. ఆఖరి మెట్టుపై తడబడడం రోహిత్కు చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని దూరం చేసింది. కెరీర్లో బహుశా చివరి ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్.. కప్తో అభిమానులను మురిపించడానికి ఇంతకుమించిన అవకాశం దొరకదు. కానీ 2007 ప్రపంచకప్లో గెలిచిన తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ టీమ్ఇండియాకు మళ్లీ చిక్కలేదు. పోటీ కూడా బాగా పెరిగింది. ఈనేపథ్యంలో కప్ సాధించడం.. అది కూడా విదేశీ గడ్డపై నెగ్గడం పెద్ద సవాల్. బ్యాటింగ్ బలంగానే ఉన్నా.. బౌలింగ్ విభాగంలోనూ టీమ్ఇండియా బలంగా ఉంది. దీనికితోడు ప్రపంచ కప్ పీడకల నుంచి ఆటగాళ్లు కూడా ఇంకా మరిచిపోయి ఉండరు. ఈనేపథ్యంలో సహచరులను సమన్వయపరుచుకొంటూ.. వనరులను వాడుకుంటూ రోహిత్ ఎలా ముందుకెళ్తాడో అనేది ఆసక్తికరం.
అతడి కల తీరేనా!
కెప్టెన్ రోహిత్ది ఓ కథ అయితే... కోచ్ రాహుల్ది మరో కథ. 2007 వన్డే ప్రపంచకప్లో దారుణ పరాభవంతో సారథ్యం కూడా కోల్పోయాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత్కు ప్రాతినిథ్యం వహించినా ప్రపంచకప్ అతడి కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు రాహుల్ ముంగిట కోచ్గా సవాల్ ఉంది. అతడు జట్టును కప్ దిశగా నడిపించి.. వన్డే కప్ లోటును టీ20 కప్ ద్వారా అయినా తీర్చుకుంటాడా అనేది చూడాలి. పైగా కోచ్గా రాహుల్కు ఇదే చివరి కప్. ఈనేపథ్యంలో అతడి బుర్రకు పదునుపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అతడిపై ఎక్కువ ఒత్తిడి లేదు. ఎందుకంటే తనకు ఇదే చివరి కప్. ఈ కప్ను గెలిపిస్తే తెరవెనుక సూత్రధారిగా రాహుల్ చరిత్రలో నిలుస్తాడు. ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగే వెస్టిండీస్లో పిచ్లు భారత్ పిచ్ల మాదిరే కాస్త నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి ట్రాక్లపై మహా మహా జట్లను ఎదుర్కొని టీమ్ఇండియా కప్ అందుకోవాలంటే ద్రవిడ్ అపార అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అటు రోహిత్, ఇటు రాహుల్లు తమ కల నెరవేర్చుకుంటారా! అభిమానులను ఆనందంలో ముంచెత్తుతారా! అనేది వేచిచూడాల్సిందే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్