Team India: వస్తున్నారు... ఆడేస్తున్నారు.. సత్తా చాటిన యువ క్రికెటర్లు
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ భారత్ గెలవడానికి ప్రధాన కారణం.. యువ క్రికెటర్లు. బ్యాటింగ్లో అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పర్యటక జట్టుకు బజ్బాల్ క్రికెట్ రుచి చూపించారు.
టెస్టు జట్టులో స్థానం! ఏ భారత క్రికెటర్కైనా ఇదో పెద్ద కల. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడినా రాని తృప్తి అయిదురోజుల మ్యాచ్లో బరిలో దిగితే కలుగుతుందని ప్రతి క్రికెటర్ అంగీకరిస్తారు.
కొన్నేళ్ల క్రితం వరకు భారత క్రికెట్లో టెస్టు జట్టు కూర్పు ఫిక్స్డ్గా ఉండేది. దిగ్గజ ఆటగాళ్లతో కిక్కిరిసిపోయి కనిపించేది.. సీనియర్ క్రికెటర్లు పాతుకుపోవడంతో రెడ్ బాల్ క్రికెట్లోకి రావడం కుర్రాళ్లకు అంత తేలిక అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు కొత్త కుర్రాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో తేలిగ్గా చోటు దక్కించుకుంటున్నారు. ఛాన్స్ రావడమే ఆలస్యం సత్తా చాటుతున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్లో సర్ఫ్రాజ్ఖాన్, ధ్రువ్ జురెల్, దేవ్దత్ పడిక్కల్ ఇదే కోవకు చెందుతారు. రజత్ పటీదార్ ఒక్కడే ఇందుకు మినహాయింపు.
సీనియర్లు లేకపోవడంతో..
రెగ్యులర్ సభ్యులు అజింక్య రహానె, చెతేశ్వర్ పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోవడం.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతిలో ఉండడం, కేఎల్ రాహుల్కు గాయం, శ్రేయస్ అయ్యర్పై వేటు లాంటి కారణాలు యువ ఆటగాళ్లకు టెస్టు ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కలను తీరుస్తున్నాయి. ఇలా అనూహ్యంగా ఛాన్స్లు దక్కించుకుంటున్న వాళ్లలో దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా ఏళ్ల తరబడి అవకాశాలు రాక విసిగిపోయిన సర్ఫరాజ్ఖాన్ లాంటివాళ్లూ ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే టెస్టు టేస్టు ఏమిటో తెలుసుకున్న ధ్రువ్ జురెల్ లాంటి వాళ్లూ ఉన్నారు.
పడిక్కల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రతిభావంతుడిగా పేరు సంపాదించినా అతడికి టెస్టు జట్టులో ఆలస్యంగా స్థానం దక్కింది. 2021లో శ్రీలంకపై టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత ఈ కుర్రాడు కనిపించకుండాపోయాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సత్తా చాటడంతో పరిమిత ఓవర్లకే పరిమితమవుతాడా అనిపించాడు. కానీ ఈ కుర్రాడికి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రజత్ పటీదార్ వరుసగా విఫలం కావడంతో పడిక్కల్కు ఛాన్స్ దక్కింది. ఇన్నాళ్లకు తనకు ఇష్టమైన టెస్టు రూపంలో భారత జట్టులోకి పిలుపొచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవ్దత్ అర్ధసెంచరీతో సత్తా చాటాడు.
దూకుడు.. కొత్త షాట్లు
ఒకప్పుడు అవకాశం దొరికితే నెమ్మదిగా ఆడి జట్టులో స్థానాన్ని ఎలాగైనా పదిలం చేసుకోవాలనే ఆలోచనలో కుర్రాళ్లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడా ట్రెండ్ లేదు. పరిమిత ఓవర్ల జోరును టెస్టుల్లోకి చొప్పించి ధనాధన్ ఆటతో చెలరేగుతున్నారు కొత్త కుర్రాళ్లు. అరంగేట్రంలో తొలి అర్ధశతకాన్ని పడిక్కల్ సిక్స్తో పూర్తి చేయడమే ఇందుకు ఉదాహరణ. పరుగులు రాబట్టేందుకు రిస్క్ తీసుకోవడానికి కూడా యువ ఆటగాళ్లు జంకట్లేదు. ఇందుకు సర్ఫరాజ్ చక్కని ఉదాహరణ. ఈ కుర్రాడైతే ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్లా ఆడుతున్నాడు. అతడు కొడుతున్న కొన్ని షాట్లు బౌలర్ల మతిని పోగొడుతున్నాయి. తాజాగా ధర్మశాల అయిదో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ చేసే క్రమంలో పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో సర్ఫ్రాజ్ కొట్టిన బౌండరీ అలాంటిదే. వుడ్ మెరుపు వేగంతో వేసిన బంతిని శరీరాన్ని విల్లులా వంచి సర్ఫ్రాజ్ బౌండరీకి పంపి ఔరా అనిపించాడు. నిజానికి అతడి శరీరతత్వానికి అలాంటి షాట్ ఆడడం సాహసమే. కానీ ఇప్పటి కుర్రాళ్లు అవేం ఆలోచించట్లేదు ఎలాగైనా పరుగులు రాబట్టాలన్న తపనతో ఉన్నారు. ఒకరకంగా ఈ దృక్పథం టెస్టు క్రికెట్ను ఆసక్తికరంగా మార్చడంలో ఒక కారకంగా మారుతోంది. అరుదుగా దొరికిన టెస్టు అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న యువ ఆటగాళ్లు.. సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఇస్తున్నారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్