Team India: టీమ్ఇండియా ఇలాగైతే ఈసారి కూడా ప్రపంచకప్ కొట్టడం అనుమానమే!
భారత టీ20 లీగ్ 15వ సీజన్ సగం పూర్తయింది. ఇంకా సగం కన్నా తక్కువ మ్యాచ్లే మిగిలిఉన్నాయి. అయితే, ఇప్పటివరకు టీమ్ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు..
భారత టీ20 లీగ్ 15వ సీజన్ సగం పూర్తయింది. ఇంకా సగం కన్నా తక్కువ మ్యాచ్లే మిగిలిఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమ్ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లు (ఇద్దరు ముగ్గురు మినహా) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే పొట్టి ప్రపంచకప్పైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది వరకు టాప్ ఆటగాళ్లంతా అత్యుత్తమ ఫామ్లో ఉన్నా 2015 నుంచి ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీలు సాధించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీ20 లీగ్లో భారత ఆటగాళ్లు ఎవరెవరు ఎలా ఆడుతున్నారో తెలుసుకుందాం.
రోహిత్ విఫలం: గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయపథంలో నడిపించాడు. అయితే, ఈ టీ20 లీగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు ముంబయి కెప్టెన్గా, ఇటు ఓపెనర్గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. 8 మ్యాచ్లు ఆడి 19.13 సగటుతో 153 పరుగులే చేశాడు. కెప్టెన్గా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు.
ఇషాన్ తడబాటు: గతేడాది టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినా సరైన ప్రదర్శనలు లేక తంటాలు పడ్డాడు. ఇప్పుడు ముంబయి జట్టులోనూ భారీ అంచనాల నడుమ తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 28.43 సగటుతో 199 పరుగులు చేశాడు. అయితే, ఇందులో సగానికి పైగా పరుగులు తొలి రెండు మ్యాచ్ల్లో వచ్చినవే. మిగిలిన ఆరు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. దీంతో అతడి బ్యాటింగ్ తీరు నానాటికీ పడిపోతోంది.
విరాట్ దారుణం: ఇక అన్ని జట్ల సారథిగా తప్పుకొన్న విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా రెచ్చిపోతాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 17 సగటుతో 119 పరుగులే చేశాడు. నానాటికీ కోహ్లీ ప్రదర్శన దిగజారిపోతోంది. అతడిలాగే ఆడితే టీమ్ఇండియాకు చాలా నష్టమనే చెప్పాలి.
రాహుల్ అత్యుత్తమం: టీమ్ఇండియాలో ప్రస్తుత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడంటే.. అది కేఎల్ రాహుల్ ఒక్కడే. అతడు లఖ్నవూ వంటి కొత్త జట్టుకు కెప్టెన్గా ఆకట్టుకుంటూనే.. బ్యాట్స్మన్గానూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 61.33 సగటుతో 368 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు, ఒక అర్ధ శతకంతో మెరిశాడు.
సూర్యకుమార్ నిలకడగా: నిలకడత్వానికి పెట్టింది పేరు సూర్యకుమార్ యాదవ్. ముంబయితో ఈ సీజన్ ఆరంభంలో రెండు మ్యాచ్లు ఆడలేకపోయినా తర్వాత రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 47.80 సగటుతో 239 పరుగులు చేశాడు. రాహుల్ తర్వాత అత్యంత నమ్మకం కలిగిస్తున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముంబయి తరఫున ఎంత బాగా ఆడుతున్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. దీంతో అతడికి సరైన ఆటగాడు తోడైతే జట్టుకెంతో మేలు చేస్తాడు.
సాదాసీదా: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు మంచిపేరుంది. ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్తో క్షణాల్లో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తాడు. కానీ, ఈసారి దిల్లీని గెలిపించలేకపోతున్నాడు. అతడు పరుగులు తీస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేక అవస్థ పడుతున్నాడు. ఫలితంగా దిల్లీ కూడా సరైన ఫలితాలు సాధించలేకపోతోంది. ఇప్పటి వరకు అతడు ఆడిన 7 మ్యాచ్ల్లో (6 ఇన్నింగ్స్) 37.60 సగటుతో 188 పరుగులే సాధించాడు. దీంతో సాదాసీదా బ్యాటింగ్తో కొనసాగుతున్నాడు.
శ్రేయస్ ఓకే కానీ..: మిడిల్ ఆర్డర్లో అత్యంత కీలకమైన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఈ సీజన్లో కోల్కతా కెప్టెన్గా విఫలమైనా.. బ్యాట్స్మన్గా భారీ స్కోర్లు చేయకపోయినా.. మోస్తరు పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 35.43 సగటుతో 248 పరుగులు చేశాడు. వాటిల్లో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. శ్రేయస్ నుంచి ఇంకా గొప్ప ప్రదర్శనలు ఆశించాల్సిన అవసరం ఉంది.
హార్దిక్ గ్రేట్: ఎవరూ ఊహించని రీతిలో చెలరేగుతున్నాడు కొత్త జట్టు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. అటు కెప్టెన్గా జట్టును అందరికన్నా మిన్నగా నడిపిస్తూనే ఇటు బ్యాట్స్మన్గా అదరగొడుతున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్కు ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లోనే 73.75 సగటుతో 295 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో నాలుగు ఓవర్ల కోటా వేస్తూ అక్కడ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసి 7.56 ఎకానమీతో 4 వికెట్లు తీశాడు. దీంతో గ్రేట్ ఆల్రౌండర్గా కొనసాగుతున్నాడు.
జడేజా ఎందుకిలా: చాలా కాలంగా టీమ్ఇండియాలో అత్యుత్తమ ఆల్రౌండర్గా సేవలందించిన రవీంద్ర జడేజా ఈసారి చెన్నై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే, తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అంచనాలు అందుకోలేక పూర్తిగా తడబడుతున్నాడు. అటు సారథిగా, ఇటు ఆల్రౌండర్గా తేలిపోయాడు. బ్యాటింగ్లో ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో 22.40 సగటుతో 112 పరుగులే చేసిన జడ్డూ.. బౌలింగ్లోనూ మోస్తరుగా నెట్టుకొస్తున్నాడు. దీంతో 8 మ్యాచ్ల్లో 5 వికెట్లే పడగొట్టి 8.19 ఎకానమీ నమోదు చేశాడు.
బుమ్రా కష్టంగానే: ప్రపంచ శ్రేణి పేసర్గా పేరున్న ముంబయి ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సీజన్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 7.54 ఎకానమీతో ఫర్వాలేదనిపిస్తున్నా 5 వికెట్లే తీసి సాదాసీదా బౌలర్ వలే ఆడుతున్నాడు. దీంతో అతడి బౌలింగ్ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్మన్కు పెద్ద ప్రమాదం కాదన్నట్లు కనిపిస్తోంది. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
షమి ఓకే: గుజరాత్ పేసర్గా మహ్మద్ షమి మంచి స్థితిలోనే బౌలింగ్ చేస్తున్నాడు. ఎకానమీ పరంగా చూసినా వికెట్లు సాధించడంలో గమనించినా ఈ టీమ్ఇండియా పేసర్ గొప్పగా రాణిస్తున్నాడు. దీంతో అతడు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 7.21 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. షమి ఇంకాస్త మెరుగైతే టీమ్ఇండియాకు కచ్చితంగా ప్రయోజనకరమే.
భువనేశ్వర్ ఫర్వాలేదు: హైదరాబాద్ కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లోనూ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. అతడు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 7.41 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే, స్వింగ్ బౌలర్గా మంచి గుర్తింపున్న భువి ఇంకాస్త మెరుగైతే టీమ్ఇండియా జట్టులో మరోసారి ఢోకాలేకపోవచ్చు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM