Team India: టీమ్ఇండియా ఇలాగైతే ఈసారి కూడా ప్రపంచకప్ కొట్టడం అనుమానమే!
భారత టీ20 లీగ్ 15వ సీజన్ సగం పూర్తయింది. ఇంకా సగం కన్నా తక్కువ మ్యాచ్లే మిగిలిఉన్నాయి. అయితే, ఇప్పటివరకు టీమ్ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు..
భారత టీ20 లీగ్ 15వ సీజన్ సగం పూర్తయింది. ఇంకా సగం కన్నా తక్కువ మ్యాచ్లే మిగిలిఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమ్ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లు (ఇద్దరు ముగ్గురు మినహా) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే పొట్టి ప్రపంచకప్పైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది వరకు టాప్ ఆటగాళ్లంతా అత్యుత్తమ ఫామ్లో ఉన్నా 2015 నుంచి ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీలు సాధించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీ20 లీగ్లో భారత ఆటగాళ్లు ఎవరెవరు ఎలా ఆడుతున్నారో తెలుసుకుందాం.
రోహిత్ విఫలం: గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయపథంలో నడిపించాడు. అయితే, ఈ టీ20 లీగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు ముంబయి కెప్టెన్గా, ఇటు ఓపెనర్గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. 8 మ్యాచ్లు ఆడి 19.13 సగటుతో 153 పరుగులే చేశాడు. కెప్టెన్గా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు.
ఇషాన్ తడబాటు: గతేడాది టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినా సరైన ప్రదర్శనలు లేక తంటాలు పడ్డాడు. ఇప్పుడు ముంబయి జట్టులోనూ భారీ అంచనాల నడుమ తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 28.43 సగటుతో 199 పరుగులు చేశాడు. అయితే, ఇందులో సగానికి పైగా పరుగులు తొలి రెండు మ్యాచ్ల్లో వచ్చినవే. మిగిలిన ఆరు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. దీంతో అతడి బ్యాటింగ్ తీరు నానాటికీ పడిపోతోంది.
విరాట్ దారుణం: ఇక అన్ని జట్ల సారథిగా తప్పుకొన్న విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా రెచ్చిపోతాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 17 సగటుతో 119 పరుగులే చేశాడు. నానాటికీ కోహ్లీ ప్రదర్శన దిగజారిపోతోంది. అతడిలాగే ఆడితే టీమ్ఇండియాకు చాలా నష్టమనే చెప్పాలి.
రాహుల్ అత్యుత్తమం: టీమ్ఇండియాలో ప్రస్తుత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడంటే.. అది కేఎల్ రాహుల్ ఒక్కడే. అతడు లఖ్నవూ వంటి కొత్త జట్టుకు కెప్టెన్గా ఆకట్టుకుంటూనే.. బ్యాట్స్మన్గానూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 61.33 సగటుతో 368 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు, ఒక అర్ధ శతకంతో మెరిశాడు.
సూర్యకుమార్ నిలకడగా: నిలకడత్వానికి పెట్టింది పేరు సూర్యకుమార్ యాదవ్. ముంబయితో ఈ సీజన్ ఆరంభంలో రెండు మ్యాచ్లు ఆడలేకపోయినా తర్వాత రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 47.80 సగటుతో 239 పరుగులు చేశాడు. రాహుల్ తర్వాత అత్యంత నమ్మకం కలిగిస్తున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముంబయి తరఫున ఎంత బాగా ఆడుతున్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. దీంతో అతడికి సరైన ఆటగాడు తోడైతే జట్టుకెంతో మేలు చేస్తాడు.
సాదాసీదా: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు మంచిపేరుంది. ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్తో క్షణాల్లో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తాడు. కానీ, ఈసారి దిల్లీని గెలిపించలేకపోతున్నాడు. అతడు పరుగులు తీస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేక అవస్థ పడుతున్నాడు. ఫలితంగా దిల్లీ కూడా సరైన ఫలితాలు సాధించలేకపోతోంది. ఇప్పటి వరకు అతడు ఆడిన 7 మ్యాచ్ల్లో (6 ఇన్నింగ్స్) 37.60 సగటుతో 188 పరుగులే సాధించాడు. దీంతో సాదాసీదా బ్యాటింగ్తో కొనసాగుతున్నాడు.
శ్రేయస్ ఓకే కానీ..: మిడిల్ ఆర్డర్లో అత్యంత కీలకమైన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఈ సీజన్లో కోల్కతా కెప్టెన్గా విఫలమైనా.. బ్యాట్స్మన్గా భారీ స్కోర్లు చేయకపోయినా.. మోస్తరు పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 35.43 సగటుతో 248 పరుగులు చేశాడు. వాటిల్లో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. శ్రేయస్ నుంచి ఇంకా గొప్ప ప్రదర్శనలు ఆశించాల్సిన అవసరం ఉంది.
హార్దిక్ గ్రేట్: ఎవరూ ఊహించని రీతిలో చెలరేగుతున్నాడు కొత్త జట్టు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. అటు కెప్టెన్గా జట్టును అందరికన్నా మిన్నగా నడిపిస్తూనే ఇటు బ్యాట్స్మన్గా అదరగొడుతున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్కు ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లోనే 73.75 సగటుతో 295 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో నాలుగు ఓవర్ల కోటా వేస్తూ అక్కడ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసి 7.56 ఎకానమీతో 4 వికెట్లు తీశాడు. దీంతో గ్రేట్ ఆల్రౌండర్గా కొనసాగుతున్నాడు.
జడేజా ఎందుకిలా: చాలా కాలంగా టీమ్ఇండియాలో అత్యుత్తమ ఆల్రౌండర్గా సేవలందించిన రవీంద్ర జడేజా ఈసారి చెన్నై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే, తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అంచనాలు అందుకోలేక పూర్తిగా తడబడుతున్నాడు. అటు సారథిగా, ఇటు ఆల్రౌండర్గా తేలిపోయాడు. బ్యాటింగ్లో ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో 22.40 సగటుతో 112 పరుగులే చేసిన జడ్డూ.. బౌలింగ్లోనూ మోస్తరుగా నెట్టుకొస్తున్నాడు. దీంతో 8 మ్యాచ్ల్లో 5 వికెట్లే పడగొట్టి 8.19 ఎకానమీ నమోదు చేశాడు.
బుమ్రా కష్టంగానే: ప్రపంచ శ్రేణి పేసర్గా పేరున్న ముంబయి ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సీజన్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఆడిన 8 మ్యాచ్ల్లో 7.54 ఎకానమీతో ఫర్వాలేదనిపిస్తున్నా 5 వికెట్లే తీసి సాదాసీదా బౌలర్ వలే ఆడుతున్నాడు. దీంతో అతడి బౌలింగ్ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్మన్కు పెద్ద ప్రమాదం కాదన్నట్లు కనిపిస్తోంది. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
షమి ఓకే: గుజరాత్ పేసర్గా మహ్మద్ షమి మంచి స్థితిలోనే బౌలింగ్ చేస్తున్నాడు. ఎకానమీ పరంగా చూసినా వికెట్లు సాధించడంలో గమనించినా ఈ టీమ్ఇండియా పేసర్ గొప్పగా రాణిస్తున్నాడు. దీంతో అతడు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 7.21 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. షమి ఇంకాస్త మెరుగైతే టీమ్ఇండియాకు కచ్చితంగా ప్రయోజనకరమే.
భువనేశ్వర్ ఫర్వాలేదు: హైదరాబాద్ కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లోనూ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. అతడు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 7.41 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే, స్వింగ్ బౌలర్గా మంచి గుర్తింపున్న భువి ఇంకాస్త మెరుగైతే టీమ్ఇండియా జట్టులో మరోసారి ఢోకాలేకపోవచ్చు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి