IPL 2024: ఐపీఎల్.. లీగ్ చరిత్రలో అత్యధికసార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్లు ఇవే!
ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ మార్చి 22న సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్తో ప్రారంభంకానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్-2024 (IPL 2024)సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఛాంపియన్గా నిలవడానికి పది జట్లూ సర్వశక్తులు ఒడ్డుతాయి. కానీ, కొన్ని మాత్రమే టాప్-4లో నిలిచి టైటిల్ రేసులో నిలబడతాయి. మరి లీగ్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం..
ముంబయి ఇండియన్స్
ఐపీఎల్లో ఎక్కువసార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians). ఇప్పటివరకు 16 ఎడిషన్లలో బరిలోకి దిగిన ముంబయి.. 10సార్లు ప్లేఆఫ్స్కు, ఆరుసార్లు ఫైనల్స్కు దూసుకెళ్లింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ను అందుకుంది. ఈ ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవే. 2010లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. 2011లో మూడో స్థానం, 2012, 2014, 2023లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎక్కువసార్లు (5) ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టు ముంబయే. 2023లో సీఎస్కే ఛాంపియన్గా నిలిచి ఐదుసార్లు టైటిల్ అందుకున్న రెండో జట్టుగా నిలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్లో అత్యధికసార్లు ప్లేఆఫ్స్ ఆడిన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). 14 సీజన్లలో లీగ్లో పాల్గొన్న సీఎస్కే రికార్డుస్థాయిలో 12సార్లు ప్లేఆఫ్స్కు చేరింది. 2020, 2022లో మాత్రమే ఆ జట్టు టాప్-4లో నిలవలేదు. అత్యధిక (10) సార్లు ఫైనల్స్ ఆడిన రికార్డు చెన్నై పేరిటే ఉంది. ఐదుసార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్గా నిలిచింది. ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్తో సరిపెట్టుకుంది. 2009లో సెమీఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 2014లో రెండో క్వాలిఫయర్లో పంజాబ్ చేతిలో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండు సీజన్లలో (2016, 2017) సీఎస్కేపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్లో విశేషమైన అభిమానగణం ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒకటి. జట్టు నిండా ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నా ఆ జట్టుకు ఇప్పటివరకు టైటిల్ కల నెరవేరలేదు. ఆర్సీబీ ఇప్పటివరకు 16 సీజన్లలో పాల్గొని ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్కు చేరి చివరి మెట్టుపై బోల్తాపడింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో సీఎస్కే, 2016లో సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. 2010, 2015, 2022లో 3వ స్థానం, 2020, 2021లో నాలుగో స్థానంలో నిలిచింది.
కోల్కతా నైట్రైడర్స్
ఐపీఎల్లో ప్రమాదకరమైన జట్లలో కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఒకటి. ఈ టీమ్ తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా మట్టికరిపించగలదు. ఇప్పటివరకు 16 సీజన్లు ఆడి 7 సార్లు ప్లేఆఫ్స్కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్కు వెళ్లి రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది. గంభీర్ సారథ్యంలో 2012 ఫైనల్లో సీఎస్కేను, 2014 ఫైనల్లో పంజాబ్ను ఓడించి టైటిల్ను అందుకుంది. 2021 ఫైనల్లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. 2017, 2018లో 3వ స్థానం.. 2011, 2016లో నాలుగో స్థానంలో నిలిచింది.
సన్రైజర్స్ హైదరాబాద్
సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఇప్పటివరకు 11 సీజన్లలో పాల్గొని ఆరుసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ 2016 ఫైనల్లో ఆర్సీబీని ఓడించి తొలి టైటిల్ను అందుకుంది. 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో మాత్రం సన్రైజర్స్కు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. 2020లో మూడో స్థానం, 2013, 2017, 2019లో నాలుగో స్థానంలో నిలిచింది.
దిల్లీ క్యాపిటల్స్
దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఇప్పటివరకు 16 సీజన్లలో బరిలోకి దిగి ఆరుసార్లు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. ఈ జట్టు ఒకే ఒక్కసారి (2020)లో ఫైనల్కు చేరింది. ముంబయి ఇండియన్స్తో జరిగిన తుదిపోరులో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. 2009, 2012, 2019, 2021లో మూడో స్థానం, 2008లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక.. ఇతర జట్లలో అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ 14 ఎడిషన్లలో పాల్గొని ఐదుసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. గుజరాత్ టైటాన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్కు చేరాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ 16 సీజన్లలో ఆడి రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు వచ్చింది. 2014లో కేకేఆర్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. 2008లో మూడో స్థానం దక్కించుకుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్