IPL 2024: ఐపీఎల్.. లీగ్ చరిత్రలో అత్యధికసార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్లు ఇవే!
ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ మార్చి 22న సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్తో ప్రారంభంకానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్-2024 (IPL 2024)సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఛాంపియన్గా నిలవడానికి పది జట్లూ సర్వశక్తులు ఒడ్డుతాయి. కానీ, కొన్ని మాత్రమే టాప్-4లో నిలిచి టైటిల్ రేసులో నిలబడతాయి. మరి లీగ్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం..
ముంబయి ఇండియన్స్
ఐపీఎల్లో ఎక్కువసార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians). ఇప్పటివరకు 16 ఎడిషన్లలో బరిలోకి దిగిన ముంబయి.. 10సార్లు ప్లేఆఫ్స్కు, ఆరుసార్లు ఫైనల్స్కు దూసుకెళ్లింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ను అందుకుంది. ఈ ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవే. 2010లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. 2011లో మూడో స్థానం, 2012, 2014, 2023లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎక్కువసార్లు (5) ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టు ముంబయే. 2023లో సీఎస్కే ఛాంపియన్గా నిలిచి ఐదుసార్లు టైటిల్ అందుకున్న రెండో జట్టుగా నిలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్లో అత్యధికసార్లు ప్లేఆఫ్స్ ఆడిన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). 14 సీజన్లలో లీగ్లో పాల్గొన్న సీఎస్కే రికార్డుస్థాయిలో 12సార్లు ప్లేఆఫ్స్కు చేరింది. 2020, 2022లో మాత్రమే ఆ జట్టు టాప్-4లో నిలవలేదు. అత్యధిక (10) సార్లు ఫైనల్స్ ఆడిన రికార్డు చెన్నై పేరిటే ఉంది. ఐదుసార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్గా నిలిచింది. ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్తో సరిపెట్టుకుంది. 2009లో సెమీఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 2014లో రెండో క్వాలిఫయర్లో పంజాబ్ చేతిలో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండు సీజన్లలో (2016, 2017) సీఎస్కేపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్లో విశేషమైన అభిమానగణం ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒకటి. జట్టు నిండా ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నా ఆ జట్టుకు ఇప్పటివరకు టైటిల్ కల నెరవేరలేదు. ఆర్సీబీ ఇప్పటివరకు 16 సీజన్లలో పాల్గొని ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్కు చేరి చివరి మెట్టుపై బోల్తాపడింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో సీఎస్కే, 2016లో సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. 2010, 2015, 2022లో 3వ స్థానం, 2020, 2021లో నాలుగో స్థానంలో నిలిచింది.
కోల్కతా నైట్రైడర్స్
ఐపీఎల్లో ప్రమాదకరమైన జట్లలో కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఒకటి. ఈ టీమ్ తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా మట్టికరిపించగలదు. ఇప్పటివరకు 16 సీజన్లు ఆడి 7 సార్లు ప్లేఆఫ్స్కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్కు వెళ్లి రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది. గంభీర్ సారథ్యంలో 2012 ఫైనల్లో సీఎస్కేను, 2014 ఫైనల్లో పంజాబ్ను ఓడించి టైటిల్ను అందుకుంది. 2021 ఫైనల్లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. 2017, 2018లో 3వ స్థానం.. 2011, 2016లో నాలుగో స్థానంలో నిలిచింది.
సన్రైజర్స్ హైదరాబాద్
సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఇప్పటివరకు 11 సీజన్లలో పాల్గొని ఆరుసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ 2016 ఫైనల్లో ఆర్సీబీని ఓడించి తొలి టైటిల్ను అందుకుంది. 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో మాత్రం సన్రైజర్స్కు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. 2020లో మూడో స్థానం, 2013, 2017, 2019లో నాలుగో స్థానంలో నిలిచింది.
దిల్లీ క్యాపిటల్స్
దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఇప్పటివరకు 16 సీజన్లలో బరిలోకి దిగి ఆరుసార్లు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. ఈ జట్టు ఒకే ఒక్కసారి (2020)లో ఫైనల్కు చేరింది. ముంబయి ఇండియన్స్తో జరిగిన తుదిపోరులో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. 2009, 2012, 2019, 2021లో మూడో స్థానం, 2008లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక.. ఇతర జట్లలో అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ 14 ఎడిషన్లలో పాల్గొని ఐదుసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. గుజరాత్ టైటాన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్కు చేరాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ 16 సీజన్లలో ఆడి రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు వచ్చింది. 2014లో కేకేఆర్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. 2008లో మూడో స్థానం దక్కించుకుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం