Tilak Varma: వన్డే ప్రపంచ కప్... 2003, 2019 సీన్ రిపీట్ అవుతుందా?
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో బరిలోకి దిగబోయే భారత జట్టు (Team India)ను BCCI సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అందులో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma)కు చోటు దక్కలేదు. దీంతో 2003, 2019 ప్రపంచకప్ సమయంలో ఇలాగే తెలుగు క్రికెటర్లకు చోటు దక్కని అంశాలు చర్చలోకి వచ్చాయి.
క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడికీ అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడటం ప్రథమ లక్ష్యమైతే.. ఆ తర్వాత ప్రపంచకప్ ఆడటం.. జట్టుతో పాటు కప్పు అందుకోవడం కల. టీ20ల్లో కూడా ప్రపంచకప్ ఉన్నా, సుదీర్ఘ చరిత్ర కలిగిన వన్డే ప్రపంచకప్ అంటే చాలా ప్రత్యేకం. ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం అందినట్లే అంది చేజారితే కలిగే బాధ అంతా ఇంతా కాదు. తెలుగు గడ్డ నుంచి ఈ అవకాశం త్రుటిలో చేజార్చుకున్న క్రికెటర్లు కొందరున్నారు. ఆయా సందర్భాల్లో వారికి అన్యాయం జరిగిందని తెలుగు వాళ్లే కాదు.. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఫీలయ్యారు. సెలక్షన్లో జరిగిన ఈ తప్పిదం టోర్నీలో జట్టు అవకాశాలను కూడా దెబ్బ తీయడం గమనార్హం. 2003లో వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman)కు, 2019లో అంబటి రాయుడి (Ambati Rayudu)కి ఇలాంటి అన్యాయమే జరిగింది. అది జట్టుకూ చేటు చేసింది. ఇప్పుడు తిలక్ వర్మ (Tilak Varma) విషయంలోనూ సెలక్టర్లు తప్పు చేశారా అనే చర్చ జరుగుతోంది.
20 ఏళ్లు వెనక్కి వెళ్తే..
2003 వన్డే ప్రపంచకప్నకు ముందు ఏం జరిగిందో.. అప్పటి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్తో టెస్టుల్లో ఆల్ టైం గ్రేట్స్లో ఒకడిగా పేరు తెచ్చుకోవడమే కాక వన్డే జట్టులోనూ స్థానం సంపాదించిన వీవీఎస్ లక్ష్మణ్.. ఈ ఫార్మాట్లోనూ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి మేటి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాపై నిలకడగా రాణించాడు. దీంతో వన్డే ప్రపంచకప్లో లక్ష్మణ్ కచ్చితంగా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ, సెలక్షన్ కమిటీ అతడికే కాక అభిమానులకూ పెద్ద షాకిచ్చింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్నకు లక్ష్మణ్ను కాదని దినేశ్ మోంగియాను ఎంపిక చేసింది.
ప్రపంచకప్కు ముందు ప్రదర్శన చూసుకుంటే కచ్చితంగా లక్ష్మణే.. దినేశ్ కన్నా మెరుగైన ఆటగాడని ఎవ్వరైనా ఒప్పుకొంటారు. కానీ, సెలక్టర్లు మాత్రం మన లక్ష్మణ్కు మొండిచేయి చూపించారు. తెలుగు వాళ్లే కాక.. దేశవ్యాప్తంగా మెజార్టీ క్రికెట్ అభిమానుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఆ ప్రపంచకప్లో దినేశ్ మోంగియా పెద్దగా సాధించిందేమీ లేదు. భారత్ ఓటమి పాలైన ఫైనల్ సహా అతను ఆడిన ఏ మ్యాచ్లోనూ రాణించలేదు. దినేశ్ 11 మ్యాచ్ల్లో కేవలం 20 సగటుతో 120 పరుగులే చేయడంతో లక్ష్మణ్ను ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పిదమని తేలింది.
నాలుగేళ్ల ముందు..
2019 ప్రపంచకప్ ముంగిట అంబటి రాయుడికి జరిగిన అన్యాయంపై పెద్ద చర్చే జరిగింది. అప్పుడు చీఫ్ సెలక్టర్ తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాదే. అప్పటికే టీమ్ ఇండియాకు కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ మెరుగైన ప్రదర్శనే చేశాడు రాయుడు. అతడి వన్డే సగటు 47 కావడం గమనార్హం. ఐతే చివరగా ఆడిన ఓ సిరీస్లో మాత్రమే రాయుడు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఆ మాత్రానికే సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టేశారు. మిడిలార్డర్లో సత్తా చాటగల అనుభవం, నైపుణ్యం ఉన్నా సరే రాయుడిని పక్కన పెట్టేశారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడతాడని.. ‘త్రీడీ ప్లేయర్’ అంటూ తమిళనాడు ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎంపిక చేసింది ప్రసాద్ కమిటీ. కానీ అతను ఏ డైమన్షన్లోనూ జట్టుకు ఉపయోగపడలేదు. పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారాడు. శంకర్ వల్ల జట్టు సమతూకమే దెబ్బతింది. విజయ్ ఫెయిలయ్యాడని దినేశ్ కార్తీక్ను ఆడిస్తే అతనూ తేలిపోయాడు. న్యూజిలాండ్తో సెమీఫైనల్లో ఓడి జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్లో రాయుడు ఉంటే కథ వేరుగా ఉండేదన్న అభిప్రాయం అభిమానుల్లోనే కాక విశ్లేషకుల్లోనూ వ్యక్తమైంది.
మరి ఇప్పుడు?
ఇక వర్తమానంలోకి వస్తే.. ఈసారి హైదరాబాద్ నుంచి మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అతను కొన్నేళ్లుగా జట్టులో కీలక బౌలర్గా ఉన్నాడు. కానీ తనతో పాటు తెలుగు గడ్డ నుంచి తిలక్ వర్మ కూడా ప్రపంచకప్లో ఆడతాడని అభిమానులు ఆశించారు. ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో అతను అదరగొట్టాడు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి కూడా వచ్చాడు. ఈ మధ్యే వెస్టిండీస్తో టీ20 సిరీస్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్లో ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలో పట్టుదలతో నిలిచాడు. 5 మ్యాచ్ల్లో 58 సగటుతో 173 పరుగులు చేశాడు. దీంతో అనూహ్యంగా ప్రపంచకప్ రేసులోకి వచ్చాడు. ఆసియా కప్ వన్డే టోర్నీకి ఎంపిక కావడంతో తిలక్ ప్రపంచకప్లో ఆడటంపై ఆశలు రేగాయి.
కానీ చివరికి అనుభవం లేదని అతడిని పక్కన పెట్టేశారు. ఫిట్నెస్పై సందేహాలున్నప్పటికీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు అవకాశమిచ్చారు. మరోవైపు వన్డేల్లో సాధారణ ప్రదర్శన చేసిన, ఎన్నో అవకాశాలిచ్చినా ఉపయోగించుకోని సూర్యకుమార్ కూడా ఎంపికయ్యాడు. ఆసియా కప్లో తిలక్ను ఆడించి, ఒకవేళ అతను రాణిస్తే ప్రపంచకప్నకు ఎంపిక చేసి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరంగేట్రంలోనే సీనియర్లను మించి చక్కటి ప్రదర్శన చేసిన తిలక్ను అనుభవం లేదని పక్కన పెట్టడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోసారి ప్రపంచకప్లో తెలుగు క్రికెటర్కు మొండిచేయి చూపించిన టీమ్ఇండియా.. ఈ విషయంలో చింతించే పరిస్థితి వస్తుందేమో చూద్దాం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్