Praggnanandhaa: అమ్మానాన్న చిరకాల కల నెరవేరింది.. థాంక్యూ మహీంద్రా సర్: ప్రజ్ఞానంద
ఆనంద్ మహీంద్రా కారణంగా తన తల్లిదండ్రుల చిరకాల కోరిక తీరిందని అంటున్నాడు మన చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద (Praggnanandhaa). మహీంద్రా ఆఫర్కు ధన్యవాదాలు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెస్ ప్రపంచకప్ (Chess Worldcup) ఫైనల్లో రన్నరప్గా నిలిచినా సరే.. తన ప్రతిభతో కోట్లాది మంది భారతీయుల మనసులు గెల్చుకున్నాడు చెన్నై చిన్నోడు ప్రజ్ఞానంద (Praggnanandhaa). అయితే ఫైనల్ పోరులో టైటిల్ చేజార్చుకున్నప్పటికీ.. అతడి తల్లిదండ్రుల చిరకాల కల మాత్రం నెరవేరిందట. దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)నే కారణమంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఫిడె చెస్ వరల్డ్ కప్ (FIDE Chess World cup)లో రన్నరప్గా నిలిచిన ప్రజ్ఞానంద (Praggnanandhaa)ను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఇటీవల ఓ బహుమతి ప్రకటించారు. అతడి తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్ బాబుకు XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించారు. దీనికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజురికర్ స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా ఆలోచనను అభినందించారు. వెంటనే XUV400 ప్రత్యేక ఎడిషన్ ఈవీని అతడి తల్లిదండ్రులకు డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా గిఫ్ట్..
దీనిపై ప్రజ్ఞానంద స్పందిస్తూ ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘‘ధన్యవాదాలు చెప్పేందుకు నాకు మాటలు కూడా రావట్లేదు. ఈవీ కారును కొనుగోలు చేయాలనేది మా అమ్మానాన్న చిరకాల కల. దాన్ని నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రా సర్, రాజేశ్ సర్కు కృతజ్ఞతలు’’ అని ప్రజ్ఞానంద ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.. ‘‘కార్లు తయారీదారుల అంతిమ లక్ష్యం.. కస్టమర్ల కలలను నెరవేర్చడమే’’ అంటూ రాసుకొచ్చారు.
ఇక, చెస్ ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచినా.. తన ప్రతిభతో ఎంతో మందికి స్ఫూర్తిగా మారిన ప్రజ్ఞానందకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న అతడిని రాష్ట్ర క్రీడా శాఖ అధికారులు దగ్గరుండి స్వాగతించారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!