Delhi Vs Kolkata: మేం అనుకున్న స్కోరు ఇది కాదు.. 270+ పరుగులు చేయడంపై శ్రేయస్
ఐపీఎల్లో కోల్కతా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. వైజాగ్లో దిల్లీని వందకుపైగా పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరు సాధించిన జట్టుగా కోల్కతా నిలిచింది. వారం రోజుల కిందట హైదరాబాద్ చేసిన 277 పరుగులకు కాస్త దగ్గరగా వచ్చినా ఆ రికార్డును అధిగమించలేదు. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో దిల్లీ జట్టుపై 106 పరుగుల తేడాతో శ్రేయస్ నాయకత్వంలోని కోల్కతా విజయం సాధించింది. తొలుత కోల్కతా 272/7 స్కోరు చేయగా.. దిల్లీ 166 పరుగులే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల సారథులు మాట్లాడారు. భారీ రికార్డును అధిగమిస్తారని భావించారా? అన్న ప్రశ్నకు శ్రేయస్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
‘‘అలాంటిదేమీ లేదు. మా ప్రారంభం చూశాక కచ్చితంగా 220 పరుగుల వరకు చేస్తామని అనుకున్నాం. కానీ, 270 సాధించడం చాలా బాగుంది. భారీ స్కోరు రికార్డు మిస్ అయినందుకు ఏమాత్రం బాధ లేదు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం ఎప్పుడూ రిస్కే. అయితే, ఇంతకుముందే చెప్పినట్లు సునీల్ నరైన్ ప్రత్యర్థి బౌలింగ్పై రెచ్చిపోతే మా పని ఇంకా తేలికవుతుంది. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడేస్తాడు. పరిస్థితికి అనుగుణంగా ఆడటం అతడి స్పెషాలిటీ. భారీ లక్ష్యం నిర్దేశించినా బౌలింగ్ సరిగ్గా లేకపోతే ఓటమి భయం ఉంటుంది. కానీ, మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. బాధ్యతగా ప్రత్యర్థిని కట్టడి చేసి విజయాన్ని అందించారు. యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం పరిస్థితి ఇంకా తెలియదు. భుజం నొప్పితో బాధపడుతున్నట్లుగా ఉంది. వైభవ్ అరోరా కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి కారణమయ్యాడు. వరుసగా మూడు విజయాలు నమోదు చేయడం ఆనందంగా ఉంది. కానీ, నేల విడిచి సాము చేయం. ఎందుకంటే ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు’’ అని శ్రేయస్ వెల్లడించాడు.
మా బౌలర్లకు కలిసి రాలేదు: పంత్
‘‘మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. కానీ, ప్రణాళికలు అనుకున్న విధంగా సాగలేదు. మరింత బాగా బౌలింగ్ చేయగల సత్తా మాకుంది. తప్పకుండా తదుపరి మ్యాచుల్లో నాణ్యమైన ప్రదర్శన చేస్తాం. కొన్ని డీఆర్ఎస్లను తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాం. హోరెత్తిన అభిమానంతోపాటు డీఆర్ఎస్ టైమర్ను స్క్రీన్పై సరిగ్గా చూపకపోవడం వల్ల తీసుకోలేకపోయాం. స్క్రీన్కు సంబంధించి సమస్య ఉత్పన్నమైనట్లుంది. అక్షర్ పటేల్కు ఒక్క ఓవర్ మాత్రమే ఇవ్వడానికి కారణముంది. స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు వేయించకూడదని ముందే భావించాం. ఫాస్ట్ బౌలర్లు మరీ ఎక్కువగా పరుగులు ఇచ్చేశారు. తప్పకుండా పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుంటాం. వ్యక్తిగతంగా నా ఫిట్నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి రోజును ఆస్వాదిస్తున్నా. క్రికెట్లో ఎత్తుపల్లాలు సహజం. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతూ ఉండాలి’’ అని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!