Asian Games-Ram Baboo: కూలీ నుంచి ఆసియా క్రీడల పతకం దాకా!
అతడు ఒకప్పుడు కూలీ.. తర్వాత హోటల్లోనూ వెయిటర్గా, కొరియర్ కంపెనీలో వర్కర్గా పని చేశాడు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం గెలుస్తాడని ఎవరైనా అనుకుంటారా! కానీ ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్బాబు (Ram Baboo) దీన్ని నిజం చేశాడు.
అతడు ఒకప్పుడు కూలీ.. తర్వాత హోటల్లోనూ వెయిటర్గా, కొరియర్ కంపెనీలో వర్కర్గా పని చేశాడు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం గెలుస్తాడని ఎవరైనా అనుకుంటారా! కానీ ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్బాబు (Ram Baboo) దీన్ని నిజం చేశాడు. 35 కిలోమీటర్ల నడక మిక్స్డ్ ఈవెంట్లో మంజు రాణితో కలిసి అతడు కాంస్యాన్ని సాధించాడు. పట్టుదల ఉంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. సమస్యలు ఎదురైనా కలలుగన్న లక్ష్యానికి చేరొచ్చని నిరూపించాడు.
పల్లె నుంచి వచ్చి
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా బౌవార్ పల్లెకు చెందిన రామ్బాబు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి బాల్యమంతా పొలం గట్ల మీదా సాగిపోయింది. అక్కడే పరుగులు తీసేవాడు. ఇదే అతడిని రాటుదేల్చింది. ఒక సహజసిద్ధమైన అథ్లెట్గా మార్చింది. 2012 లండన్ ఒలింపిక్స్లో భారత ప్రదర్శన రామ్బాబు మీద గట్టి ప్రభావమే చూపించింది. ఎలాగైనా తానూ మారథాన్ అథ్లెట్ కావాలని కలలు కన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించాలని భావించాడు. కానీ అతడి నేపథ్యం కలలకే పరిమితం చేసేలా కనిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నాడు.
కూలీకెళ్లి.. వెయిటర్గా పని చేసి
తన కలను నెరవేర్చుకోవడం కోసం రామ్బాబు రకరకాల పనులు చేసేవాడు.. వచ్చిన డబ్బులలో కొన్ని దాచుకుని టోర్నీల్లో పాల్గొనేవాడు. కుటుంబం కోసం వారణాసిలో హోటల్లో వెయిటర్గా కూడా పని చేశాడు. అంతేకాదు ఒక కొరియర్ కంపెనీలో చేరి జ్యూట్ బ్యాగులను కుట్టే పనిలో కుదిరాడు. ఈ సమయంలోనే ఒలింపియన్ బసంత్ బహుదూర్ రాణా పరిచయడం కావడం రామ్బాబుకు అదృష్టంగా మారింది. మరో కోచ్ సుందర్రాజన్ డబ్బులు పోగేసి రామ్బాబుకు ఇచ్చేవాడు. కానీ కొవిడ్ రూపంలో అతడికి మరో ప్రతిబంధకం ఎదురైంది. దీంతో ప్రాక్టీస్ లేదు. టోర్నీలు లేవు. అతడి కల మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు నాన్నకు అనారోగ్యంగా ఉండడంతో రామ్బాబు కూలీకి కూడా వెళ్లాడు. రోజుకు రూ.300 సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. టోర్నీలకు వెళ్లిన సమయంలో డబ్బులు లేక ఫుట్పాత్ మీదే పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. పస్తులు కూడా ఉన్నాడు. కానీ కోచ్ సుందర్రాజన్ చేసిన ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చేవాడు.
జాతీయ రికార్డు బద్దలుకొట్టి
ఇన్ని ఇబ్బందులు ఎదురైనా రామ్బాబు ఆగలేదు. ప్రాక్టీస్ ఆపలేదు. ఈ కష్టానికి అతడికి త్వరగానే ఫలితం వచ్చింది. గతేడాది జాతీయ క్రీడల్లో 35 కిలోమీటర్ల నడకలో 2 గంటల 36 నిమిషాల 34 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శనే అతడిని ఆసియా క్రీడలకు పంపించింది. అక్కడా అదరగొట్టిన ఈ అథ్లెట్ కాంస్యంతో మెరిసి సత్తా చాటాడు. ఒలింపిక్స్లో పాల్గొనాలనేది రామ్బాబుకు పెద్ద కల. వచ్చే ఏడాది పారిస్లోనే ఈ కలను సాకారం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్