Hardik Pandya: అతడే వ్యత్యాసం.. స్టంప్స్ వెనుక మాస్టర్మైండ్: హార్దిక్ పాండ్య
హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్దామని భావించిన ముంబయికి ఓటమి ఎదురైంది. వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై అద్భుత విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదున్న ముంబయికి చుక్కెదురైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ సాధించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. చెన్నై యువ బౌలర్ పతిరన (Patirana) నాలుగు వికెట్లు తీసి ముంబయిని దెబ్బ కొట్టాడు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తేలిపోయాడు. కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. తమ ఓటమిపై పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఈ టార్గెట్ను ఛేదించగలిగిందే. చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసింది. మాకు, వారికి పతిరన ప్రదర్శనే ప్రధాన వ్యత్యాసం. ప్రణాళికలకు తగ్గట్టు చెన్నై ఆడింది. అక్కడ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనీకి తెలుసు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ కఠినంగా మారింది. లక్ష్య ఛేదనలో మేం దూకుడుగానే వెళ్లాం. ఎప్పుడైతే పతిరన బౌలింగ్కు వచ్చి రెండు వికెట్లు తీశాడో.. అప్పుడు కాస్త వెనుకడుగు వేశాం. తొలుత చెన్నై బ్యాటింగ్ సమయంలోనూ బౌలింగ్లో మార్పులు చేయడానికి కారణముంది. శివమ్ దూబె స్పిన్ కంటే సీమ్ బౌలింగ్లో ఇబ్బంది పడతాడు. అతడు బ్యాటింగ్ చేసే సమయంలో పేసర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఓటమి నుంచి బయటపడి మిగతా మ్యాచ్ల కోసం సన్నద్ధమవుతాం. తర్వాత నాలుగు మ్యాచ్లు కూడా ప్రత్యర్థుల సొంత మైదానాల్లో తలపడనున్నాం’’ అని హార్దిక్ తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో ముంబయి తరఫున రోహిత్కిది రెండో సెంచరీ. ఆ జట్టు తరఫున మూడో అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో రోహిత్ 105 పరుగులు చేశాడు. సనత్ జయసూర్య (2008లో) చెన్నైపైనే 114* పరుగులు చేశాడు.
- ఈ మ్యాచ్లో రోహిత్ ఐదు సిక్స్లు బాదాడు. దీంతో టీ20ల్లో 500+ సిక్స్లు కొట్టిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. క్రిస్ గేల్ (1059) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
- ఐపీఎల్లో సెంచరీ చేసినా జట్టు గెలవని మూడో సందర్భం ఇదే. అంతకుముందు పంజాబ్పై (2021లో) సంజూ శాంసన్ 119 పరుగులు, ముంబయిపై (2010లో) యూసఫ్ పఠాన్ 100* పరుగులు చేశారు.
- ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ముంబయితో జరిగిన ఆరు మ్యాచుల్లో చెన్నై ఐదింట్లో విజయం సాధించింది. ఈ ఎడిషన్లో బయటి మైదానాల్లో చెన్నైకిదే తొలి గెలుపు.
- ఐపీఎల్ 2024 సీజన్లో బుమ్రా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మొత్తం 8 ఓవర్లు వేసి 6 వికెట్లు పడగొట్టాడు. కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
- మిడిల్ ఓవర్లలో (7 నుంచి 16) అత్యధిక స్ట్రైక్రేట్ కలిగిన మొదటి ఆటగాడిగా శివమ్ దూబె (166.08) నిలిచాడు. పరుగుల పరంగా రెండో స్థానంలో ఉన్నాడు. దూబె 191 పరుగులు చేయగా.. రియాన్ పరాగ్ (220) ముందున్నాడు.
- సీఎస్కే తరఫున ఐపీఎల్లో అతి తక్కువ వయసులో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్ పతిరన. అతడు 21 ఏళ్ల 118 రోజుల వయసులో ముంబయిపై (4/28) అదరగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం