Hardik Pandya: అతడే వ్యత్యాసం.. స్టంప్స్ వెనుక మాస్టర్మైండ్: హార్దిక్ పాండ్య
హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్దామని భావించిన ముంబయికి ఓటమి ఎదురైంది. వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై అద్భుత విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదున్న ముంబయికి చుక్కెదురైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ సాధించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. చెన్నై యువ బౌలర్ పతిరన (Patirana) నాలుగు వికెట్లు తీసి ముంబయిని దెబ్బ కొట్టాడు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తేలిపోయాడు. కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. తమ ఓటమిపై పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఈ టార్గెట్ను ఛేదించగలిగిందే. చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసింది. మాకు, వారికి పతిరన ప్రదర్శనే ప్రధాన వ్యత్యాసం. ప్రణాళికలకు తగ్గట్టు చెన్నై ఆడింది. అక్కడ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనీకి తెలుసు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ కఠినంగా మారింది. లక్ష్య ఛేదనలో మేం దూకుడుగానే వెళ్లాం. ఎప్పుడైతే పతిరన బౌలింగ్కు వచ్చి రెండు వికెట్లు తీశాడో.. అప్పుడు కాస్త వెనుకడుగు వేశాం. తొలుత చెన్నై బ్యాటింగ్ సమయంలోనూ బౌలింగ్లో మార్పులు చేయడానికి కారణముంది. శివమ్ దూబె స్పిన్ కంటే సీమ్ బౌలింగ్లో ఇబ్బంది పడతాడు. అతడు బ్యాటింగ్ చేసే సమయంలో పేసర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఓటమి నుంచి బయటపడి మిగతా మ్యాచ్ల కోసం సన్నద్ధమవుతాం. తర్వాత నాలుగు మ్యాచ్లు కూడా ప్రత్యర్థుల సొంత మైదానాల్లో తలపడనున్నాం’’ అని హార్దిక్ తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో ముంబయి తరఫున రోహిత్కిది రెండో సెంచరీ. ఆ జట్టు తరఫున మూడో అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో రోహిత్ 105 పరుగులు చేశాడు. సనత్ జయసూర్య (2008లో) చెన్నైపైనే 114* పరుగులు చేశాడు.
- ఈ మ్యాచ్లో రోహిత్ ఐదు సిక్స్లు బాదాడు. దీంతో టీ20ల్లో 500+ సిక్స్లు కొట్టిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. క్రిస్ గేల్ (1059) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
- ఐపీఎల్లో సెంచరీ చేసినా జట్టు గెలవని మూడో సందర్భం ఇదే. అంతకుముందు పంజాబ్పై (2021లో) సంజూ శాంసన్ 119 పరుగులు, ముంబయిపై (2010లో) యూసఫ్ పఠాన్ 100* పరుగులు చేశారు.
- ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ముంబయితో జరిగిన ఆరు మ్యాచుల్లో చెన్నై ఐదింట్లో విజయం సాధించింది. ఈ ఎడిషన్లో బయటి మైదానాల్లో చెన్నైకిదే తొలి గెలుపు.
- ఐపీఎల్ 2024 సీజన్లో బుమ్రా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మొత్తం 8 ఓవర్లు వేసి 6 వికెట్లు పడగొట్టాడు. కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
- మిడిల్ ఓవర్లలో (7 నుంచి 16) అత్యధిక స్ట్రైక్రేట్ కలిగిన మొదటి ఆటగాడిగా శివమ్ దూబె (166.08) నిలిచాడు. పరుగుల పరంగా రెండో స్థానంలో ఉన్నాడు. దూబె 191 పరుగులు చేయగా.. రియాన్ పరాగ్ (220) ముందున్నాడు.
- సీఎస్కే తరఫున ఐపీఎల్లో అతి తక్కువ వయసులో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్ పతిరన. అతడు 21 ఏళ్ల 118 రోజుల వయసులో ముంబయిపై (4/28) అదరగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
హ్యాట్రిక్పై కన్నేసిన దిల్లీకి షాక్ తగిలింది. ఐపీఎల్ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్