Cricket News: ఈసారైనా.. టైటిల్ కల నెరవేరేనా?
ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. తొలి ఎడిషన్ నుంచి ఆడుతున్న మూడు జట్లు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ను ముద్దాడలేకపోయాయి.
రెండేళ్ల కిందట ఐపీఎల్లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ గెలిచింది గుజరాత్. ఆ జట్టులో బడా బడా స్టార్లేమీ లేరు. అయినా సమష్టిగా ఆడి విజేతగా నిలిచింది. కానీ ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతూ.. 16 సీజన్లుగా పోరాటం సాగిస్తూనే ఉన్నా.. మూడు జట్లకు టైటిల్ కలగానే ఉంది. అప్పుడప్పుడూ చక్కటి ప్రదర్శన చేసి కప్పుపై ఆశలు రేకెత్తించడమే కానీ.. ఆ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాయి ఆ మూడు జట్లు. అవే.. బెంగళూరు, దిల్లీ , పంజాబ్. మరి ఈసారైనా ఈ మూడు జట్లలో ఒకటి కప్పు నెగ్గుతుందా? వాటి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఓసారి చూద్దాం పదండి.
ఆర్సీబీ.. అదో వ్యథ
ఐపీఎల్లో అత్యంత ఆకర్షణీయ జట్లలో బెంగళూరు ఒకటి. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ సాధించిన కోల్కతా, ఒక్కోసారి కప్పు నెగ్గిన రాజస్థాన్, హైదరాబాద్ కంటే ఈ జట్టుకు ఆకర్షణ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లయిన చెన్నై, ముంబయి జట్లకు ఏమాత్రం తీసిపోని ఆకర్షణ ఆ జట్టు సొంతం. ఇక బెంగళూరు ఎప్పుడూ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుంటుంది. కాగితం మీద ఆ జట్టు ఎంతో బలంగా కనిపిస్తుంది. ప్రతిసారీ ఫేవరెట్లలో ఒకటిలా కనిపిస్తుంది. ఐతే ఎంత ప్రయత్నించినా ఇప్పటిదాకా టైటిల్ను గెలవలేకపోయింది. 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఆ జట్టు టైటిల్కు అత్యంత చేరువగా వెళ్లింది. కానీ ఫైనల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కెప్టెన్గా చాలా సీజన్లు జట్టును ముందుండి నడిపించాడు. కానీ కప్పును అందుకోలేకపోయాడు. గత రెండు సీజన్ల నుంచి అతను ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
డుప్లెసిస్ నేతృత్వంలో కూడా గత రెండు సీజన్లలో టైటిల్ సాధించలేకపోయింది ఆర్సీబీ. ఐతే ఈసారి కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్ లాంటి మేటి ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకుని బలం పెంచుకుంది. ఇక కోహ్లికి తోడు డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఉండనే ఉన్నారు. ఇంకా లాకీ ఫెర్గూసన్, అల్జారి జోసెఫ్, సిరాజ్, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మలతో బౌలింగ్ కూడా మెరుగ్గానే ఉంది. మొత్తంగా ఛాంపియన్ జట్టుకు ఉండాల్సిన బలం ఆ జట్టులో కనిపిస్తోంది. కావాల్సిందల్లా మైదానంలో ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు, సమష్టిగా ఆడడమే. ఈ ఏడాది మహిళల ఆర్సీబీ జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో ఆ ఉత్సాహంలో కప్పు గెలుస్తామని విరాట్ కోహ్లి చెప్పాడు. అయితే, తొలి మ్యాచ్లోనే చెన్నై చేతిలో ఓటమిపాలైంది. మరి మిగతా మ్యాచుల్లో విజయం సాధించి కోహ్లీ మాటను నిజం చేస్తారో లేదో చూడాలి.
దిల్లీ.. ఛాన్సుంది కానీ
ఐపీఎల్ ఆరంభం నుంచి దిల్లీ ప్రదర్శన పర్వాలేదనే చెప్పాలి. 16 సీజన్లలో ఆరుసార్లు సెమీస్/ప్లేఆఫ్స్ చేరింది. 2020లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. కానీ కప్పు గెలవలేకపోయింది. మొదట దిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్న ఆ జట్టు 2018లో దిల్లీ క్యాపిటల్స్గా మారింది. అప్పుడే జట్టు స్వరూపం కూడా చాలా వరకు మారింది. 2020లో శ్రేయస్ అయ్యర్ జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. కానీ కప్పు అందించలేకపోయాడు. తర్వాతి సీజన్కు అతను పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పంత్ కెప్టెన్ అయ్యాడు. అతడి సారథ్యంలో ప్లేఆఫ్స్ చేరుకుంది కానీ.. అంతకుమించి ముందంజ వేయలేకపోయింది. 2022లో లీగ్ దశ దాటలేదు. నిరుడు రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ ఐపీఎల్ ఆడలేదు. వార్నర్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ ఏడాది పంత్ పునరాగమనం చేస్తున్నాడు. అతడితో పాటు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్లతో దిల్లీ బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పేసర్ జే రిచర్డ్సన్కు తోడు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్లతో బౌలింగ్ పర్వాలేదనిపిస్తోంది. దిల్లీ జట్టును తీసిపడేయలేం. అలా అని మరీ గొప్పగానూ కనిపించడం లేదు. సమష్టిగా ఆడడం ఆ జట్టు బలం. అలాగే ఆడి అన్నీ కలిసి వస్తే ఛాంపియన్ కాగలదు. చూద్దాం ఏమవుతుందో?
పంజాబ్.. అద్భుతం జరగాలి
ఐపీఎల్లో ఆట పరంగా, ఆకర్షణ పరంగా దిగువన ఉండే జట్టు పంజాబ్. ఒకప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్గా ఉన్న ఆ జట్టు.. దిల్లీ తరహాలోనే పేరు మార్చుకుంది. కానీ అదేమీ పెద్దగా కలిసి రాలేదు. ఇన్నేళ్లలో పంజాబ్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. 2014లో జార్జ్ బెయిలీ ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఆ సీజన్లలో మెరుపులు మెరిపించి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఫైనల్లో నిరాశ తప్పలేదు. ఆ తర్వాత తొమ్మిది సీజన్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేదు పంజాబ్. ఈ తొమ్మిదేళ్లలో చాలామంది కెప్టెన్లు మారారు. జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. అలాగే పేరూ మారింది. కానీ ఫలితం మాత్రం మారలేదు. ప్రస్తుతం ఆ జట్టు శిఖర్ ధావన్ నేతృత్వంలో ఆడుతోంది. ఆ జట్టు ప్రధానంగా విదేశీ ఆల్రౌండర్లను నమ్ముకుంది. కొన్నేళ్లుగా పంజాబ్కు ఆడుతున్న లివింగ్స్టన్కు తోడు సామ్ కరన్, సికందర్ రజా, క్రిస్ వోక్స్ ఆ జట్టు ఆల్రౌండ్ బలాన్ని పెంచుతున్నారు. వీరికి తోడు రబాడ, అర్ష్దీప్, ఎలిస్లతో పేస్ బౌలింగ్ కూడా బాగుంది. కానీ చాలా ఏళ్ల నుంచి పంజాబ్ సమస్య ఏంటంటే.. జట్టుతత్వం కొరవడడం, సమష్టిగా రాణించలేకపోవడం. పదే పదే కెప్టెన్లను మార్చడం కూడా ఆ జట్టుకు సమస్యగా మారింది. ప్రస్తుత కెప్టెన్ ధావన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. మరి అతడి సారథ్యంలో పంజాబ్ పుంజుకుని.. మిగతా జట్ల పోటీని తట్టుకుని కప్పు గెలవాలంటే అద్భుతమే జరగాలి. కానీ ఎప్పుడూ ఎవరి అవకాశాలనూ కొట్టిపారేయలేం కాబట్టి పంజాబ్ అద్భుతమే చేసి కప్పు గెలుస్తుందేమో చూడాలి.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం