ODI WC 2023 : కివీస్.. పాక్.. అఫ్గాన్.. సెమీస్కి వచ్చే జట్టేది?
వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) లీగ్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీ రసవత్తరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్ : విధ్వంసక వీరుడు మ్యాక్స్వెల్ (Glenn Maxwell) అద్భుత పోరాటంతో అఫ్గానిస్థాన్పై ఆస్ట్రేలియా(AUS vs AFG) చిరస్మరణీయ విజయాన్ని సాధించి సెమీస్లో స్థానం సంపాదించుకుంది. దీంతో సెమీస్లో చేరిన మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకూ ఓటమే ఎరగకుండా దూసుకుపోతున్న టీమ్ఇండియా సెమీస్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా.. రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇక సెమీస్లోకి వచ్చే నాలుగో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది(ODI World Cup 2023 Top 4 Race). మరి ఏయే జట్లు నాలుగో స్థానం కోసం పోటీపడుతున్నాయి.. వాటికి అవకాశాలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే..
సెమీస్లో నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. ఇవన్నీ నాలుగేసి విజయాలతో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. ఒక్కో జట్టు ఇంకో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఇక్కడో ఆస్తకికర విషయం ఏంటంటే.. ఈ మూడు జట్లు తమ తర్వాతి మ్యాచ్ల్లో గెలిచినా.. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్ చేరుతుంది. మూడు జట్లూ ఓడినా.. అప్పుడూ నెట్రన్రేట్ ఆధారంగానే వీటిలో ఒకటి నాలుగో స్థానంలోకి వెళ్తుంది.
న్యూజిలాండ్..
నెట్రన్రేట్ మెరుగ్గా ఉండటతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలుంటాయి. ఇక కివీస్ ఓడితే మాత్రం.. పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. అప్పుడు.. పాక్, అఫ్గాన్ ఓడిపోయి.. నెట్ రన్రేట్ న్యూజిలాండ్కు అనుకూలంగా ఉండాలి.
పాకిస్థాన్..
న్యూజిలాండ్పై భారీ విజయం ఈ జట్టుకు కలిసొచ్చింది. నెట్రన్రేట్ మెరుగుపడటంతో సెమీస్ రేసులో ఉంది. పాక్ తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే పాక్కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడితే.. ఇతర జట్ల ఫలితాలు, నెట్రన్రేట్పై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంది.
నొప్పితోనే మ్యాక్సీ ఆట.. ‘బై రన్నర్’పై చర్చ.. ఐసీసీ రూల్స్ ఏంటంటే..?
అఫ్గానిస్థాన్..
ఈ ప్రపంచకప్లో సంచలన విజయాలతో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న అఫ్గాన్.. మంగళవారం ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ ఓటమి ఆ జట్టు సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే.. 5 విజయాలతో న్యూజిలాండ్, పాకిస్థాన్ల కంటే రేసులో ముందుండేది. మరోవైపు నెట్ రన్రేట్ మైనస్లో ఉండటం కూడా ఈ జట్టుకు ప్రతికూలాంశం. తర్వాతి మ్యాచ్లో బలమైన దక్షిణాఫ్రికాతో తలపడాలి. ఈ మ్యాచ్లో భారీ తేడాతో అఫ్గాన్ గెలవాలి. ఇతర జట్ల ఫలితాలూ తనకు కలిసిరావాలి. అప్పుడే సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.
ఇక ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక సెమీస్ రేసు నుంచి వైదొలగగా.. నెదర్లాండ్స్కు దాదాపు అవకాశాలు లేనట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు