IPL: ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు
ఐపీఎల్ (IPL) 2024 సీజన్కు మార్చి 22న తెర లేవనుంది. ఈ లీగ్లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి.
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు, మేటి విదేశీ క్రికెటర్లు చేసే మెరుపులు విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మ్యాచ్లో బ్యాట్కు, బంతికి మధ్య జరిగే యుద్ధం అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంది. అందుకే ఈ లీగ్కు భారత్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫుల్క్రేజ్ ఉంది. మరి ఐపీఎల్లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులపై ఓ లుక్కేద్దాం.
ఒకే సీజన్లో 973 పరుగులు
విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారించే ఈ మేటి బ్యాటర్ ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2016 సీజన్లో భీకరమైన ఫామ్లో ఉన్న కోహ్లీ 16 మ్యాచ్ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు మరే ఆటగాడు కోహ్లీ 973 పరుగుల రికార్డును బ్రేక్ చేయలేదు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్మన్ గిల్ 2023లో 890 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
వరుసగా 10 విజయాలు
టోర్నీలోనైనా వరుసగా నాలుగైదు మ్యాచ్ల్లో గెలవడం కష్టం. అలాంటిది చివరి బంతి వరకు ఉత్కంఠ సాగే ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయమే. 2014, 2015 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (ఏకంగా వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014లో ఫైనల్తో కలిపి వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన కేకేఆర్.. 2015 సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ గెలుపొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఏ టీమ్ బ్రేక్ చేయలేదు.
ఒకే మ్యాచ్లో 175
ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 సీజన్లో పుణె వారియర్స్పై 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్లు బాది 175 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. వేగవంతమైన సెంచరీ కూడా ఇదే మ్యాచ్లో గేల్ (30 బంతుల్లో) నమోదు చేశాడు. ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక (17) సిక్స్ల రికార్డు కూడా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
12 పరుగులకే 6 వికెట్లు
బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఐపీఎల్లో ఓ బౌలర్ ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టడమే అరుదు. కానీ, అరంగేట్ర మ్యాచ్లోనే ఓ ఆటగాడు ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 2019లో సన్రైజర్స్పై ముంబయి ఇండియన్స్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 3.4 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇది అరంగేట్ర మ్యాచ్లోనే కాకుండా టోర్నీలో చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
ఫాస్టెస్ట్ ఫిప్టీ ఎవరంటే?
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 2023 ఐపీఎల్ సీజన్లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. టోర్నీ చరిత్రలో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరిట ఉంది. 2018లో దిల్లీ క్యాపిటల్స్పై రాహుల్, 2022లో ముంబయి ఇండియన్స్పై 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు.
అమితే ‘హ్యాట్రిక్’ వీరుడు
ఐపీఎల్లో ఒక్కసారి ‘హ్యాట్రిక్’ సాధించడమే కష్టం. కానీ, ఓ బౌలర్ ఏకంగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా 2008లో దిల్లీ డేర్డేవిల్స్కు ప్రాతినిధ్యం వహించి డెక్కన్ ఛార్జర్స్పై తొలి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. 2011లో దిల్లీ తరఫునే ఆడి కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై రెండోసారి ఈ ఫీట్ సాధించాడు. 2013లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి పుణె వారియర్స్పై మూడోసారి ‘హ్యాట్రిక్’ అందుకున్నాడు. అత్యధికసార్లు (3) హ్యాట్రిక్లు సాధించిన బౌలర్ అమిత్ మిశ్రానే.
ఒకే ఓవర్లో 37 పరుగులు
ఏ ఆటగాడికైనా ఒక ఓవర్లో 20 పరుగులు చేయడమే కష్టం. కానీ, ఐపీఎల్లో ఇద్దరూ బ్యాటర్లు ఒకే ఓవర్లో 37 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2011లో కొచ్చి టస్కర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్లో 6, 6 నోబాల్, 4, 4, 6, 6, 4 సాయంతో 37 పరుగులు పిండుకున్నాడు. 2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా 37 రన్స్ చేసి గేల్ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో 6, 6 నోబాల్, 6, 6, 2, 6, 4 సాయంతో ఈ ఫీట్ సాధించాడు. తర్వాత మరే ఆటగాడు ఈ రికార్డును అందుకోలేదు.
అత్యధిక భాగస్వామ్యం ఎవరిదంటే?
ఐపీఎల్లో అత్యధిక (229) పరుగుల భాగస్వామ్యం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ద్వయం పేరిట ఉంది. 2016లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఆర్సీబీ జంట చెలరేగింది. కోహ్లీ (109; 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఏబీ డివిలియర్స్ (129; 53 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్లు) శతకాలతో కదం తొక్కారు. దీంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు