IPL: ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు
ఐపీఎల్ (IPL) 2024 సీజన్కు మార్చి 22న తెర లేవనుంది. ఈ లీగ్లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి.
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు, మేటి విదేశీ క్రికెటర్లు చేసే మెరుపులు విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మ్యాచ్లో బ్యాట్కు, బంతికి మధ్య జరిగే యుద్ధం అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంది. అందుకే ఈ లీగ్కు భారత్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫుల్క్రేజ్ ఉంది. మరి ఐపీఎల్లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులపై ఓ లుక్కేద్దాం.
ఒకే సీజన్లో 973 పరుగులు
విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారించే ఈ మేటి బ్యాటర్ ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2016 సీజన్లో భీకరమైన ఫామ్లో ఉన్న కోహ్లీ 16 మ్యాచ్ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు మరే ఆటగాడు కోహ్లీ 973 పరుగుల రికార్డును బ్రేక్ చేయలేదు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్మన్ గిల్ 2023లో 890 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
వరుసగా 10 విజయాలు
టోర్నీలోనైనా వరుసగా నాలుగైదు మ్యాచ్ల్లో గెలవడం కష్టం. అలాంటిది చివరి బంతి వరకు ఉత్కంఠ సాగే ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయమే. 2014, 2015 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (ఏకంగా వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014లో ఫైనల్తో కలిపి వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన కేకేఆర్.. 2015 సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ గెలుపొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఏ టీమ్ బ్రేక్ చేయలేదు.
ఒకే మ్యాచ్లో 175
ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 సీజన్లో పుణె వారియర్స్పై 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్లు బాది 175 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. వేగవంతమైన సెంచరీ కూడా ఇదే మ్యాచ్లో గేల్ (30 బంతుల్లో) నమోదు చేశాడు. ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక (17) సిక్స్ల రికార్డు కూడా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
12 పరుగులకే 6 వికెట్లు
బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఐపీఎల్లో ఓ బౌలర్ ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టడమే అరుదు. కానీ, అరంగేట్ర మ్యాచ్లోనే ఓ ఆటగాడు ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 2019లో సన్రైజర్స్పై ముంబయి ఇండియన్స్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 3.4 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇది అరంగేట్ర మ్యాచ్లోనే కాకుండా టోర్నీలో చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
ఫాస్టెస్ట్ ఫిప్టీ ఎవరంటే?
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 2023 ఐపీఎల్ సీజన్లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. టోర్నీ చరిత్రలో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరిట ఉంది. 2018లో దిల్లీ క్యాపిటల్స్పై రాహుల్, 2022లో ముంబయి ఇండియన్స్పై 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు.
అమితే ‘హ్యాట్రిక్’ వీరుడు
ఐపీఎల్లో ఒక్కసారి ‘హ్యాట్రిక్’ సాధించడమే కష్టం. కానీ, ఓ బౌలర్ ఏకంగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా 2008లో దిల్లీ డేర్డేవిల్స్కు ప్రాతినిధ్యం వహించి డెక్కన్ ఛార్జర్స్పై తొలి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. 2011లో దిల్లీ తరఫునే ఆడి కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై రెండోసారి ఈ ఫీట్ సాధించాడు. 2013లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి పుణె వారియర్స్పై మూడోసారి ‘హ్యాట్రిక్’ అందుకున్నాడు. అత్యధికసార్లు (3) హ్యాట్రిక్లు సాధించిన బౌలర్ అమిత్ మిశ్రానే.
ఒకే ఓవర్లో 37 పరుగులు
ఏ ఆటగాడికైనా ఒక ఓవర్లో 20 పరుగులు చేయడమే కష్టం. కానీ, ఐపీఎల్లో ఇద్దరూ బ్యాటర్లు ఒకే ఓవర్లో 37 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2011లో కొచ్చి టస్కర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్లో 6, 6 నోబాల్, 4, 4, 6, 6, 4 సాయంతో 37 పరుగులు పిండుకున్నాడు. 2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా 37 రన్స్ చేసి గేల్ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో 6, 6 నోబాల్, 6, 6, 2, 6, 4 సాయంతో ఈ ఫీట్ సాధించాడు. తర్వాత మరే ఆటగాడు ఈ రికార్డును అందుకోలేదు.
అత్యధిక భాగస్వామ్యం ఎవరిదంటే?
ఐపీఎల్లో అత్యధిక (229) పరుగుల భాగస్వామ్యం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ద్వయం పేరిట ఉంది. 2016లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఆర్సీబీ జంట చెలరేగింది. కోహ్లీ (109; 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఏబీ డివిలియర్స్ (129; 53 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్లు) శతకాలతో కదం తొక్కారు. దీంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!