Mumbai vs UP: యూపీ వారియర్స్‌ లక్ష్యం 162.. హేలీ హాఫ్‌ సెంచరీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 161 పరుగులు చేసింది.

Updated : 28 Feb 2024 21:26 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ మంచి స్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్‌ తొలి వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యంతో శుభారంభానిచ్చారు. ముంబయి బ్యాటర్లలో హేలీ మాథ్యూస్‌ (55) హాఫ్‌ సెంచరీ సాధించి జట్టుకు కీలక ఇన్నింగ్స్‌ అందించింది. యస్తికా భాటియా (26), అమేలియా ఖెర్‌ (23) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో అంజలి శ్రావణి, గ్రేస్‌ హారిస్‌, సోఫి, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. విజయానికి యూపీ వారియర్స్‌కు 162 పరుగులు కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని