Mumbai vs UP: ముంబయికి షాక్.. యూపీ వారియర్స్ బోణీ
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. ముంబయి ఇండియన్స్పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో హ్యాట్రిక్పై కన్నేసిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు యూపీ వారియర్స్ (UP Warriorz) షాక్ ఇచ్చింది. భారీ లక్ష్యం ఎదుట ఉన్నా.. ఒత్తిడిని చిత్తు చేస్తూ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కిరణ్ నవ్గిరే (57: 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), గ్రేస్ హరిస్ (38 నాటౌట్: 17 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అలిస్సా హేలీ (33), దీప్తి శర్మ(27*) దూకుడుగా ఆడారు. వీరి మెరుపులకు భారీ లక్ష్య ఛేదన సునాయాసమైంది. ఈ విజయంతో యూపీ జట్టు ఈ సీజన్లో బోణీ కొట్టింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ తొలి వికెట్కు అర్ధ శతక భాగస్వామ్యంతో శుభారంభానిచ్చారు. ముంబయి బ్యాటర్లలో హేలీ మాథ్యూస్ (55) హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించింది. యస్తికా భాటియా (26), అమేలియా ఖెర్ (23) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో అంజలి శ్రావణి, గ్రేస్ హారిస్, సోఫి, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ