UP vs Delhi: బంతికో పరుగు.. యూపీతో మ్యాచ్‌లో దిల్లీ టార్గెట్‌ ఇంతే!

మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024)లో నాలుగో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది.

Updated : 26 Feb 2024 21:25 IST

బెంగళూరు: WPL 2024 నాలుగో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులే చేసింది. దిల్లీ బౌలర్ల దెబ్బకు యూపీ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్వేతా షెహ్రవాత్‌ (45), గ్రేస్‌ హారిస్‌ (17), ఎలీసా హీలే (13) మినహా ఎవరూ 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. రాధా యాదవ్ 4, మారిజాన్ కాప్ 3 అరుంధతి రెడ్డి, అనాబెల్ సదర్లాండ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని