Travis Head: మా జట్టులో ‘ఇంపాక్ట్’ ప్లేయర్ను ఎంచుకోవడం కష్టం: ట్రావిస్ హెడ్
ప్రపంచ టీ20ల్లోనే పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. దిల్లీపై ఆరు ఓవర్లలో 125 పరుగులు చేసింది. దీనికి కారణం ట్రావిస్ హెడ్. తొలి బంతి నుంచి అతడు ఔటయ్యే వరకూ వీరబాదుడే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో దిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ హైదరాబాద్ మరో రికార్డు స్కోరును (266/7) సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కేవలం 32 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 131 పరుగులు జోడించారు. పవర్ప్లేలో ఏకంగా 125 పరుగులు రాబట్టారు. లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ప్రతి మ్యాచ్లోనూ ఓపెనర్గా వచ్చే హెడ్ స్థానంలో ఒక బౌలర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా హైదరాబాద్ తీసుకుంటుంది.
‘‘మా కుర్రాళ్లు అదరగొట్టారు. బంతిని ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం కంగారు పడటం లేదు. బంతినిబట్టే బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకొంటాను. మెగా లీగ్లో ఫామ్ను కొనసాగించడం ఆనందంగా ఉంది. అభిషేక్ శర్మ పవర్ప్లేలో బీభత్సంగా ఆడతాడు. స్పిన్ బౌలింగ్లో అతడిని అడ్డుకోవడం చాలా కష్టం. శర్మతో భాగస్వామ్యం బాగుంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకోవాలనేది మా జట్టులో చాలా కష్టంగా మారింది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా బౌలింగ్ చేసేవాళ్లే. ఎక్కువ ఆప్షన్లు ఉండటం మాకు కలిసొచ్చే అంశం. మేం భారీ స్కోర్లు చేయడానికి ఇదొక కారణం. దిల్లీతో మ్యాచ్లో మా బౌలర్లకూ పవర్ప్లేలో బంతులేయడం సవాలుగా మారింది. ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాం’’ అని హెడ్ తెలిపాడు.
మాకు ఇక్కడ మంచి రికార్డు ఉంది: కమిన్స్
‘‘దిల్లీ మైదానంలో హైదరాబాద్కు మంచి రికార్డు ఉంది. దానిని కొనసాగిస్తూ అద్భుత విజయం సాధించాం. పవర్ ప్లేలో బౌలర్లకు ఏమాత్రం అవకాశం దొరకలేదు. బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు అవకాశాలొచ్చాయి. మా బ్యాటింగ్ను చూస్తుంటే అద్భుతమనిపిస్తోంది. భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ మేం ఎక్కడా గతి తప్పలేదు. క్రమశిక్షణతో బౌలింగ్ వేశాం. మా ప్రణాళికలను సరిగ్గానే అమలు చేసి విజయం సాధించాం’’ అని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!