Travis Head: మా జట్టులో ‘ఇంపాక్ట్’ ప్లేయర్ను ఎంచుకోవడం కష్టం: ట్రావిస్ హెడ్
ప్రపంచ టీ20ల్లోనే పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. దిల్లీపై ఆరు ఓవర్లలో 125 పరుగులు చేసింది. దీనికి కారణం ట్రావిస్ హెడ్. తొలి బంతి నుంచి అతడు ఔటయ్యే వరకూ వీరబాదుడే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో దిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ హైదరాబాద్ మరో రికార్డు స్కోరును (266/7) సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కేవలం 32 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 131 పరుగులు జోడించారు. పవర్ప్లేలో ఏకంగా 125 పరుగులు రాబట్టారు. లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ప్రతి మ్యాచ్లోనూ ఓపెనర్గా వచ్చే హెడ్ స్థానంలో ఒక బౌలర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా హైదరాబాద్ తీసుకుంటుంది.
‘‘మా కుర్రాళ్లు అదరగొట్టారు. బంతిని ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం కంగారు పడటం లేదు. బంతినిబట్టే బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకొంటాను. మెగా లీగ్లో ఫామ్ను కొనసాగించడం ఆనందంగా ఉంది. అభిషేక్ శర్మ పవర్ప్లేలో బీభత్సంగా ఆడతాడు. స్పిన్ బౌలింగ్లో అతడిని అడ్డుకోవడం చాలా కష్టం. శర్మతో భాగస్వామ్యం బాగుంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకోవాలనేది మా జట్టులో చాలా కష్టంగా మారింది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా బౌలింగ్ చేసేవాళ్లే. ఎక్కువ ఆప్షన్లు ఉండటం మాకు కలిసొచ్చే అంశం. మేం భారీ స్కోర్లు చేయడానికి ఇదొక కారణం. దిల్లీతో మ్యాచ్లో మా బౌలర్లకూ పవర్ప్లేలో బంతులేయడం సవాలుగా మారింది. ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాం’’ అని హెడ్ తెలిపాడు.
మాకు ఇక్కడ మంచి రికార్డు ఉంది: కమిన్స్
‘‘దిల్లీ మైదానంలో హైదరాబాద్కు మంచి రికార్డు ఉంది. దానిని కొనసాగిస్తూ అద్భుత విజయం సాధించాం. పవర్ ప్లేలో బౌలర్లకు ఏమాత్రం అవకాశం దొరకలేదు. బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు అవకాశాలొచ్చాయి. మా బ్యాటింగ్ను చూస్తుంటే అద్భుతమనిపిస్తోంది. భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ మేం ఎక్కడా గతి తప్పలేదు. క్రమశిక్షణతో బౌలింగ్ వేశాం. మా ప్రణాళికలను సరిగ్గానే అమలు చేసి విజయం సాధించాం’’ అని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..