Faf du Plessis: కోహ్లీ ఆగ్రహానికి కారణమదే.. రూల్ ప్రకారం వెళ్లక తప్పదు: డుప్లెసిస్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇంటిముఖం పట్టే తొలి జట్టుగా బెంగళూరు నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరుసగా ఆరో ఓటమితో ప్లే ఆఫ్స్కు దాదాపు దూరమైనట్లే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. ఆడిన 8 మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించగలిగింది. కోల్కతాతో మ్యాచ్లో ఓటమి, విరాట్ కోహ్లీ ఔట్, ప్రస్తుత సీజన్లో తమ ప్లేఆఫ్స్ అవకాశాలపై బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఔట్పై విరాట్ (Virat) కూడా అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్లతో చర్చించిన సంగతి తెలిసిందే.
‘‘చివరి వరకూ పోరాడి కేవలం ఒక్క పరుగుతో ఓటమిపాలు కావడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే, మా జట్టు ఆటతీరుపై గర్వంగా ఉన్నా. ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోని బౌలింగ్ విభాగం రాణించింది. భారీ లక్ష్య ఛేదనలో శుభారంభమే దక్కినా.. స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్నాం. విరాట్ కోహ్లీ ఔట్ విషయంలో నిబంధనలు అలా ఉన్నప్పుడు మనమేం చేయలేం. కానీ, బంతి నడుంపైకి వస్తున్నట్లు అనిపించింది. అయితే, థర్డ్ అంపైర్ క్రీజ్ను బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. ఒక జట్టుకు ఇది కరెక్ట్ అనిపించినా.. అవతలి వారికి సరైంది కాదనే అభిప్రాయం ఉండటం సహజమే. రజత్ పటీదార్ - విల్ జాక్స్ మంచి భాగస్వామ్యంతో మ్యాచ్లో మేం ముందుండేలా చూశారు. నరైన్ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బ్యాటర్లకు ఎక్కువ సమయం దొరకడం లేదు. క్రీజ్లో కుదురుకుని ఆడటం కాకుండా.. వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడాల్సిన పరిస్థితి. కానీ, సునీల్ నరైన్ వంటి బౌలర్ను అడ్డుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టమే. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేస్తే తర్వాత ఒత్తిడి పెద్దగా ఉండదు. ఈ ఎడిషన్లో మా బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, కోల్కతాపై గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాం. ఇంకా భారీ స్కోరు దిశగా వెళ్తున్న ఆ జట్టును కట్డడి చేయగలిగాం. బెంగళూరుకు ఉన్న పెద్ద సానుకూలాంశం అభిమానుల మద్దతు. వారిని సంతోష పెట్టడానికి చివరి వరకూ ప్రయత్నిస్తాం’’ అని డుప్లెసిస్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం