Bengaluru Vs Kolakata: కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరుతో గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్న కోల్కతా తలపడనుంది. వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండటం ఖాయం.
బెంగళూరు ఓపెనర్లు Vs మిచెల్ స్టార్క్
బెంగళూరుకు బలం బ్యాటింగ్. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతూ శుభారంభం అందిస్తారు. వీరు కోల్కతా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. అయితే, గత మ్యాచ్లో హైదరాబాద్పై స్టార్క్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతడు ఎలాంటి బౌలింగ్ ప్రణాళికతో బరిలోకి దిగుతాడో చూడాలి. ఓపెనర్ల తర్వాత అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్ మిడిలార్డర్లో రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. గత రెండు మ్యాచుల్లో అద్భుత ఫినిషర్గా దినేశ్ కార్తిక్ మునుపటి ఫామ్ను అందుకోవడం బెంగళూరుకు సానుకూలాంశం.
రస్సెల్ Vs సిరాజ్ బౌలింగ్ యూనిట్
హైదరాబాద్పై ఒంటిచేత్తో భారీ ఇన్నింగ్స్ ఆడిన రస్సెల్పైనే అందరి దృష్టి. భారీ సిక్స్లతో అతడు విజృంభించాడు. దీంతో బౌలింగ్ యూనిట్ బలంగా లేని బెంగళూరు అతడిని ఏమాత్రం అడ్డుకుంటుందో చూడాలి. సిరాజ్, అల్జారీ జోసెఫ్ వంటి పేసర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. మయాంక్ దగర్, మ్యాక్స్వెల్పైనే స్పిన్ విభాగం ఆధారపడి ఉంది. భారీ హిట్టింగ్ చేసే రస్సెల్ను త్వరగా ఔట్ చేస్తేనే మ్యాచ్పై బెంగళూరు పట్టు సాధించగలదు. ఏమాత్రం బౌలింగ్లో గతి తప్పినా.. చిన్న బౌండరీలు కలిగిన స్టేడియంలో పరుగుల వరద తప్పదు.
రింకు సింగ్ - యశ్ దయాల్
గత ఐపీఎల్ సీజన్లో రింకు సింగ్ ఐదు సిక్స్ల ప్రదర్శన గుర్తుండే ఉంటుంది కదా. ఆ ఓవర్ను అప్పటి గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ సంధించాడు. ప్రస్తుతం అతడు బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతనే రింకు ఫినిషర్గా పేరు గడించాడు. భారత జట్టలోకి అడుగు పెట్టి సత్తా చాటాడు. గత మినీ వేలానికి ముందు గుజరాత్ యశ్ను వదిలేసుకోగా.. అనూహ్యంగా బెంగళూరు (రూ. 5 కోట్లు) సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ మ్యాచ్లో రింకు సింగ్ - యశ్ దయాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మరోసారి ‘ఐదు సిక్స్ల’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? లేకపోతే రింకు వికెట్ తీసి యశ్ ఆధిపత్యం ప్రదర్శిస్తాడో చూడాలి.
కోహ్లీ Vs గంభీర్..
చివరిగా.. ఆటకు సంబంధించినది కాకపోయినా.. విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ ఈ మ్యాచ్లో స్పెషల్ అట్రాక్షన్. గతేడాది వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఒక్కసారిగా అభిమానులను షాక్కు గురిచేసింది. ఈసారి మాత్రం అలాంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉండదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గత సీజన్లోనే లఖ్నవూ వేదికగా జరిగిన మ్యాచ్ సమయంలో వీరిద్దరూ కరచాలనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..