Bengaluru Vs Kolakata: కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరుతో గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్న కోల్కతా తలపడనుంది. వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండటం ఖాయం.
బెంగళూరు ఓపెనర్లు Vs మిచెల్ స్టార్క్
బెంగళూరుకు బలం బ్యాటింగ్. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతూ శుభారంభం అందిస్తారు. వీరు కోల్కతా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. అయితే, గత మ్యాచ్లో హైదరాబాద్పై స్టార్క్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతడు ఎలాంటి బౌలింగ్ ప్రణాళికతో బరిలోకి దిగుతాడో చూడాలి. ఓపెనర్ల తర్వాత అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్ మిడిలార్డర్లో రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. గత రెండు మ్యాచుల్లో అద్భుత ఫినిషర్గా దినేశ్ కార్తిక్ మునుపటి ఫామ్ను అందుకోవడం బెంగళూరుకు సానుకూలాంశం.
రస్సెల్ Vs సిరాజ్ బౌలింగ్ యూనిట్
హైదరాబాద్పై ఒంటిచేత్తో భారీ ఇన్నింగ్స్ ఆడిన రస్సెల్పైనే అందరి దృష్టి. భారీ సిక్స్లతో అతడు విజృంభించాడు. దీంతో బౌలింగ్ యూనిట్ బలంగా లేని బెంగళూరు అతడిని ఏమాత్రం అడ్డుకుంటుందో చూడాలి. సిరాజ్, అల్జారీ జోసెఫ్ వంటి పేసర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. మయాంక్ దగర్, మ్యాక్స్వెల్పైనే స్పిన్ విభాగం ఆధారపడి ఉంది. భారీ హిట్టింగ్ చేసే రస్సెల్ను త్వరగా ఔట్ చేస్తేనే మ్యాచ్పై బెంగళూరు పట్టు సాధించగలదు. ఏమాత్రం బౌలింగ్లో గతి తప్పినా.. చిన్న బౌండరీలు కలిగిన స్టేడియంలో పరుగుల వరద తప్పదు.
రింకు సింగ్ - యశ్ దయాల్
గత ఐపీఎల్ సీజన్లో రింకు సింగ్ ఐదు సిక్స్ల ప్రదర్శన గుర్తుండే ఉంటుంది కదా. ఆ ఓవర్ను అప్పటి గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ సంధించాడు. ప్రస్తుతం అతడు బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతనే రింకు ఫినిషర్గా పేరు గడించాడు. భారత జట్టలోకి అడుగు పెట్టి సత్తా చాటాడు. గత మినీ వేలానికి ముందు గుజరాత్ యశ్ను వదిలేసుకోగా.. అనూహ్యంగా బెంగళూరు (రూ. 5 కోట్లు) సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ మ్యాచ్లో రింకు సింగ్ - యశ్ దయాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మరోసారి ‘ఐదు సిక్స్ల’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? లేకపోతే రింకు వికెట్ తీసి యశ్ ఆధిపత్యం ప్రదర్శిస్తాడో చూడాలి.
కోహ్లీ Vs గంభీర్..
చివరిగా.. ఆటకు సంబంధించినది కాకపోయినా.. విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ ఈ మ్యాచ్లో స్పెషల్ అట్రాక్షన్. గతేడాది వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఒక్కసారిగా అభిమానులను షాక్కు గురిచేసింది. ఈసారి మాత్రం అలాంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉండదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గత సీజన్లోనే లఖ్నవూ వేదికగా జరిగిన మ్యాచ్ సమయంలో వీరిద్దరూ కరచాలనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం