Virat - MS Dhoni: ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు - చెన్నై జట్లు తమ లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ ఇరుజట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు మరోసారి తలపడుతున్న క్రమంలో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ప్లేఆఫ్స్ బెర్తుల్లోని నాలుగో స్థానం ఎవరిదనేది తేలుతుంది. మ్యాచ్ జరగకుండా వర్షం కారణంగా రద్దైతే నేరుగా సీఎస్కే నాకౌట్కు వెళ్లిపోతుంది. ఈక్రమంలో మరోసారి ధోనీతో ఆడటంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు మాట్లాడిన మాటలు బట్టి ఎంఎస్డీ ఆడబోయే చివరి సీజన్ ఇదేనా? అనే అనుమానాలు ప్రారంభం కావడం గమనార్హం. ఇంతకీ అతడు ఏం చెప్పాడంటే?
‘‘మహీభాయ్తో మరోసారి మ్యాచ్ ఆడబోతున్నా. నాకు తెలిసి ఇదే చివరిదేమో మేమిద్దరం ఆడటం. అతడు కొనసాగుతాడో? లేదో? అనేది ఎవరికి తెలుసు. తప్పకుండా ఇది ఫ్యాన్స్కు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మేమిద్దరం భారత్ తరఫున చాలా ఏళ్లు కలిసి ఆడాం. టీమ్ఇండియాను సింగిల్ హ్యాండ్తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’’ అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
ధోనీతో ఆడటం ప్రతిఒక్కరి కల: స్వప్పిల్
‘‘ ఎంఎస్ ధోనీతో మైదానం పంచుకోవడం ప్రతిఒక్కరి కల. భారత దిగ్గజ క్రికెటర్ ప్రాతినిధ్యం వహించే జట్టుపై ఆడటం తేలిగ్గా ఉండదు. కానీ, దానిని మేం ఒత్తిడిగా భావించం. మా జట్టు సన్నద్ధతకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని గేమ్లో అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం. తొలి అర్ధభాగంలో మా ఆటతీరు చూశాక కేవలం ఒక్క శాతం మాత్రమే ప్లేఆఫ్స్కు వెళ్లేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పర్సంటేజీని పెంచుకోగలిగాం. వచ్చిన ప్రతీ ఛాన్స్ను సద్వినియోగం చేసుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ప్లేఆఫ్స్ అనే ఒత్తిడిని దరి చేరనీయకుండా వందశాతం మా ప్రదర్శనను ఇచ్చి గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ‘ఇంపాక్ట్’ రూల్ వల్ల బౌలర్ల ఆలోచనా విధానం చాలా మారిపోతుంది. ఎందుకంటే ప్రత్యర్థి జట్టుకు నాణ్యమైన ఏడుగురు బ్యాటర్లు అందుబాటులోకి వస్తారు. ఇక ఆల్రౌండర్లు ఉంటే దాదాపు 9వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల అవకాశం ఆయా జట్లకు వస్తుంది. దీంతో వారిని అడ్డుకొనేందుకు బౌలర్లు ఇంకాస్త విభిన్నంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. విరాట్తో నా అండర్-19 రోజుల నుంచి ఆడుతున్నా. ఆర్సీబీతో కలవకముందు పెద్దగా మేం టచ్లో లేం. కానీ, జైపుర్ వేదికగా రాజస్థాన్తో మ్యాచ్ సమయంలో 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా సంభాషించుకున్నాం’’ అని స్వప్నిల్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?