CSK vs RCB: ఇదే బిగ్ గేమ్.. చెపాక్లో ధోనీని కలవడం ఇంకా స్పెషల్: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో (IPL 2024) తొలి మ్యాచ్ పెద్ద జట్ల మధ్యే జరగనుంది. ఇప్పటికే ఇరు టీమ్లూ సిద్ధంగా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో (IPL 2024) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. ధోనీతో ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పాడు. క్రికెట్ను అభిమానించే చెపాక్ ప్రేక్షకుల మధ్య ఆడటం మరింత స్పెషల్ అని పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఇది అతిపెద్ద మ్యాచ్గా నిలిచిపోతుందని చెప్పాడు. ‘‘చెన్నైతో ఆడటం అభిమానులకే కాకుండా క్రికెటర్లుగా మాకూ ఆనందంగా ఉంటుంది. ధోనీని కలవబోతున్నా. ఇది కూడా ప్రత్యేకమే. చెన్నై అభిమానులు క్రికెట్ పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటారు’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.
తొలి మ్యాచ్లోనే ఇద్దరు దిగ్గజాలు: డుప్లెసిస్
‘‘ఐపీఎల్ మొదటి వారంలో కీలకమైన మ్యాచ్లు జరగనున్నాయి. మా జట్టు సన్నద్ధత కోసం సహాయక సిబ్బంది చాలా కష్టపడ్డారు. తొలి మ్యాచ్లోనే ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య పోరును చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు.
ఆర్సీబీ సారథితో ఏం మాట్లాడానంటే..?: రుతురాజ్
‘‘ఆర్సీబీతో మేం తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి డుప్లెసిస్తో సంభాషించా. మేమిద్దరం కలిసి కొన్నాళ్లు సీఎస్కేకు ఆడాం. ఇప్పుడు ఆర్సీబీ తరఫున ఆడుతూ ఆ జట్టును డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్గా అతడితో కలిసి టాస్ వేసేందుకు వెళ్లనున్నా. ఇది నా జీవితంలో అద్భుతమైన తొలి మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా’’ అని సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.