CSK vs RCB: ఇదే బిగ్ గేమ్.. చెపాక్లో ధోనీని కలవడం ఇంకా స్పెషల్: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో (IPL 2024) తొలి మ్యాచ్ పెద్ద జట్ల మధ్యే జరగనుంది. ఇప్పటికే ఇరు టీమ్లూ సిద్ధంగా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో (IPL 2024) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. ధోనీతో ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పాడు. క్రికెట్ను అభిమానించే చెపాక్ ప్రేక్షకుల మధ్య ఆడటం మరింత స్పెషల్ అని పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఇది అతిపెద్ద మ్యాచ్గా నిలిచిపోతుందని చెప్పాడు. ‘‘చెన్నైతో ఆడటం అభిమానులకే కాకుండా క్రికెటర్లుగా మాకూ ఆనందంగా ఉంటుంది. ధోనీని కలవబోతున్నా. ఇది కూడా ప్రత్యేకమే. చెన్నై అభిమానులు క్రికెట్ పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటారు’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.
తొలి మ్యాచ్లోనే ఇద్దరు దిగ్గజాలు: డుప్లెసిస్
‘‘ఐపీఎల్ మొదటి వారంలో కీలకమైన మ్యాచ్లు జరగనున్నాయి. మా జట్టు సన్నద్ధత కోసం సహాయక సిబ్బంది చాలా కష్టపడ్డారు. తొలి మ్యాచ్లోనే ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య పోరును చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు.
ఆర్సీబీ సారథితో ఏం మాట్లాడానంటే..?: రుతురాజ్
‘‘ఆర్సీబీతో మేం తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి డుప్లెసిస్తో సంభాషించా. మేమిద్దరం కలిసి కొన్నాళ్లు సీఎస్కేకు ఆడాం. ఇప్పుడు ఆర్సీబీ తరఫున ఆడుతూ ఆ జట్టును డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్గా అతడితో కలిసి టాస్ వేసేందుకు వెళ్లనున్నా. ఇది నా జీవితంలో అద్భుతమైన తొలి మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా’’ అని సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.