Team India Coach: ప్రధాన కోచ్గా గంభీర్ కంటే ధోనీ బెటర్..: విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్
త్వరలో భారత కోచ్గా కొత్త వ్యక్తిని చూడబోతున్నాం. ఎందుకంటే ద్రవిడ్ కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. ఈ రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు ప్రధాన కోచ్ (Team India) పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరివి చెల్లుబాటు అయ్యాయనే విషయాలను ఇంకా బీసీసీఐ వెల్లడించలేదు. ఈ రేసులో మాత్రం గౌతమ్ గంభీర్ ముందున్నాడనేది క్రికెట్ విశ్లేషకుల మాట. గంభీర్ ఈ పదవి కోసం దరఖాస్తు చేశాడా? లేదా? అనేది తెలియదు. తాజాగా మరో పేరును తెరమీదకు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ. టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ప్రధాన కోచ్గా నియమిస్తే బాగుంటుందని రాజ్కుమార్ వ్యాఖ్యానించాడు.
‘‘అసలు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారన్నది ఆసక్తికరంగా ఉంది. కోచ్గా ఎవరు వచ్చినా ఫర్వాలేదు కానీ భారత్ నుంచే రావాలి. ఒకవేళ ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్ తీసుకున్నట్లు ప్రకటిస్తే.. అతడు చాలా మంచి ఎంపిక అవుతుంది. ఇప్పటికే చాలా క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. పెద్ద టోర్నీల్లో జట్టును గెలిపించాడు. డ్రెస్సింగ్ రూమ్లో ధోనీకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అదేవిధంగా పొట్టి ఫార్మాట్లోనూ ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. జట్టును సక్రమంగా నిర్వహించగల సామర్థ్యం ఉంది. అతడు సారథిగా వచ్చినప్పుడు జట్టులో అప్పటికే పెద్ద స్టార్లు ఉన్నారు. సచిన్, సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్, కుంబ్లే, గంభీర్, యువరాజ్ సింగ్.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ, ఒక్క వివాదం కూడా లేకుండా ధోనీ జట్టును అద్భుతంగా నడిపాడు. సక్సెస్ఫుల్ సారథిగా మారాడు’’ అని రాజ్కుమార్ వెల్లడించాడు.
రోహిత్ - కోహ్లీ ఈసారి మిస్టేక్ చేయరు: మంజ్రేకర్
‘‘2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేసిన పొరపాట్లను ఇప్పుడు పునరావృతం చేయరని ఆశిస్తున్నా. మరీ డిఫెన్సివ్గా ఆడి ఓటమిని చవిచూసింది. సెమీస్లో ఇంగ్లాండ్పై 20 ఓవర్లలో 168 పరుగులు సాధించింది. తొలి 60 బంతుల్లో కేవలం 62 రన్స్ మాత్రమే చేసింది. సీనియర్లు ఎక్కువగా ఆ బంతులను ఎదుర్కొన్నారు. రోహిత్ 27 బంతుల్లో 28, విరాట్ 40 బంతుల్లో 50 పరుగులు చేశారు. టీ20ల్లో ఇది సరిపోదు. హార్దిక్ పాండ్య (33 బంతుల్లో 63) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ దూకుడు మంత్రంతో ఆడి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది’’ అని మంజ్రేకర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు