Virat Kohli: కోల్కతాతో మ్యాచ్.. చర్చకు దారితీసిన కోహ్లీ ఔట్ వివాదం!
కోల్కతా నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో చివరి వరకూ వచ్చిన బెంగళూరు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే, విరాట్ కోహ్లీ ఔట్ నిర్ణయంపై వివాదాస్పదమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో మరోసారి అంపైరింగ్పై విమర్శలు వచ్చాయి. తాజాగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ (18: 7 బంతుల్లో 2 సిక్స్లు, ఒక ఫోర్) దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి నిర్దేశించిన 223 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు వేగంగా ప్రారంభించింది. కానీ, హర్షిత్ రాణా వేసిన (2.1వ ఓవర్) బంతిని ఆడబోయిన కోహ్లీ (Virat Kohli) బౌలర్కే క్యాచ్ ఇచ్చాడు. అయితే, ఆ బంతి నడుము కంటే పైకి వచ్చిందని.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రివ్యూ కోసం థర్డ్ అంపైర్కు ఫీల్డ్ అంపైర్ రిఫర్ చేశాడు. సమీక్షలో బంతి సరైందేనని తేలింది. దీంతో అసహనంగా విరాట్ డగౌట్ బాట పట్టాడు. దీంతో సాంకేతికతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
స్పష్టత లేదు: ఏబీ డివిలియర్స్
‘‘విరాట్ ఔటైన బంతిపై 360 లైవ్ కార్యక్రమంలో వివరణ ఇద్దామని అనుకున్నా. కానీ, మరిచిపోయా. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నా. ఇక్కడ అంపైరింగ్తో ఎలాంటి సమస్యా లేదు. సాంకేతికతతోనే ఇబ్బందులు. వైడ్, ఎత్తు వంటి నిర్ణయాలను తీసుకొనేందుకు టెక్నాలజీని వాడుకోవడం బాగానే ఉంది. కానీ, ఈ మ్యాచ్లో ఇచ్చిన ఔట్పై మాత్రం స్పష్టత లేకపోవడంతోనే కొందరికి ఆగ్రహం తెప్పించింది. మరికొందరు అయోమయానికి గురి కావాల్సి వచ్చింది. బ్యాటర్ ఉన్న పొజిషన్ను పరిగణనలోకి తీసుకొని.. లైన్లను, బాల్ ట్రాకింగ్ను చూసి ఉంటే ఎలాంటి గందరగోళం ఉండేది కాదు’’ అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. అంబటి రాయుడు, నవ్జ్యోత్ సిద్ధూ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఇది లీగల్ డెలివరీనే: పఠాన్, హర్షా భోగ్లే
ఏబీ డివిలియర్స్ అభిప్రాయానికి విభిన్నంగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్పందించారు. ఇర్ఫాన్ దీనిని దీనిని లీగల్ బాల్ అని తేల్చేశాడు. భోగ్లే మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీకి ధన్యవాదాలు. పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు లేకుండా చేసింది. ఇప్పుడు కూడా అంపైరింగ్ గురించి కాదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మొహమాటంగా ఉపయోగించడంపైనే ఈ చర్చ సాగుతోంది. కోల్కతా-బెంగళూరు మ్యాచ్లో సరైన నిర్ణయమే వచ్చింది’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు