Virat Kohli: ఏమైంది ‘రికార్డుల రారాజు’..? ఇలాగైతే వరల్డ్కప్కు కష్టమే!
టీ20 లీగ్ నుంచి విరాట్ కాస్త విరామం తీసుకుంటే మంచిదని ...
41, 12, 5, 48, 1, 12, 0, 0, 9.. తొమ్మిది మ్యాచుల్లో చేసిన మొత్తం పరుగులు 128..
ఇవేవో యువ క్రికెటర్ చేసిన రన్స్ కావు.. లోయర్ ఆర్డర్లో వచ్చిన బ్యాటర్ చేసినవీ కావు.. ఇవీ రన్మెషీన్ విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. టీ20 లీగ్లో కోహ్లీ ప్రదర్శన ఇలా ఉంది. ఇందులో రెండుసార్లు గోల్డెన్ డక్.. మరోసారి కాస్తలో డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గత ఆరేడేళ్లుగా ధనాధన్ బ్యాటింగ్తో అలరించిన విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి ప్రదర్శనతో ఆటగాడిగా టీ20 కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జట్టులో స్థానం దక్కడమూ కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇలా కావడానికి గల కారణాలు ఏంటంటే..
టీ20 లీగ్ నుంచి విరాట్ కాస్త విరామం తీసుకుంటే మంచిదని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పాడంటే.. కోహ్లీ ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి దిగ్గజ బ్యాటర్కైనా కెరీర్లో ఒడుదొడుకులు సహజమే. అయితే వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా రాణించాలి. అప్పుడే సాధారణ ఆటగాడికి లెజెండరీ ప్లేయర్కు తేడా ఉంటుంది. అసలే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ పోటీలు ముందున్నాయి. ఇప్పటికే అన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్ను దొరకబుచ్చుకుని చెలరేగుతున్నారు. అలానే విరాట్ కోహ్లీ కూడా మళ్లీ పరుగులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అవే తప్పులు మళ్లీ మళ్లీ..
యువ క్రికెటర్లు అంటే అనుభవం తక్కువ ఉండి ఉద్రేకంతో ఆడుతుంటారు. అలాంటి సమయంలో వికెట్లను సమర్పించుకోవడం సహజం. అయితే అపార అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ కూడా నిన్న మొన్న వచ్చిన ఆటగాడిగా ఒకే రకమైన షాట్లకు పెవిలియన్ చేరడం అభిమానులను మరింత బాధిస్తోంది. ఉదాహరణకు గత మూడు మ్యాచ్లను చూసుకుంటే.. బ్యాట్కు ఎడ్జ్ తీసుకుని బంతి ఫీల్డర్ చేతిలో పడిపోయింది. ఒకటి అరా తప్ప ఏ మ్యాచ్లోనూ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన దాఖలాలు కనిపించలేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటున్న కోహ్లీ బ్యాటింగ్కు వచ్చేసరికి తేలిపోతున్నాడు.
కెప్టెన్సీ ఒత్తిడేమీ లేదే
నాయకత్వ బాధ్యతలు తన బ్యాటింగ్పై ప్రభావం పడుతున్నాయనే ఉద్దేశంతో కెప్టెన్గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. టీ20 లీగ్ గత సీజన్ మధ్యలోనే బెంగళూరు సారథ్యం నుంచి తప్పుకొంటున్నానని ప్రకటించాడు. దీంతో ఈసారి బ్యాటింగ్తో చెలరేగుతాడని అంతా భావించారు. మొదటి మ్యాచ్లో 41 పరుగులు చేయడంతో ఫామ్లోకి వచ్చాడని అభిమానులు సంతోషించారు. మరొక మ్యాచ్లో 48 రన్స్తో మెరిశాడు. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో రెండు డకౌట్లు కావడం తీవ్ర నిరాశపరిచింది. మరీ దారుణంగా ఇందులో వరుసగా రెండు గోల్డెన్ డక్లు ఉండటం గమనార్హం. దీంతో ప్రత్యర్థి బౌలర్ల బుట్టలో విరాట్ కోహ్లీ ఈజీగా పడిపోయాడు. ఆఫ్సైడ్ వికెట్కు కాస్త దూరంగా వేస్తే చాలు ఔట్ అవుతున్నాడని నిరూపించుకున్నాడు. సారధ్య బాధ్యతలకు సంబంధించిన ఎలాంటి ఒత్తిడి లేదు. అయినా ప్రదర్శనలో మాత్రం మార్పు రావడం లేదు.
ప్రపంచ కప్ జట్టులో కష్టమే..
ఇలానే ప్రదర్శన కొనసాగితే ఆసీస్ వేదికగా జరగబోయే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కడం విరాట్ కోహ్లీకి కష్టమే అవుతుంది. ఇప్పటికే సీనియర్ల నుంచి తీవ్ర పోటీ ఉంది. మరోవైపు టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్ల ప్రదర్శనకే ప్రాధాన్యతనిస్తాడు. రోహిత్ శర్మ కాకుండా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, శివమ్ దూబే, అంబటి రాయుడు, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్ వంటి ప్లేయర్లు టీ20 లీగ్లో పరుగులు చేస్తూ విరాట్కు సవాల్ విసురుతున్నారు. ఇక ఇషాన్ కిషన్, దీపక్ హుడా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, అనుజ్ రావత్, వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్లాంటి యువ క్రికెటర్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ వెనక్కి రావాలని డిమాండ్లూ వినవస్తున్నాయి. ఇటువంటి సమయంలో విరాట్ మిగతా మ్యాచుల్లోనైనా రాణించి తనకున్న ఛేదనల రారాజు నామధేయం సార్థకం చేసుకోవాలని కోహ్లీ అభిమానులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి