Virat - Dinesh Karthik: ‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఘనంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’
కీలకమైన మ్యాచ్లో ఓడిన బెంగళూరు జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆ ఫ్రాంచైజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ కూడా మెగా లీగ్కు వీడ్కోలు పలికాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీపై రాజస్థాన్ విజయం సాధించి రెండో క్వాలిఫయర్కు దూసుకెళ్లింది. ఇదే సమయంలో ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఫినిషర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) కూడా వీడ్కోలు పలికేశాడు. ఈ సీజన్లో డీకే 15 మ్యాచుల్లో 187.36 స్ట్రైక్రేట్తో 326 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన నిర్ణయం ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురై ఇబ్బంది పడిన డీకేను హత్తుకొని విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓదార్చాడు. ఆటగాళ్లతో కార్తిక్కు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాడు. అభిమానులను కూడా ఉత్సాహపరుస్తూ ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి కోహ్లీ మైదానం మొత్తం చుట్టేశాడు. ఈ వీడియోలు వైరల్గా మారాయి.
తుషార్ దేశ్పాండే పోస్టు వైరల్.. తర్వాత డిలీట్
ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన బెంగళూరును ఉద్దేశించి చెన్నై ఆటగాడు తుషార్ దేశ్పాండే పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో వెంటనే దానిని తన ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసేశాడు. అప్పటికే నెట్టింట స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. సీఎస్కే ఫ్యాన్స్ అఫీషియల్ అనే ఖాతా నుంచి వచ్చిన ఇమేజ్ను అతడు తన ఇన్స్టా స్టోరీగా పెట్టాడు. ‘చెన్నై అభిమానులు విభిన్నంగా స్పందించారు’ అనే అర్థంలో క్యాప్షన్ జోడించాడు. ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానుల నుంచి తుషార్పై విపరీతంగా విమర్శలు వచ్చాయి. తమను ఓడించిన జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆనందపడుతున్నారని కొందరు కామెంట్లు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు