Virat Kohli: తొలి బ్యాచ్తో వెళ్లని విరాట్ కోహ్లీ - హార్దిక్ పాండ్య.. కారణమిదే!
టీ20 ప్రపంచ కప్ సమరం కోసం టీమ్ఇండియా సమాయత్తమవుతోంది. అందులో భాగంగా కెప్టెన్తోపాటు కొందరు ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మొదలుకానుంది. భారత్ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఢీకొట్టనుంది. ఇప్పటికే టీమ్ఇండియా తొలి బృందం అమెరికా బయల్దేరింది. కెప్టెన్ రోహిత్తోపాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోపాటు (Virat Kohli) వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఇంకా వెళ్లలేదు. ఐపీఎల్లో వీరి మ్యాచ్లు కూడా లేవు. అయినా వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు ఉన్నాయి.
విరాట్ విషయంలో..
ఐపీఎల్లో అద్భుత ఫామ్తో భారీగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ‘యూఎస్’ వెళ్లే విషయంలో ఓ సమస్య వచ్చింది. అతడి వీసాకు సంబంధించి పేపర్ వర్క్ పెండింగ్లో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మే 30న అమెరికాకు బయల్దేరతాడని సమాచారం. దీంతో బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. బంగ్లాతో జూన్ 1న టీమ్ఇండియా వార్మప్లో తలపడనుంది.
లండన్లో హార్దిక్..?
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య నటాషా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో పాండ్య లండన్ వెళ్లడం గమనార్హం. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి జట్టు ఘోర ప్రదర్శన చేయడంతో కెప్టెన్గా వ్యవహరించిన పాండ్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా విడాకుల వార్తలు కూడా రావడంతో అతడు లండన్ వెళ్లినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచే నేరుగా యూఎస్కు వస్తాడని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
గిల్ స్వదేశానికి అర్ధంతరంగా తిరిగి రావడానికి కారణమేంటనే దానికి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలూ వచ్చాయి. -
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
పాకిస్థాన్ ఓటమికి కారణాలను ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వెల్లడించాడు. అభిమానులను తీవ్ర నిరాశపరిచినట్లు అంగీకరించాడు. -
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
విరాట్ కోహ్లీ ఛేజింగ్ల్లో అనుసరించే వ్యూహాన్ని ఇటీవల పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ వెల్లడించాడు. -
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
తొలిసారి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో సరైన సదుపాయాలు మాత్రం కానరావడం లేదు. ప్రాక్టీస్ చేసుకోవడానికి, జిమ్ చేసుకోవడానికి భారత ఆటగాళ్లు ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ను రద్దు చేసిన పరిస్థితి తలెత్తింది. -
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
టీ20 ప్రపంచ కప్లో టాప్-8 టీమ్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. -
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
తన చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ సూపర్-8కి అర్హత సాధించింది. -
గంభీరే టీమ్ఇండియా కోచ్!
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. -
గండాలు దాటి.. గట్టెక్కిన ఇంగ్లాండ్
వర్షం ఆగాలి.. మ్యాచ్ సాగాలి.. ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టేదే. -
స్మృతి శతకం
భారత మహిళల క్రికెట్ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం..బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్ప్రీత్ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. -
ఆసీస్ అజేయంగా..
7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పొట్టి కప్లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. -
ఇటలీ శుభారంభం
యూరో కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- బి మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. -
భజన్కు పారిస్ కోటా
భారత యువ ఆర్చర్ భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్ టోర్నీలో మహిళల రికర్వ్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది. -
సంక్షిప్తవార్తలు(4)
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రి ఉస్తి నాద్ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్ కోచ్ మద్దతుగా నిలిచాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి