Virat Kohli: తొలి బ్యాచ్తో వెళ్లని విరాట్ కోహ్లీ - హార్దిక్ పాండ్య.. కారణమిదే!
టీ20 ప్రపంచ కప్ సమరం కోసం టీమ్ఇండియా సమాయత్తమవుతోంది. అందులో భాగంగా కెప్టెన్తోపాటు కొందరు ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మొదలుకానుంది. భారత్ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఢీకొట్టనుంది. ఇప్పటికే టీమ్ఇండియా తొలి బృందం అమెరికా బయల్దేరింది. కెప్టెన్ రోహిత్తోపాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోపాటు (Virat Kohli) వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఇంకా వెళ్లలేదు. ఐపీఎల్లో వీరి మ్యాచ్లు కూడా లేవు. అయినా వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు ఉన్నాయి.
విరాట్ విషయంలో..
ఐపీఎల్లో అద్భుత ఫామ్తో భారీగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ‘యూఎస్’ వెళ్లే విషయంలో ఓ సమస్య వచ్చింది. అతడి వీసాకు సంబంధించి పేపర్ వర్క్ పెండింగ్లో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మే 30న అమెరికాకు బయల్దేరతాడని సమాచారం. దీంతో బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. బంగ్లాతో జూన్ 1న టీమ్ఇండియా వార్మప్లో తలపడనుంది.
లండన్లో హార్దిక్..?
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య నటాషా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో పాండ్య లండన్ వెళ్లడం గమనార్హం. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి జట్టు ఘోర ప్రదర్శన చేయడంతో కెప్టెన్గా వ్యవహరించిన పాండ్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా విడాకుల వార్తలు కూడా రావడంతో అతడు లండన్ వెళ్లినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచే నేరుగా యూఎస్కు వస్తాడని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు