Virat Kohli Fitness: ఇదే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మంత్రం!
భారత జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం నిర్వహించే యోయో టెస్టు (YO YO Test)లో 17.2 స్కోరుతో విరాట్ కోహ్లీ ( Virat Kohli) తొలి స్థానంలో నిలిచాడు. దీంతో అసలువ విరాట్ ఫిట్నెస్ (Kohli Fitness) మంత్రం ఏంటి అనే చర్చ మరోసారి మొదలైంది.
35 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి దగ్గరవుతున్న క్రికెటర్ అతను.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో శక్తిమంతమైన టీమ్ఇండియాను సారథిగా మూడు ఫార్మాట్లలో నడిపించాడు. స్టార్ ఆటగాడిగా మన్ననలు పొందుతున్నాడు. ఇప్పటికే దిగ్గజ హోదా దక్కించుకున్నాడు. రికార్డుల వేటలో సాగుతూ.. పరుగుల రారాజుగా కీర్తి గడించాడు. కానీ, ఇప్పటికప్పుడు మైదానంలో కుర్రాళ్లతో పరుగులో పోటీపడమంటే అతనే ముందుంటాడు. శరీరానికి శ్రమ కల్పించే ఏ పరీక్ష అయినా అతనిదే అగ్రస్థానం. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి దశాబ్దన్నర అవుతున్నా.. అతనికి అలుపన్నదే రాదు. ఫిట్నెస్లో ఇప్పటికీ భారత క్రికెట్ జట్టులో అతణ్ని కొట్టేవాళ్లే లేరు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్లోనే అతని ఫిట్నెస్కు పోటీ వచ్చే ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతనే.. విరాట్ కోహ్లి. ఫిట్నెస్లోనూ తిరుగులేని కింగ్. తాజాగా భారత జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం నిర్వహించిన కఠినమైన యోయో టెస్టులో 17.2 స్కోరుతో విరాట్ అగ్రస్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. మరి ఇన్నేళ్లుగా అత్యున్నత ఫిట్నెస్ను కోహ్లి ఎలా కొనసాగించగలుగుతున్నాడు?
ఆహార నియమాల్లో కఠినంగా..
రికార్డులు సాధించామని ఆగిపోకుండా.. సెంచరీ చేశామని ఉండిపోకుండా.. విజయాలు దక్కాయని నిలిచిపోకుండా.. రోజునూ తొలిరోజుగానే భావిస్తూ ఫిట్నెస్పై కోహ్లి దృష్టి పెడతాడు. కసరత్తులైనా.. ఆహార నియమాలైనా.. మళ్లీ కొత్తగా మొదలెడతాడు. అలసిపోయాననే భావనే దరి చేరకుండా.. తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, తీరిక లేని షెడ్యూల్లో ఉన్నా ఫిట్నెస్ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడు. కోహ్లి ఇన్నేళ్లుగా ఈ ఫిట్నెస్ను కొనసాగించడానికి మానసిక స్థైర్యం, ఆత్మబలంతో పాటు చేసే కసరత్తులు, పాటించే ఆహార నియమాలే కారణం. ఫిట్నెస్ కోసం తనకెంతో ఇష్టమైన చికెన్ను పూర్తిగా దూరం పెట్టి శాకాహారిగా మారిపోయాడు. మసాలా వంటకాలకు పూర్తి దూరంగా ఉండే అతను.. తాజా కూరగాయలు, పప్పు, గుడ్లను ఆహారంలో భాగం చేసుకున్నాడు.
ఉదయం పూట బ్రెడ్ ఆమ్లెట్తో ఉడకబెట్టిన గుడ్లను తింటాడు. వీటితో పాటు పాలకూర, ఎండుమిర్చి, పనీర్ సలాడ్ను అల్పాహారంగా తీసుకుంటాడు. మధ్యాహ్న భోజనంలో నట్స్, బ్రౌన్ బ్రెడ్ తింటాడు. ప్రొటీన్ షేక్ తాగుతాడు. డిన్నర్ను రోటీ, పప్పు, పచ్చి ఆకు కూరలతో సాధారణంగా ముగిస్తాడు. శరీరాన్ని డీహైడ్రేడ్ కాకుండా చూసుకోవడం కోసం బ్లాక్ వాటర్ తాగుతాడు. ఖరీదైన ఈ నీళ్ల ధర లీటర్కు రూ.4 వేల వరకూ ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత ప్రొటీన్ షేక్స్, సోయా మిల్క్, బటర్ పనీర్ తీసుకుంటాడు. ఒక్కోసారి తనకెంతో ఇష్టమైన ఛోలే భటూరే (శనగ మసాలా కూరతో పూరి)ను లాగిస్తుంటాడు. కానీ ఆ వెంటనే మళ్లీ కసరత్తుల్లో మునిగిపోతాడు. అంతే కాకుండా ఏది ఎంత తినాలో తగిన మోతాదులో ఉండేలా చూసుకుంటాడు.
ఆ కసరత్తులు..
ఎంత తీరిక లేని షెడ్యూల్ ఉన్న వ్యాయామం విషయంలో మాత్రం కోహ్లి అసలు అశ్రద్ధ చూపడు. ఎక్కడ? ఎలాంటి పరిస్థితుతుల్లో ఉన్నా కచ్చితంగా కసరత్తులు చేస్తాడు. గంటల కొద్దీ వ్యాయామం చేసి క్యాలరీలు కరిగిస్తుంటాడు. ముఖ్యంగా వెయిట్లిఫ్టింగ్, కార్డియో వాస్క్యులర్ కసరత్తులను కలిపి చేయడం అతని ఫిటెనెస్ రహస్యం అని చెప్పొచ్చు. దీంతో ఆరోగ్యమే కాకుండా కండరాల పటుత్వం, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది. శరీరంలోని ప్రతి అవయవానికి తగ్గట్లుగా ప్రత్యేక వ్యాయామ పద్ధతులు అవలంబిస్తూ ఇప్పటికీ ఫిట్గానే ఉంటున్నాడు. అందుకే మొదటి నుంచి ఇప్పటి వరకూ ఒకే శరీరాకృతిని కొనసాగించగలుగుతున్నాడు.
తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల మధ్య పరుగుల కోసం కోహ్లి 510 కిలోమీటర్లు పరుగెత్తాడంటేనే అతని ఫిట్నెస్ స్థాయి అర్థం చేసుకోవచ్చు. తాను కొట్టిన పరుగుల కోసం 277 కిలోమీటర్లు, నాన్ స్ట్రైకింగ్లో ఉంటూ మరో 233 కిలోమీటర్లు పరుగెత్తాడు. ప్రపంచ క్రికెట్లో మరో క్రికెటర్ కూడా వికెట్ల మధ్య ఇంత దూరం పరుగెత్తలేదు. ఇప్పటికీ క్రీజులో అడుగుపెడితే వికెట్ల మధ్య కోహ్లి మెరుపు వేగం ఎలా ఉంటుందో తెలిసిందే. తన ఫిట్నెస్తో మైదానంలో ఉత్సాహాన్ని పెంచుతూ సాగుతున్నాడు. ఫిట్నెస్ అంటే కోహ్లీలా ఉండాలనే ప్రమాణాలను నెలకొల్పి యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన