Virat Kohli - Dinesh Karthik: థ్యాంక్యూ డీకే.. ఆ సమయంలో ఎంతో స్ఫూర్తి పొందా: విరాట్ కోహ్లీ
బెంగళూరు జట్టు సహచరులుగా కాకుండా.. భారత జట్టు తరఫున ఆడినప్పుడు తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్కు దాదాపు దూరమైన వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఐపీఎల్కు వీడ్కోలు పలికేశాడు. మెగా లీగ్ 17వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమితో బెంగళూరు కథ ఇంటికి చేరింది. అప్పుడే డీకే కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అతడిని ఓదార్చిన వీడియోలు వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా డీకేతో తన అనుబంధంపై విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘నేను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో మేమిద్దరం ఆడాం. 2009 ఛాంపియన్స్ ట్రోఫీ అనుకుంటా. అతడితో కలిసి మొదటిసారి ఛేంజ్రూమ్ను పంచుకున్నా. చాలా సరదాగా ఉంటాడు. హైపర్ యాక్టివ్. అదేవిధంగా కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు.. దినేశ్పై నాకు కలిగిన తొలి ఇంప్రెషన్ ఇదే. అద్భుతమైన ప్రతిభావంతుడు. అప్పటికీ.. ఇప్పటికీ అతడిలో ఏ మార్పులేదు. మైదానం వెలుపల అతడితో సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. చాలా విషయాలపై మంచి నాలెడ్జ్ అతడి సొంతం. క్రికెటేతర అంశాల గురించీ చెబుతాడు. నాకు 2022 ఐపీఎల్ సీజన్ గొప్పగా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు పక్కనే కూర్చొని సవివరంగా నా సమస్యను చెప్పాడు. ఎలా అధిగమించాలనేదానిపై అవగాహన కల్పించాడు. ఎప్పటికీ అతడికి రుణపడి ఉంటా. థ్యాంక్యూ డీకే.. నీ అమూల్యమైన సలహాలతో మెరుగ్గా రాణించగలుగుతున్నా’’ అని విరాట్ తెలిపాడు.
ఎప్పటికీ వెనక్కి తగ్గడు: దీపికా పల్లికల్
‘‘మేమిద్దరం తొలిసారి 2013లో కలిశాం. మా జీవితాలు పరస్పరం ముడిపడతాయని అప్పుడే అనుకున్నాం. దానికి మరెంతోకాలం పట్టలేదు. ఏదైనా మ్యాచ్లో సరిగ్గా ఆడకపోతే.. తనకు తానే జట్టు నుంచి డ్రాప్ అయిపోయేవాడు. ఓ మూడు రోజులు కాస్త బాధపడతాడు. వెంటనే కోలుకుంటాడు. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తాడు. డీకే నుంచి ఎప్పటికీ నేర్చుకొనే అంశం ఇదే. మరొకరైతే ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయేవారు. నేను కూడా అథ్లెట్నే. అతడి కెరీర్లో ఎన్నో దశలను చూశా. ఒకవేళ అదే స్థానంలో నేనుంటే ఆటను వదిలేసేదాన్ని. అతడు మాత్రం ఎప్పుడూ అలా ఆలోచించడు. కార్తిక్ రాణించడం వెనుక అభిషేక్ నాయర్ పాత్ర కీలకం. కేవలం కెరీర్ పరంగానే కాకుండా.. వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించాడు’’ అని దినేశ్ కార్తిక్ భార్య దీపికా పల్లికల్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్