Virat Kohli: ఆ బంతి దెబ్బకు చూపు మసకబారింది.. పోరాటమా? ఫ్లైట్ ఎక్కడమా? అనుకున్నా: కోహ్లీ
విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఆటతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. కఠినమైన పిచ్లపైనా భారీగా పరుగులు రాబట్టాడు. అందులో ఆసీస్ జట్టుపైనా ఆధిపత్యం ప్రదర్శించేవాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఎంతగా కవ్విస్తే అతడి ప్రదర్శన అంత అత్యుత్తమంగా ఉంటుంది. అందుకే అతడిని ఎవరూ స్లెడ్జ్ చేయడానికి సాహసించరు. దీనికి ఉదాహరణ 2014-15 ఆసీస్ పర్యటనే. ఆ సిరీస్లోనే విరాట్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ నుంచి అందుకొన్నాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ (692 పరుగులు) నిలిచాడు. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ను టార్గెట్ చేస్తూ అదరగొట్టాడు. వీరిద్దరి మధ్య పోరు చూడటం కూడా భలే బాగుంది. ఆ సిరీస్లో జాన్సన్ బౌలింగ్ను ఎదుర్కొనడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఆసీస్ పర్యటనలో తొలి మ్యాచ్ సందర్భంగా జాన్సన్ వేసిన తొలి బంతే నా తలకు తగిలింది. ఆ బాల్ను నమ్మలేకపోయా. దాదాపు రెండు నెలలపాటు తీవ్రంగా శ్రమించి.. అలా ఆడాలి.. ఇలా ఆడాలి అని ఊహించుకుంటూ అక్కడికి వెళ్లా.. కానీ, ఆ ఒక్క బంతితో నా ప్రణాళికలన్నీ మారిపోయాయి. ఆ దెబ్బకు నా ఎడమ కంటిచూపు కూడా కాస్త మందగించడం ప్రారంభమైంది. కన్ను వాచినట్లు అనిపించింది. అయితే, అప్పుడు దానిని పెద్దగా పట్టించుకోలేదు. లంచ్ సమయంలో నా ముందు రెండు విషయాలు మాత్రమే ఉన్నాయనిపించింది. పోరాడటమా..? ఫ్లైట్ ఎక్కి భారత్కు వచ్చేయడమా? నేను మాత్రం తొలిదానికే మొగ్గు చూపా. నా తలను బంతితో కొట్టడానికి అతడికెంత ధైర్యం? అని అనుకున్నా. ఆ సిరీస్లో అతడి బౌలింగ్ను చిత్తు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. చివరికి మిచెల్ జాన్సన్పై ఆధిపత్యం ప్రదర్శించగలిగా’’ అని విరాట్ తెలిపాడు.
ఆసీస్తో నాలుగు టెస్టుల సిరీస్ను 0-2 తేడాతో టీమ్ఇండియా కోల్పోయింది. తొలి రెండు మ్యాచుల్లో ఆసీస్ విజయం సాధించగా.. మిగతా రెండు డ్రాగా ముగిశాయి. ఎంఎస్ ధోనీ గైర్హాజరీతో తొలి మ్యాచ్కు విరాట్ కోహ్లీ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత రెండు, మూడు టెస్టులకు ధోనీనే నాయకత్వం వహించాడు. అప్పుడే ధోనీ టెస్టులకు వీడ్కోలు పలకడంతో చివరి టెస్టులో విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్సీని స్వీకరించాడు. ఈ సిరీస్లో స్టీవ్స్మిత్తో కలిసి ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇరువురూ నాలుగేసి శతకాలు బాదారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్