Virat Kohli: నేను అబద్ధాలు చెప్పడం లేదు.. ఆ రోజు చాలా భయపడ్డా: విరాట్ కోహ్లీ
టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. తన తొలి వరల్డ్ కప్ను గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 ప్రపంచ కప్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఐపీఎల్లో భారీగా పరుగులు చేసి ఫామ్లో ఉన్న కోహ్లీ నుంచి మరోసారి అద్భుత ఇన్నింగ్స్లు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాను తొలిసారి వరల్డ్ కప్ (World Cup) ఆడినప్పటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్లో బంగ్లాతో ఆడిన మ్యాచ్ మొదటిది కావడం విశేషం. అందులో కోహ్లీ 83 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.
‘‘ఢాకా వేదికగా బంగ్లాదేశ్తోనే నా తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడా. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురయ్యా. నిజంగా.. నేనేమీ అబద్ధాలు చెప్పడం లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడటం వేరు. మెగా టోర్నీల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించడం వేరు. అప్పుడు జట్టులో నేను చిన్నవయసు క్రికెటర్ను. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడమే అద్భుతం. మ్యాచ్కుముందు రోజు కూడా ఆందోళనగానే ఉన్నా. ఇవన్నీ కూడా మంచి శకునాలే. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తే జట్టుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. దాని కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యా. నా ప్రణాళికలను అమలు చేసేందుకు ఆ నెర్వస్నెస్ సాయపడిందని అనుకుంటా’’ అని కోహ్లీ తెలిపాడు.
విమర్శలను ఆటతోనే తిప్పికొడతాడు: డీకే
విరాట్ కోహ్లీపై ఆటపై ఏమైనా విమర్శలు చేస్తే తనకు ప్రాణహాని హెచ్చరికలు వచ్చాయని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై భారత వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది ఎలా ఉండాలనేది విరాట్ కోహ్లీ తన పుస్తకంలో ఆల్రెడీ రాసేసుకున్నాడు. ఇప్పటికే ప్రారంభించాడు. సైమన్ డౌల్ వంటి వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే కోహ్లీని ఎంత విమర్శిస్తే.. అతడిలోని అద్భుతమైన ఆట బయటకొస్తుంది. ఇలాంటివెన్నో అతడి కెరీర్లో చూశాం’’ అని కార్తిక్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.