Virat Kohli: ఏకైక భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు
తన జట్టు గెలవకపోయినా.. విరాట్ కోహ్లీ మాత్రం ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో బెంగళూరుకు మూడో ఓటమి ఎదురైంది. సొంతమైదానంలో వరుసగా రెండో పరాజయం చవిచూసింది. లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వేదికపై 100 మ్యాచ్లు ఆడిన తొలి భారత క్రికెటర్గా అవతరించాడు. ఈ మ్యాచ్లో విరాట్ 16 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. విరాట్ తర్వాత రోహిత్ శర్మ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 80 మ్యాచ్లు, ఎంఎస్ ధోనీ చెపాక్ మైదానంలో 69 మ్యాచులు ఆడారు. ఒకే వేదికపై ఎక్కువ మ్యాచ్లు ఆడిన ముగ్గురు బ్యాటర్లు వీరే.
కోహ్లీ వరల్డ్ కప్ ఆడాల్సిందే: బ్రెట్ లీ
వన్డే ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ.. చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్లో అదరగొట్టేస్తున్న కోహ్లీని పొట్టి కప్లోనూ ఆడించాలని ఇప్పటికే మాజీ క్రికెటర్లు సూచించారు. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ కూడా ఇదే విషయంపై స్పందించాడు. యువ బౌలర్ మయాంక్పై ప్రశంసలు కురింపించాడు. ‘‘టీ20 ప్రపంచ కప్లో పెద్ద స్టార్లు ఆడాలని కోరుకుంటా. అందులో విరాట్ కోహ్లీ ఆడాల్సిందే. లఖ్నవూ యువ బౌలర్ మయాంక్ అద్భుతమైన పేసర్. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచాడు. అతడు 155+ వేగంతో బంతులేశాడు. అతడిపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెట్టకూడదు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 21 మాత్రమే. నాణ్యమైన పేస్తోపాటు బౌలింగ్ శైలి కూడా చాలా బాగుంది. ఇలానే కొనసాగితే తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్తాడు. పేసర్గా నన్ను ఈ ఐపీఎల్లో ఆకట్టుకుంది జస్ప్రీత్ బుమ్రానే. అతడిని సరిగ్గా వినియోగించుకోవడం లేనిపిస్తోంది. బుమ్రా కొత్త బంతితో బౌలింగ్ చేయడం లేదు. అయినా సరే స్వింగ్ రాబట్టేందుకు ప్రయత్నించాడు’’ అని బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. జూన్ 1 నుంచి యూఎస్ఏ, విండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు