WTC Final: చివరి రోజు ఆట.. విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్!
డబ్ల్యూటీసీ ఫైనల్లో (Wtc Final 2023) భారత్ విజయం సాధించడానికి తీవ్రంగా పోరాడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రీజ్లోఉండటంతో అభిమానుల్లో ఆశలు నిలిచాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో (WTC Final) చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. భారత్ 280 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 164/3 స్కోరుతో ఉంది. క్రీజ్లో విరాట్ కోహ్లీ (44*), అజింక్య రహానె (20*) ఉన్నారు. స్వల్ప వ్యవధిలో రోహిత్, పుజారా ఔటైనప్పటికీ విరాట్ మాత్రం నిలకడగా ఆడాడు. సాధికారిక ఆటతీరుతో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన స్టోరీ వైరల్గా మారింది. తన మైండ్సెట్ ఏంటో అభిమానులకు తెలిపేలా ఆసక్తికర పోస్టు పెట్టాడు.
‘‘మనం ఆందోళనలు, భయాలు, సందేహాలు ఉంటే .. ప్రశాంతంగా జీవించడానికి, ప్రేమించడానికి చోటు ఉండదు. అందుకే అలాంటివాటిని వదిలేసి ఉండటంపై సాధన చేయాలి’’ అని థిచ్ నాట్ హన్హ్ కొటేషన్ను విరాట్ ఇన్స్టా స్టోరీలో ఉంచాడు. రెండు రోజుల కిందట కూడా తన విమర్శకులకు ఘాటైన సమాధానం ఇస్తూ చేసిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. ‘ఇతరుల అయిష్టాన్ని అంగీకరించ గల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే జైలును తలపించే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం’ అనే అర్థం వచ్చేలా సందేశాన్ని ఉంచాడు.
చాలా హ్యాపీగా ఉన్నా
‘‘ప్రస్తుతం నేను ఉన్న దశలో చాలా ఆనందంగా ఉన్నా. గత కొన్నేళ్లుగా ఎన్నో జరిగిపోయాయి. సుదీర్ఘ కెరీర్లో మైదానం వెలుపల, బయటా ఎన్నో చూశా. ఇన్నేళ్లు ఆడటం కూడా చాలా కష్టం. ఇప్పుడు మళ్లీ నా అత్యుత్తమ క్రికెట్ను ఆడుతున్నట్లు అనిపిస్తోంది. జట్టు కోసం ఆడుతూనే ఎంజాయ్ చేస్తున్నా. తొలుత ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఆడా. ఆ తర్వాత నేను సారథిగా ఉన్నా. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ఆడుతున్నా. అన్నివేళలా గర్వంగానే ఫీలవుతా. ఎప్పుడు కూడానూ ఒత్తిడిని కాకుండా గేమ్ను ఆస్వాదించడానికే ప్రయత్నించా’’ అని విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
సచిన్ను అధిగమించిన కోహ్లీ
విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును అధిగమించాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో విరాట్ 678 (16 మ్యాచుల్లో) పరుగులతో కొనసాగుతున్నాడు. గతంలో సచిన్ 15 మ్యాచుల్లో 657 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును విరాట్ అధిగమించాడు. ఇక ఆసీస్పై 2000కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా విరాట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ ఇప్పుడు 2037 పరుగులతో ఉన్నాడు. సచిన్ అందరికంటే ఎక్కువగా 3,630 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్ష్మణ్ (2,434), రాహుల్ ద్రవిడ్ (2,143), పుజారా (2,074) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!