Virat Kohli : విరాట్ vs ఆస్ట్రేలియా.. అదిరిపోయే రికార్డులు.. మరి ఈసారి ఏం చేస్తాడో..
ప్రపంచ టెస్టు మహా సమరం(WTC Final) బుధవారం నుంచే ప్రారంభం కానుంది. కొంత కాలంగా ఐసీసీ ట్రోఫీల కరవును ఎదుర్కొంటున్న టీమ్ఇండియా.. ఈసారి ఆ లోటును తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్డెస్క్ : ప్రపంచ క్రీడాభిమానులంతా ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మహా సమరానికి దిగ్గజ జట్లైన భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) సిద్ధమయ్యాయి. ఇక ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ పరుగుల వీరుడు చెలరేగి ఆడితే.. అడ్డుకోవడం ప్రత్యర్థి జట్టుకు కష్టమే. మరోవైపు ఆసీస్పై కోహ్లీ (Kohli vs Australia)కి మంచి రికార్డులే ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో టెస్టులు అంటే.. విరాట్ అదరగొట్టేస్తాడు. ఇప్పటి వరకూ ఆసీస్పై 24 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.26 సగటుతో మొత్తం 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన నాలుగో టెస్టులో విరాట్.. ఆసీస్పై తన వ్యక్తిగత అత్యధిక స్కోరు(186) నమోదు చేశాడు. ఇదే ఫామ్ను ఇప్పుడు WTC Finalలో కొనసాగించాల్సి ఉంటుంది.
ఇక ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి.. కోహ్లీ మొత్తం 92 మ్యాచ్లు ఆడగా.. 50.97 సగటుతో 4,954 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఓవల్లో మాత్రం..
ఫైనల్ జరిగే ఓవల్ (Oval)లో మాత్రం విరాట్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఈ వేదికగా మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 28.16 సగటుతో 169 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధ శతకం ఉంది. ఆరు ఇన్నింగ్స్ల్లో .. రెండు సార్లు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా.. ఒకసారి డకౌట్గా వెనుదిరిగాడు. అయితే.. ఇటీవల తిరిగి ఫామ్ను అందుకున్న కోహ్లీ .. WTC Finalలాంటి ప్రతిష్ఠాత్మక టెస్టులో చెలరేగి ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
WTC Final ద్వారా విరాట్ ముందున్న రికార్డులివే..
- ఆస్ట్రేలియా (Australia)పై టెస్టుల్లో 1,979 పరుగులు చేసిన విరాట్.. మరో 21 పరుగులు చేస్తే రెండు వేల పరుగుల మైలురాయి చేరుకుంటాడు. మరో 55 పరుగులు చేస్తే.. ఆసీస్పై అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 5 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
- ఐసీసీ టోర్నమెంట్స్ నాకౌట్ స్టేజ్ మ్యాచ్(అన్ని ఫార్మాట్లలో)ల్లో విరాట్ 620 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అతడికంటే ముందు సచిన్ (657), రికీ పాంటింగ్ (731) మాత్రమే ఉన్నారు. ఈ ఫైనల్ ద్వారా ఈ జాబితాలో ముందుకు వెళ్లే అవకాశం కోహ్లీకుంది.
- టెస్టుల్లో ఒకే బౌలర్పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు పుజారా పేరిట ఉంది. నాథన్ లయన్ బౌలింగ్లో అతడు 570 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. నాథన్ బౌలింగ్లోనే కోహ్లీ 511 పరుగులు చేశాడు.
- ఇక ఇంగ్లాండ్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ముందున్నాడు. 46 మ్యాచ్ల్లో అతడు 2,645 పరుగులు చేశాడు. ఆ తర్వాత సచిన్(2,626 పరుగులు) ఉండగా.. మూడో స్థానంలో విరాట్(2,574) ఉన్నాడు. మరో 72 పరుగులు చేస్తే.. విరాట్ మొదటి స్థానంలోకి వస్తాడు.
- ఇక ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్(11 సెంచరీలు) ముందున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో గావస్కర్-విరాట్(8 సెంచరీలు) ఉన్నారు. మరో సెంచరీ చేస్తే.. కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలోకి వస్తాడు.
- ఐసీసీ నిర్వహించే టోర్నీ ఫైనల్స్లో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ బ్యాటర్ గంగూలీ. 2000 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాదా శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరే ఇతర టీమ్ఇండియా ఆటగాడు ఐసీసీ ట్రోఫీ ఫైనళ్లలో సెంచరీ నమోదు చేయలేదు. ఇప్పుడు విరాట్ ఆ లోటును తీర్చుతాడేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు