IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. ‘రో-కో’ జోడీ అన్ని సిరీస్లకు అందుబాటులో ఉండదా..?
భారత స్టార్ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli - Rohit Sharma) ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆసీస్తో టీ20 సిరీస్లోనూ ఆడటం లేదు. దాదాపు నెల రోజులపాటు ఉండే దక్షిణాఫ్రికా పర్యటనకూ వీరిద్దరూ ఆలస్యంగా జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా (Team India) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. కానీ, సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్, జడేజా వంటి మేటి ఆటగాళ్లు లేకుండానే సూర్యకుమార్ నాయత్వంలో బరిలోకి దిగింది. డిసెంబర్ 10 నుంచి దాదాపు నెల రోజులపాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటనకు (IND vs SA) మాత్రం సీనియర్లు వచ్చేస్తారని అంతా భావిస్తున్నారు. కానీ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం పరిమిత ఓవర్ల సిరీస్లకు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే, టీ20 సిరీస్ నుంచి తనకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐకి (BCCI) ప్రతిపాదించినట్లు సమాచారం. టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు విరాట్ పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. తాజాగా వన్డే ప్రపంచకప్లో అతడే టాప్ స్కోరర్ అయినప్పటికీ దక్షిణాఫ్రికాతో వన్డేలకూ దూరంగా ఉండాలనుకోవడం మాత్రం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి వైదొలిగేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? అని చర్చకు తెరలేచింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ నుంచి ఇంకా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. బుమ్రా, జడ్డూ, షమీ, సిరాజ్ మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికాతో (IND vs SA) మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను టీమ్ఇండియా ఆడనుంది. డిసెంబర్ 10న మొదలయ్యే పర్యటన జనవరి 7తో ముగియనుంది. భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్లకు త్వరలోనే జట్లను ఎంపిక చేయనుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కుటుంబంతో కలిసి లండన్లో విహారానికి వెళ్లాడు. రోహిత్ కూడా యూకేలోనే ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆసీస్తో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం