Virat Kohli: ఏబీడీ లేని లోటు సుస్పష్టం.. విరాట్ ఒక్కడే గెలిపించడం అసాధ్యం: భారత మాజీలు
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న బెంగళూరుకు సొంతమైదానం కూడా కలిసిరావడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు పరిస్థితి ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడే మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్టార్ ప్లేయర్లు డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రభావం చూపించడం లేదు. కీలకమైన నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్ లేని లోటు సుస్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు.
ఆసీస్కు బాగానే ఆడాడు.. కానీ: మనోజ్ తివారీ
‘‘లఖ్నవూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ, బెంగళూరుకు ఏబీ డివిలియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా ఆడాడు. బెంగళూరు జట్టుకు మాత్రం విఫలమవుతున్నాడు. డుప్లెసిస్ కెప్టెన్సీ నిర్ణయాలు కూడా గొప్పగా లేవు. మరో ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. మొత్తం 14లో కనీసం సగం మ్యాచుల్లోనైనా విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాలి’’ అని మనోజ్ తివారీ తెలిపాడు.
ప్రతి ఫ్రాంచైజీ కోరుకునేది అదే..: సెహ్వాగ్
‘‘ఒక్కడే ఏడెనిమిది ఇన్నింగ్స్ల్లో అద్భుతంగా ఆడటం కష్టం. కోహ్లీకీ అది అసాధ్యమే. ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదు. భారీ మొత్తం వెచ్చించిన స్టార్ ఆటగాడి నుంచి ప్రతి ఫ్రాంచైజీ కనీసం రెండు మ్యాచుల్లోనైనా అద్భుత ఇన్నింగ్స్లను ఆశిస్తుంది. ప్రతి మ్యాచ్లోనూ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తే సరిపోతుంది’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో బెంగళూరు మూడు ఓటములు, ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు