Virat Kohli: ఏబీడీ లేని లోటు సుస్పష్టం.. విరాట్ ఒక్కడే గెలిపించడం అసాధ్యం: భారత మాజీలు
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న బెంగళూరుకు సొంతమైదానం కూడా కలిసిరావడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు పరిస్థితి ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడే మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్టార్ ప్లేయర్లు డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రభావం చూపించడం లేదు. కీలకమైన నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్ లేని లోటు సుస్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు.
ఆసీస్కు బాగానే ఆడాడు.. కానీ: మనోజ్ తివారీ
‘‘లఖ్నవూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ, బెంగళూరుకు ఏబీ డివిలియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా ఆడాడు. బెంగళూరు జట్టుకు మాత్రం విఫలమవుతున్నాడు. డుప్లెసిస్ కెప్టెన్సీ నిర్ణయాలు కూడా గొప్పగా లేవు. మరో ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. మొత్తం 14లో కనీసం సగం మ్యాచుల్లోనైనా విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాలి’’ అని మనోజ్ తివారీ తెలిపాడు.
ప్రతి ఫ్రాంచైజీ కోరుకునేది అదే..: సెహ్వాగ్
‘‘ఒక్కడే ఏడెనిమిది ఇన్నింగ్స్ల్లో అద్భుతంగా ఆడటం కష్టం. కోహ్లీకీ అది అసాధ్యమే. ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదు. భారీ మొత్తం వెచ్చించిన స్టార్ ఆటగాడి నుంచి ప్రతి ఫ్రాంచైజీ కనీసం రెండు మ్యాచుల్లోనైనా అద్భుత ఇన్నింగ్స్లను ఆశిస్తుంది. ప్రతి మ్యాచ్లోనూ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తే సరిపోతుంది’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో బెంగళూరు మూడు ఓటములు, ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?