Hardik Pandya: హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి పరిస్థితి అధ్వానంగా తయారైంది. స్టార్ ప్లేయర్లు ఉన్నా గెలుపు కోసం కష్టపడాల్సి వస్తోంది. కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శనలోనూ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రభావం చూపించడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబయి కనీసం ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడమూ కష్టమేనన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పాండ్యకు కీలక సూచన చేశాడు. గత మూడు సీజన్లలోనూ రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబయిని విజేతగా నిలపలేదని.. పాండ్య తన ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
‘‘బ్యాటర్గా, బౌలర్గా హార్దిక్ పాండ్యపై ఒత్తిడి ఎక్కువగా ఉందని అనుకోవడం లేదు. అతడే అలా భావిస్తున్నాడేమోనని అనిపిస్తోంది. రోహిత్ నుంచి సారథ్య బాధ్యతలను చేపట్టిన పాండ్యపై భారీ అంచనాలు ఉండటం సహజమే. కానీ, ముంబయికి ఇలాంటి పరిస్థితి గత రెండు సీజన్ల నుంచి ఉంది. రోహిత్ శర్మ కూడా కెప్టెన్గా పరుగులు చేయలేకపోయాడు. ఇటీవల ట్రోఫీని కూడా సాధించి పెట్టలేదు. కాబట్టి, పాండ్య కూడా ఎలాంటి ఒత్తిడికి గురికానక్కర్లేదు. జట్టుగా ఆడితేనే ముంబయికి విజయాలు దక్కుతాయి. అలా జరగాలంటే.. ముందు హార్దిక్ పాండ్య తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలి. కెప్టెన్సీలో జట్టు విజయాలు సాధించలేకపోవడంతో అదనపు ఒత్తిడిగా భావిస్తున్నాడు. తన బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేసుకోవాలి. లోయర్ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చినప్పుడు ఎక్కువ బంతులు ఎదుర్కోవడం సాధ్యం కాదు. అందుకే, తనకుతానే అవకాశం సృష్టించుకోవాలి. మొదట బ్యాటింగ్ బాగా చేస్తే ఆటోమేటిక్గా బౌలింగ్తోపాటు కెప్టెన్సీలోనూ మెరుగుదల కనిపిస్తుంది’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబయి 8 మ్యాచ్లు ఆడింది. కేవలం మూడు విజయాలతో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ గెలిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఒక్కటి ఓడినా ఛాన్స్లు క్రమంగా కరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. లఖ్నవూ, కోల్కతాతో రెండేసి మ్యాచ్లు.. హైదరాబాద్, దిల్లీ జట్లతో ఒక్కో మ్యాచ్ను ముంబయి ఆడాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం