Virat - Gambhir: ఓటమిని నిశ్శబ్దంగా అంగీకరించాల్సిందే: సెహ్వాగ్
స్టార్ ఆటగాళ్ల మధ్య వివాదంపై బీసీసీఐ (BCCI) కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు. అలాగే ఓడిపోయిన జట్టుకు కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) మ్యాచ్ల మజా కంటే గంభీర్ - విరాట్ వాగ్వాదం హైలైట్గా నిలిచింది. ఒకరినొకరు కవ్వించుకుంటూ చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, వీరిద్దరిపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. లఖ్నవూ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీపై ఆర్సీబీ విజయం సాధించడంతో ఈ వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో గంభీర్ - విరాట్ వ్యవహారంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అయితే మరొక అడుగు ముందుకేసి కఠిన శిక్ష విధించాలని సూచించాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజేతగా నిలిచిన జట్టు సంబరాలు చేసుకుంటూ వెళ్లాలని, ఓడిన జట్టు నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని పేర్కొన్నాడు.
‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత వెంటనే నేను టీవీ ఆపేస్తా. కాబట్టి విరాట్ - గంభీర్ ఎపిసోడ్ను చూడలేకపోయా. మరుసటి రోజు సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయింది. అక్కడ జరిగింది మాత్రం సరైంది కాదు. ఓడిపోయినవారు నిశ్శబ్దంగా ఓటమిని అంగీకరించి అక్కడ నుంచి వెళ్లిపోవాలి. గెలిచిన టీమ్ సంబరాలు చేసుకుంటూ వెళ్లాలి. ఒకరినొకరు ఏదొక మాట అనడం ఎందుకు? వారిద్దరూ సెలబ్రెటీలు. వారు ఏం చేసినా..? ఏం మాట్లాడినా..? లక్షల మంది చిన్నారులు, అభిమానులు చూస్తారు. ‘మా ఐకాన్ ఇలా చేశాడు కాబట్టి.. నేను కూడా చేయొచ్చు’ అని అనుకొనే ప్రమాదమూ లేకపోలేదు. వీటన్నింటినీ మదిలో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
ఇలాంటి సంఘటనలపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారిపై నిషేధం విధించాల్సిన అవసరమూ ఉందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ‘‘ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరిపైనైనా బ్యాన్ వేస్తే పునరావృతం కాకుండా చూడొచ్చు. బీసీసీఐ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉండేలా చూడాలి. మైదానంలో స్టార్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు మాత్రం సహేతుకంగా లేదు’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం