Maldives Row: మన దగ్గరా అద్భుతమైన బీచ్లు.. సదుపాయాలు కల్పిస్తే చాలు: సెహ్వాగ్
లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు చేసిన విమర్శలను భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ ఖండించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లపై మాజీ క్రికెటర్లు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయడం తగదని ‘ఎక్స్’ వేదికగా పోస్టులు పెట్టారు.
‘‘ఉడిపిలోని అందమైన బీచ్లు, పాండిలోని ప్యారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హేవ్లాక్ ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన దేశంలోనూ అందమైన బీచ్లు, అన్వేషించని చాలా ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆపదల నుంచి అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల మంత్రులు మన దేశం, ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేలా.. ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని వసతులు సమకూర్చాలి. దాని వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసినట్లవుతుంది. మీకు ఇష్టమైన.. అందమైన ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్పండి’’ - వీరేంద్ర సెహ్వాగ్
‘‘నేను 15 ఏళ్ల వయసు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూనే ఉన్నా. ప్రతి దేశంలోనూ భారత హోటల్స్, పర్యాటక శాఖ అందించే సేవలు అద్భుతంగా ఉంటాయి. ఆయా దేశాల సంస్కృతిని గౌరవించేలా ఉంటాయి. ఇప్పుడు కొందరు భారత్పై నెగెటివ్ కామెంట్లు చేయడం బాధాకరం. నా మాతృభూమి ఆతిథ్యం ఎప్పుడూ బాగుంటుంది’’ - ఇర్ఫాన్ పఠాన్
‘లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రుల అక్కసు’
‘‘మాల్దీవుల ప్రజా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు.. భారతీయులను బాధపెట్టేలా, వివక్ష చూపేలా ఉండటం బాధాకరం. నేను కూడా చాలాసార్లు అక్కడ పర్యటించా. అక్కడి అందాలు ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం. ఇటీవల సంఘటనల నేపథ్యంలో మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మన దేశంలోని ప్రదేశాల్లో సంబరాలు చేసుకోవడానికి ఇదే సరైన సమయం’’ - సురేశ్ రైనా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే