లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రుల అక్కసు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు.
అంత పరిశుభ్రంగా ఉంచలేరని వ్యాఖ్యలు
మోదీ వీడియోను ట్యాగ్ చేస్తూ విమర్శలు
భారత్ తీవ్రంగా స్పందించడంతో వెంటనే మంత్రుల సస్పెన్షన్
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. భారత్లో పర్యాటక ప్రాంతాలను అంత పరిశుభ్రంగా ఉంచలేరని విమర్శించారు. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అటు కేంద్ర ప్రభుత్వమూ తీవ్రంగా స్పందించింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అవి వ్యక్తిగత వ్యాఖ్యలని స్పష్టం చేసింది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండు చేసింది.
లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు మరియం షివునా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్ సామాజిక మాధ్యమాల్లో విద్వేష వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్పై భారతీయ నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు. మంత్రుల వ్యాఖ్యలను మాలెలోని భారత హైకమిషన్ వర్గాలు మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రధానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాయి.
ప్రభుత్వానికి సంబంధం లేదు: మాల్దీవులు
భారత్ను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఒక దగ్గరి నేతను ఉద్దేశించి మా దేశానికి చెందిన కొందరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత వారిపై ప్రభుత్వం వేటు వేసింది.
ట్రెండింగ్లో బాయ్కాట్ మాల్దీవులు
భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమ్య స్థానం లక్షద్వీప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్లోని లక్షద్వీప్, సింధు దుర్గ్ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు కూడా విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM