Hardik - Rohit: అప్పుడు ‘ఐదు’ ఓడారు.. ముంబయి కెప్టెన్సీ మార్పుపై కాస్త ఓపిక పట్టండి: సెహ్వాగ్
హార్దిక్ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీ మార్పుపై ఇప్పుడే చర్చించడం తగదని.. సరైన సమయం కూడా కాదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: హార్దిక్ పాండ్య నాయకత్వంలోని ముంబయి జట్టు ఇప్పటి వరకు 17వ సీజన్లో బోణీ కొట్టలేదు. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో పాండ్యను కెప్టెన్గా పక్కన పెట్టేసి రోహిత్కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లూ వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కానీ, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఇప్పుడే ఇలాంటి వాటిపై మాట్లాడటం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించాడు.
‘‘పాండ్య గురించి తివారీ ఇప్పుడే ఇలాంటివి చెప్పడం తొందరపాటే. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ ముంబయి వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. అదే ఏడాది ఛాంపియన్గా నిలిచింది. కాబట్టి, మనం పాండ్య కెప్టెన్సీ గురించి ఇంకాస్త ఓపిగ్గా ఉండాలి. ఓ అంచనాకు వచ్చే ముందు మరో రెండు మ్యాచ్ల వరకైనా వేచి చూడాలి’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
మనోజ్ తివారీ ఏమన్నాడంటే?
‘‘హార్దిక్ పాండ్య చాలా ఒత్తిడిలో ఉన్నాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా.. బౌలింగ్ దాడిని ప్రారంభించే బౌలర్తో తొలి ఓవర్ను వేయించలేదు. బుమ్రా అద్భుతంగా స్వింగ్ రాబట్టాడు. కానీ, అతడిని ఎక్కవ వినియోగించుకోవాలో పాండ్యకు తెలిసినట్లు లేదు. అందుకే, రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్గా చేస్తే బాగుంటుంది. కెప్టెన్సీ మార్పు అనేది పెద్ద నిర్ణయమే అవుతుంది’’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు.
హార్దిక్ ఒంటరైనట్లు అనిపిస్తోంది: హర్భజన్
సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్గా మారింది. డగౌట్లో ఒక్కడే కూర్చున్న ఫొటో అది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ అలాంటి విజువల్స్ చూడటం బాగోలేదు. అతడిని ఒంటరిగా వదిలేసినట్లు అనిపిస్తోంది. ఫ్రాంచైజీలోని ప్రతి ఆటగాడూ పాండ్యను కెప్టెన్గా అంగీకరించాల్సిందే. ఈ జట్టుకు ఆడిన ఆటగాడిగా చెబుతున్నాను.. ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు’’ అని భజ్జీ తెలిపాడు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘‘కావాలనే ఇలా జరుగుతుందని అనుకోవడం లేదు. పాండ్య అయోమయానికి గురవుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో పెద్ద స్టార్లు ఉండటం వల్ల హార్దిక్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు అనిపిస్తోంది’’ అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి