Hardik - Rohit: అప్పుడు ‘ఐదు’ ఓడారు.. ముంబయి కెప్టెన్సీ మార్పుపై కాస్త ఓపిక పట్టండి: సెహ్వాగ్
హార్దిక్ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీ మార్పుపై ఇప్పుడే చర్చించడం తగదని.. సరైన సమయం కూడా కాదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: హార్దిక్ పాండ్య నాయకత్వంలోని ముంబయి జట్టు ఇప్పటి వరకు 17వ సీజన్లో బోణీ కొట్టలేదు. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో పాండ్యను కెప్టెన్గా పక్కన పెట్టేసి రోహిత్కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లూ వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కానీ, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఇప్పుడే ఇలాంటి వాటిపై మాట్లాడటం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించాడు.
‘‘పాండ్య గురించి తివారీ ఇప్పుడే ఇలాంటివి చెప్పడం తొందరపాటే. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ ముంబయి వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. అదే ఏడాది ఛాంపియన్గా నిలిచింది. కాబట్టి, మనం పాండ్య కెప్టెన్సీ గురించి ఇంకాస్త ఓపిగ్గా ఉండాలి. ఓ అంచనాకు వచ్చే ముందు మరో రెండు మ్యాచ్ల వరకైనా వేచి చూడాలి’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
మనోజ్ తివారీ ఏమన్నాడంటే?
‘‘హార్దిక్ పాండ్య చాలా ఒత్తిడిలో ఉన్నాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా.. బౌలింగ్ దాడిని ప్రారంభించే బౌలర్తో తొలి ఓవర్ను వేయించలేదు. బుమ్రా అద్భుతంగా స్వింగ్ రాబట్టాడు. కానీ, అతడిని ఎక్కవ వినియోగించుకోవాలో పాండ్యకు తెలిసినట్లు లేదు. అందుకే, రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్గా చేస్తే బాగుంటుంది. కెప్టెన్సీ మార్పు అనేది పెద్ద నిర్ణయమే అవుతుంది’’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు.
హార్దిక్ ఒంటరైనట్లు అనిపిస్తోంది: హర్భజన్
సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్గా మారింది. డగౌట్లో ఒక్కడే కూర్చున్న ఫొటో అది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ అలాంటి విజువల్స్ చూడటం బాగోలేదు. అతడిని ఒంటరిగా వదిలేసినట్లు అనిపిస్తోంది. ఫ్రాంచైజీలోని ప్రతి ఆటగాడూ పాండ్యను కెప్టెన్గా అంగీకరించాల్సిందే. ఈ జట్టుకు ఆడిన ఆటగాడిగా చెబుతున్నాను.. ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు’’ అని భజ్జీ తెలిపాడు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘‘కావాలనే ఇలా జరుగుతుందని అనుకోవడం లేదు. పాండ్య అయోమయానికి గురవుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో పెద్ద స్టార్లు ఉండటం వల్ల హార్దిక్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు అనిపిస్తోంది’’ అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?