David Warner: ఆ మాట చెప్పినప్పుడు వార్నర్ నవ్వేశాడు: సెహ్వాగ్
టెస్టు క్రికెట్లో దూకుడుగా ఉండే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. పాకిస్థాన్తో జరుగుతున్న మూడో టెస్టు (AUS vs IND) వార్నర్కు ఆఖరిది. వన్డేలు, టీ20లతో కెరీర్ను ప్రారంభించిన వార్నర్లో సుదీర్ఘ ఫార్మాట్ ఆడే నైపుణ్యం ఉందని గుర్తించిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag). ఇదే మాటను వార్నర్ కూడా ఓ సందర్భంలో వెల్లడించాడు.
‘‘2009 ఐపీఎల్లో దిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడేందుకు వార్నర్ వచ్చాడు. అప్పుడే టీ20లు, వన్డేలు ఆడటం మొదలు పెట్టాడు. అతడు ఆడేతీరును చూసి టెస్టు క్రికెట్లో రాణించగల సత్తా ఉందనిపించింది. కుర్రాడిగా ఉన్న వార్నర్కు మాత్రం అప్పుడు అర్థం కాలేదు. అతడికి తన నైపుణ్యంపై విశ్వాసం కుదరలేదు. టీ20 క్రికెట్లో వార్నర్ ఆట చూసిన తర్వాత టెస్టుల్లో ఇంకా బాగా ఆడతాడని అప్పుడే చెప్పా. ఇదే విషయాన్ని అతడికి చెబితే నవ్వడం ప్రారంభించాడు’’
‘‘నేను టెస్టు క్రికెట్కు చాలా దూరంలో ఉన్నా. ఆసీస్ జట్టులోకి రావాలంటే చాలా కష్టం’ అని అప్పుడు వార్నర్ నాతో చెప్పాడు. ‘సరే, ఇదే ఆటతీరును కొనసాగించు. టెస్టు క్రికెట్లో ఆడే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ సత్తా చూపిస్తావు. టీ20ల్లో కేవలం 20 ఓవర్లే ఆడాలి. అదే టెస్టుల్లో ఎంతసేపైనా ఆడొచ్చు’ అని నేను అన్నాను. ఆ తర్వాత టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టి అద్భుతంగా రాణించాడు. నేను చెప్పిన మాటలను గుర్తు పెట్టుకుని ధన్యవాదాలు చెప్పాడు. టెస్టుల్లో ఇంకా కొనసాగితే బాగుండేది. ఇప్పుడు అతడి వయసురీత్యా ఆ ఫార్మాట్లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..