Hardik Pandya: మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యపై (Hardik Pandya) విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మ్యాచుల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ తీవ్రంగా స్పందించాడు. మన దగ్గర అభిమానులు ఇలాంటి వాటిని ఎప్పటికీ మరిచిపోరని.. వారి పిల్లలకూ చెబుతుంటారని అక్రమ్ వ్యాఖ్యానించాడు. ఇకనైనా నిశ్శబ్దంగా ఉండాలని ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేశాడు.
‘‘హార్దిక్ విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆందోళనకరంగా మారింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లో ఓ సమస్య ఉంది. ఏ విషయాన్ని మనం మరిచిపోం. హార్దిక్ పాండ్యకు కొడుకు ఎప్పుడు పుట్టాడు, 20 ఏళ్ల కిందట అతడు ఎలా కెప్టెన్ అయ్యాడనే విషయాలను మన పిల్లలకూ చెబుతాం. ఇక నుంచైనా అభిమానులు నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడు ఇక్కడి ఆటగాడు. ముంబయి జట్టుకు ఆడాడు. మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నించే ఓ ప్లేయర్. ఇప్పటికీ 2024 సీజన్లో ప్లేఆఫ్స్కు వెళ్లేందుకు ముంబయికి అవకాశం ఉంది. సొంత ఆటగాడిని హేళన చేయడానికి మరే పాయింట్ మీ దగ్గర (ఫ్యాన్స్ను ఉద్దేశించి) లేదు. ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఇకనైనా వాటిని వదిలేసి ముందుకు సాగాలి. ఫ్రాంచైజీ క్రికెట్లో కెప్టెన్సీ మార్పులు సహజం. చెన్నైనే తీసుకోండి. అక్కడా సారథి మారాడు. సుదీర్ఘ కాలం జట్టును నడిపించడానికి అవసరమైన ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయాలు ఉంటాయి. ముంబయి కూడా అలానే చేసి ఉండొచ్చు. అక్కడ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు ఉండవు. అయితే, నా వరకు మాత్రం రోహిత్ను మరో ఏడాదిపాటు కొనసాగిస్తే బాగుండేది. వచ్చే సీజన్లో పాండ్యను కెప్టెన్గా చేస్తే సరిపోయేది. అప్పుడు ఎలాంటి వివాదమూ వచ్చి ఉండేది కాదు’’ అని అక్రమ్ తెలిపాడు.
పాండ్య మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు: ఉతప్ప
‘‘పాండ్య ఫిట్నెస్ గురించి హేళనలు, ట్రోలింగ్, మీమ్స్ చాలా వచ్చాయి. ఇవి అతడిని బాధించవని మీరు (ఫ్యాన్స్) భావిస్తున్నారా? తప్పకుండా హర్ట్ చేస్తాయి. అసలు ఎంత మందికి అతడి ఫిట్నెస్ గురించి కరెక్ట్గా తెలుసు? ఇప్పుడు హార్దిక్ మానసిక సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నాడు. భారతీయులుగా మనకు చాలా భావోద్వేగాలు ఉంటాయి. అయితే, మరొకరిపై ఇలాంటి వైఖరి ప్రదర్శించడం సరైంది కాదు. ఓ వ్యక్తిని అవమానిస్తూ నవ్వుకోవడం, మీమ్స్తో విమర్శించడం ఆపేయాలి’’ అని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి