Hardik Pandya: మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యపై (Hardik Pandya) విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మ్యాచుల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ తీవ్రంగా స్పందించాడు. మన దగ్గర అభిమానులు ఇలాంటి వాటిని ఎప్పటికీ మరిచిపోరని.. వారి పిల్లలకూ చెబుతుంటారని అక్రమ్ వ్యాఖ్యానించాడు. ఇకనైనా నిశ్శబ్దంగా ఉండాలని ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేశాడు.
‘‘హార్దిక్ విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆందోళనకరంగా మారింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లో ఓ సమస్య ఉంది. ఏ విషయాన్ని మనం మరిచిపోం. హార్దిక్ పాండ్యకు కొడుకు ఎప్పుడు పుట్టాడు, 20 ఏళ్ల కిందట అతడు ఎలా కెప్టెన్ అయ్యాడనే విషయాలను మన పిల్లలకూ చెబుతాం. ఇక నుంచైనా అభిమానులు నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడు ఇక్కడి ఆటగాడు. ముంబయి జట్టుకు ఆడాడు. మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నించే ఓ ప్లేయర్. ఇప్పటికీ 2024 సీజన్లో ప్లేఆఫ్స్కు వెళ్లేందుకు ముంబయికి అవకాశం ఉంది. సొంత ఆటగాడిని హేళన చేయడానికి మరే పాయింట్ మీ దగ్గర (ఫ్యాన్స్ను ఉద్దేశించి) లేదు. ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఇకనైనా వాటిని వదిలేసి ముందుకు సాగాలి. ఫ్రాంచైజీ క్రికెట్లో కెప్టెన్సీ మార్పులు సహజం. చెన్నైనే తీసుకోండి. అక్కడా సారథి మారాడు. సుదీర్ఘ కాలం జట్టును నడిపించడానికి అవసరమైన ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయాలు ఉంటాయి. ముంబయి కూడా అలానే చేసి ఉండొచ్చు. అక్కడ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు ఉండవు. అయితే, నా వరకు మాత్రం రోహిత్ను మరో ఏడాదిపాటు కొనసాగిస్తే బాగుండేది. వచ్చే సీజన్లో పాండ్యను కెప్టెన్గా చేస్తే సరిపోయేది. అప్పుడు ఎలాంటి వివాదమూ వచ్చి ఉండేది కాదు’’ అని అక్రమ్ తెలిపాడు.
పాండ్య మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు: ఉతప్ప
‘‘పాండ్య ఫిట్నెస్ గురించి హేళనలు, ట్రోలింగ్, మీమ్స్ చాలా వచ్చాయి. ఇవి అతడిని బాధించవని మీరు (ఫ్యాన్స్) భావిస్తున్నారా? తప్పకుండా హర్ట్ చేస్తాయి. అసలు ఎంత మందికి అతడి ఫిట్నెస్ గురించి కరెక్ట్గా తెలుసు? ఇప్పుడు హార్దిక్ మానసిక సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నాడు. భారతీయులుగా మనకు చాలా భావోద్వేగాలు ఉంటాయి. అయితే, మరొకరిపై ఇలాంటి వైఖరి ప్రదర్శించడం సరైంది కాదు. ఓ వ్యక్తిని అవమానిస్తూ నవ్వుకోవడం, మీమ్స్తో విమర్శించడం ఆపేయాలి’’ అని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి