USA vs PAK: యూఎస్ఏ చేతిలో ఓటమి.. ఇక నుంచి పాక్కు కష్టాలే: వసీమ్ అక్రమ్
పాకిస్థాన్ తన తొలి మ్యాచ్లో ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో యూఎస్ఏ ప్రదర్శనను ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) తొలి మ్యాచ్లో పాకిస్థాన్కు ఓటమి ఎదురైంది. యూఎస్ఏ సంచలన విజయం సాధించి ఆశ్చర్యానికి గురి చేసింది. సూపర్ ఓవర్కు వెళ్లిన మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించాడు. యూఎస్ఏతో మ్యాచ్లో వెనుకబడిపోవడానికి కారణమేంటో చెప్పాడు.
‘‘గెలవడం, ఓడిపోవడం అనేది గేమ్లో కామన్. చివరి బంతి వరకూ పోరాడటం మాత్రం అత్యంత ముఖ్యం. కానీ, యూఎస్ఏతో మ్యాచ్లో అలాంటిదేమీ కనిపించలేదు. ఇదే పాక్ క్రికెట్కు కలిసిరాలేదు. సూపర్ 8కు వెళ్లాలంటే మా జట్టు చాలా శ్రమించాలి. ఇప్పటి నుంచి కష్టాలు మొదలైనట్లే. తదుపరి మ్యాచుల్లో భారత్ (జూన్ 9న)తో తలపడాల్సి ఉంటుంది. ఐర్లాండ్, కెనడాలతోనూ అంత తేలికేం కాదు. పాక్ త్వరగా వికెట్లను కోల్పోవడమే ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్. యూఎస్ఏ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, షాదాబ్ మధ్య భాగస్వామ్యం రావడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగిలిన వారు రాణించలేదు. ఇక ఫీల్డింగ్లోనూ తేలిపోయారు. వీరి ఆటతీరు యావరేజీ కంటే తక్కువే అని చెప్పాలి. ఈ మ్యాచ్లో పాక్ ప్రదర్శనే సరిగా లేదు. యూఎస్ఏతో ఆడేటప్పుడు నాతోపాటు మా జట్టు అభినులంతా గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నాం. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా అలాంటి భావనే ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్ వచ్చేనాటికి యూఎస్ఏ దూకుడు పెరిగింది. ఆ జట్టు సూపర్ ఓవర్లో 19 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అది ప్రత్యర్థిపై ఒత్తిడిని గణనీయంగా పెంచే విషయం. ఆ జట్టు కెప్టెన్ మోనాంక్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఫీల్డింగ్ కూడా బాగుంది. తప్పకుండా పాక్ మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి’’ అని అక్రమ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ