సెహ్వాగ్పై విషం కక్కిన పాక్ బౌలర్ హసన్
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఔట్ చేయడం చాలా సులభమని పాక్ బౌలర్ రాణా నవేద్ ఉల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. సెహ్వాగ్ను ఔట్ చేసిన సందర్భం గురించి వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వీలుచిక్కినప్పుడల్లా పాకిస్థాన్ క్రికెటర్లు భారత ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి అక్కసు వెళ్లగక్కుతుంటారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్పై పాక్ బౌలర్ రాణా నవేద్ ఉల్ హసన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఔట్ చేయడం చాలా సులభమని చెప్పాడు. దీనికి ఉదాహరణగా ఓ మ్యాచ్లో సెహ్వాగ్ను ఔట్ చేసిన తీరు గురించి చెప్పాడు.
భారత్, పాక్ మధ్య 2004-05లో జరిగిన సిరీస్ అది. అప్పటికే భారత్ 2-0తో ముందుంజలో ఉంది. మూడో మ్యాచ్లోనూ భారత్ 300కుపైగా పరుగులతో దూసుకెళ్తోంది. ఆ సమయంలో సెహ్వాగ్ 85 పరుగుల వద్ద ఉన్నాడు. వీరూ వికెట్ తీస్తేనే మ్యాచ్ గెలుస్తామని భావించిన పాక్ పేసర్ హసన్.. తన కుటిల బుద్ధిని బయటపెట్టాడు. సెహ్వాగ్కు స్లోగా బౌలింగ్ చేసి ‘నీకు ఎలా ఆడాలో తెలియదు..’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన సెహ్వాగ్.. హసన్ వేసిన తదుపరి బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఫాస్ట్ బౌలర్కు బ్యాటర్ను రెచ్చగొట్టి స్లో డెలవరీతో బోల్తా కొట్టించే ట్రిక్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. భారత్ ఆటగాళ్లలో సెహ్వాగ్ను ఔట్ చేయొచ్చు.. గానీ, రాహుల్ ద్రవిడ్ను ఔట్ చేయడం అంత సులువు కాదని చెప్పాడు.
ధోనీ ముందుకు వచ్చే సరికి.. నా నోరు మూతపడుతుంది: చాహల్
టెస్ట్ మ్యాచ్లను కూడా టీ20ల్లా ఆడి భారత్కు ఎన్నో విజయాలు అందించాడు టీమ్ ఇండియా ఓపెనర్.. వీరేంద్ర సెహ్వాగ్. తన కెరియర్లో మొత్తం 104 టెస్టులు ఆడి 8,586 పరుగులు సాధించాడు. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన రికార్డు వీరూకి ఉంది. 251 వన్డేల్లో 8,273 పరుగులు, 19 టీ20ల్లో 394 పరుగులు చేశాడు. ఇక పాక్ బౌలర్ హసన్ విషయానికొస్తే.. 74 వన్డేల్లో 110 వికెట్లు తీశాడు. 9 టెస్టులు, 4 టీ20లు ఆడి మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే