Yuzvendra Chahal : ధోనీ ముందుకు వచ్చే సరికి.. నా నోరు మూతపడుతుంది: చాహల్
ధోనీ(MS Dhoni)తో తనకున్న అనుబంధాన్ని స్పిన్నర్ చాహల్ (Yuzvendra Chahal) గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయాల్లో అతడు ఆటగాళ్లకు ఎలా మద్దతుగా ఉంటాడో వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni).. సారథ్య బాధ్యతలు నిర్వహించడంలో ఎంత కూల్గా ఉంటాడో.. సహచర ఆటగాళ్లతోనూ అంతే సరదాగా ఉంటాడు. అందుకే ఇతర జట్లలోని ఆటగాళ్లు కూడా అతడిని ఆరాదిస్తూ ఉంటారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా.. ధోనీ వారికి ఆట మెరుగుపరచుకోవడంలో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. ఇక మహీ సారథ్యంలో ఎదిగిన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal).. అతడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్లో తన చేష్టలతో సహచరులను ఆటపట్టించే చాహల్.. ధోనీ ఎదురుపడితే మాత్రం సైలెంట్ అవుతాడట. ఈ విషయాన్ని చాహల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కేవలం ధోనీ ముందు మాత్రమే నేను సైలెంట్గా ఉంటాను. అతడు నా ముందుకు వచ్చేసరికి నా నోరు ఆటోమేటిక్గా మూతపడుతుంది. అనవసర విషయాలు మాట్లాడను. మహీ భాయ్ ముందు కూర్చుని.. అతడు అడిగిన వాటికి మాత్రమే సమాధానమిస్తాను. లేకపోతే నిశ్శబ్దంగా ఉంటాను’ అంటూ చాహల్ వివరించాడు.
అప్పటికి చాహల్ ఎవరో తెలియదు..! ధనశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో సెంచూరియన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులు సమర్పించుకున్నప్పటికీ ధోనీ తనపై ఎంతో నమ్మకముంచాడని చాహల్ తెలిపాడు. ‘దక్షిణాఫ్రికాతో టీ20 ఆడుతున్నాం. నేను వేసిన 4 ఓవర్లలో 64 పరుగులు బాదారు. హెన్రిక్ క్లాసెన్ నా బౌలింగ్లో దంచికొడుతున్నాడు. వెంటనే ధోనీ నా వద్దకు వచ్చి రౌండ్ ది వికెట్ వేస్తావా.. అంటూ అడిగాడు. నేను అలానే చేశాను. అయినా.. క్లాసెన్ సిక్స్ బాదాడు. మళ్లీ ధోనీ నా వద్దకు వచ్చాడు. ‘ఈరోజు నీది కాదు.. అయినా ఫర్లేదు’ అంటూ నా భుజం తట్టాడు. మిగిలిన ఐదు బంతుల్లో బౌండరీలు ఇవ్వకుండా చూసుకో.. అది జట్టుకు ఉపయోగపడుతుంది అని చెప్పి వెళ్లాడు. అప్పుడు తెలిసింది.. నాది కాని రోజున కూడా నాకు జట్టు నుంచి మద్దతు లభిస్తుంది అని’ అంటూ ధోనీ కెప్టెన్సీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
చాహల్ ఇప్పటి వరకూ 72 వన్డేలు ఆడి 121 వికెట్లు పడగొట్టగా.. 75 టీ20లు ఆడి 91 వికెట్లు సాధించాడు. ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు