T20 World Cup: టీ20 ప్రపంచకప్.. ‘డిఫెండింగ్’ ఛాంపియన్స్ పరిస్థితేంటి?
ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానులను అలరించడానికి మెగా టోర్నీ సిద్ధమైంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
హేమాహేమీ టీమ్లు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు ప్రపంచ కప్లను వేదికగా చేసుకుంటాయి. జూన్ 2 నుంచి మరో సంగ్రామం మొదలుకానుంది. అదే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024). ఇప్పటివరకు ఎనిమిది టీ20 వరల్డ్ కప్ టోర్నీలు జరిగాయి. ఒక్కసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన జట్టు మళ్లీ విజేతగా నిలవలేదు. మరి ‘9’లో ఏమవుతుందనేది ఆసక్తికరం. గత పొట్టి కప్ల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పరిస్థితేంటో చూద్దాం.
- 2007: తొలిసారి ఐసీసీ నిర్వహించిన టీ20 ప్రపంచ కప్ ఇదే. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ ఛాంపియన్గా నిలిచింది. యువరాజ్, గంభీర్, సెహ్వాగ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో పాక్పై 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన టోర్నీ ఇది.
- 2009: డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ బరిలోకి దిగింది. ఈసారి మాత్రం దారుణ ఫలితాలను చవిచూసింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో టీమ్ఇండియా రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. మొదటి ఎడిషన్లో మిస్ అయిన కప్ను పాక్ ఈసారి ఒడిసిపట్టింది. శ్రీలంకను ఓడించి విజేతగా నిలిచింది.
- 2010: విండీస్ వేదికగా జరిగిన టోర్నీలో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్గా పాల్గొంది. కానీ, సెమీస్కు చేరిన ఆ జట్టు అక్కడ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా ఫైనల్కు చేరాయి. పాల్ కాలింగ్వుడ్ నాయకత్వంలోని ఇంగ్లిష్ జట్టు టైటిల్ గెలుచుకుంది.
- 2012: శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. దీనికి ముందు ఎడిషన్ టైటిల్ను ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఈసారి మాత్రం రెండో రౌండ్కే పరిమితమై నిరాశపరిచింది. వెస్టిండీస్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో హోస్ట్ శ్రీలంకను ఓడించింది.
- 2014: అంతకుముందు (2012) జరిగిన టైటిల్ను సాధించడంలో శ్రీలంక విఫలమైంది. ఫైనల్లో విండీస్ చేతిలో ఓడింది. ఈసారి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చిన మెగా టోర్నీ విజేతగా శ్రీలంక నిలిచింది. ఫైనల్లో భారత్ను ఓడించి లంక కప్ను దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా వచ్చిన విండీస్ సెమీస్ వరకు చేరుకుని నిష్క్రమించింది.
- 2016: ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్కు వెస్టిండీస్ - ఇంగ్లాండ్ చేరాయి. విజేతగా విండీస్ నిలిచింది. ఆ జట్టు రెండోసారి కప్ను సాధించడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన శ్రీలంకకు దారుణ ఫలితాలు ఎదురయ్యాయి. రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.
- 2021: కరోనా కారణంగా యూఏఈ/ఒమన్ వేదికగా మ్యాచ్లు జరిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన విండీస్ సెకండ్ రౌండ్కే పరిమితమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్కు చేరాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఆసీస్ విజేతగా నిలిచింది.
- 2022: సొంత మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్కు ఈసారి చుక్కెదురైంది. సెమీస్కూ చేరలేకపోయింది. రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన ఇంగ్లాండ్ రెండో సారి విజేతగా నిలిచింది.
- 2024: విండీస్ - యూఎస్ఏ సంయుక్త ఆతిథ్యం ఇవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. టీ20 ఫార్మాట్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం. చాలామంది క్రికెట్ విశ్లేషకులు సెమీస్కు చేరే నాలుగు జట్లను మాత్రమే అంచనా వేస్తున్నారు. కప్ను దక్కించుకొనే టీమ్ను ఎవరూ చెప్పలేకపోవడం గమనార్హం. ఈసారి పోటీ తీవ్ర స్థాయిలో ఉంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి