ODI WC 2023 - Team India: ప్రపంచకప్ ఛాన్స్ మిస్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు?
ప్రపంచకప్ (ODI WC 2023) కోసం 15 మందితో జట్టును ప్రకటించడానికి బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ సిద్ధమవుతోంది. 17 మంది పేర్లతో దాదాపు సిద్ధమైన జాబితా (Team India)లో ఇద్దరి పేర్లను తీసేయాలి. ఆ ఇద్దరు ఎవరు అనేదే ప్రశ్న.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI WC 2023)కు సరిగ్గా నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రపంచకప్నకు కొన్ని జట్లను ప్రకటించేశాయి. జట్ల ప్రకటనకు తుది గడువు మంగళవారమే. ముందు ముసాయిదా జట్లను ప్రకటించి.. ఆ తర్వాత అత్యవసర పరిస్థితులను బట్టి ICC అనుమతితో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రపంచకప్ దృష్టితోనే ఆసియా కప్ (Asia Cup)కు 17 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు భారత సెలక్టర్లు. ఇందులోంచి ఇద్దరిని తప్పించి.. ప్రపంచకప్ కోసం 15 మందితో జట్టు (Team India)ను ప్రకటించాల్సి ఉంది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ. ప్రపంచకప్ అవకాశం కోల్పోనున్న ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా అయిదుగురి మీద దృష్టి ఉండగా.. అందులోంచి ‘డిలీట్’ బటన్ ఎవరి మీద ప్రెస్ అవుతుందన్నది ఆసక్తికరం.
శ్రేయస్ అయ్యర్
వన్డే ప్రపంచకప్కు ఎంపిక అవుతాడా లేదా అని అనుమానాలు వ్యక్తమైన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఈ ఏడాది ఐపీఎల్ కంటే ముందే అతను గాయపడి మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని సుదీర్ఘ సమయం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో గడిపాడు. కొన్ని వారాల ముందు అయితే అతను ప్రపంచకప్ ఆడటం కష్టమే అనుకున్నారంతా. కానీ వేగంగా ఫిట్నెస్ సాధించి ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్తో మ్యాచ్లో బరిలోకి కూడా దిగాడు. బ్యాటింగ్లో ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా సౌకర్యవంతంగానే కనిపించాడు. వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ రద్దు కాకపోయి ఉంటే.. ఫీల్డింగ్లో శ్రేయస్ ఫిట్నెస్ ఎలాంటిదో చూసేవాళ్లం. ప్రస్తుతానికైతే అతడికి సమస్యలేమీ లేనట్లే కనిపిస్తోంది. నాలుగో స్థానంలో చాన్నాళ్లుగా ఆడుతున్నాడు కాబట్టి ప్రపంచకప్కు శ్రేయస్ ఎంపిక లాంఛనమే. మధ్యలో ఫిట్నెస్ సమస్యలు తిరగబెడితే తప్ప అతను ప్రపంచకప్లో ఆడబోతున్నట్లే.
కేఎల్ రాహుల్
శ్రేయస్ లాగే ఫిట్నెస్ సమస్యలతో కొన్ని నెలల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు కేఎల్ రాహుల్. ఐపీఎల్లో అయిన తొడ గాయానికి అతను కూడా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతను శ్రేయస్ కంటే ముందే కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆసియా కప్నకు ఎంపిక అయినప్పటికీ.. వేరే చిన్న గాయం ఏదో కావడంతో తొలి రెండు మ్యాచ్లకు దూరం అయ్యాడు. సూపర్-4 నుంచి అతను అందుబాటులోకి వస్తాడంటున్నారు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎన్సీఏ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గాయానికి ముందు జట్టులో కీలక బ్యాటర్లలో ఒకడు, పైగా వికెట్ కీపింగ్ కూడా చేయగలడు కాబట్టి రాహుల్ను ప్రపంచకప్నకు ఎంపిక చేయడం ఖాయం అంటున్నారు. ఫిట్నెస్ సమస్యలు తిరగబెడితే అతణ్ని తప్పించి వేరొకరని ఎంచుకోవచ్చు కానీ.. ఇప్పటికైతే అతడిపై వేటు పడదని తెలుస్తోంది.
సంజు శాంసన్
ఈ కేరళ కుర్రాడు ఐపీఎల్ మెరుపులు చూసి.. టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు. అతడికి అవకాశం దక్కని సమయంలో సెలక్టర్లను విమర్శించారు. ఐతే కొంచెం ఆలస్యంగా అయినా అతడికి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అతను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇటీవలి వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనల్లో ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. దీంతో ప్రపంచకప్నకు ఎంపిక చేయాల్సిందే అన్న అభిప్రాయం తన విషయంలో కలగలేదు. ఐతే రాహుల్ ఫిట్నెస్ మీద సందేహాలుండటంతో అతడికి బ్యాకప్గా ఆసియా కప్కు సంజును ఎంపిక చేశారు సెలక్టర్లు. మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సత్తా చాటుతుండటం సంజుకు ఇబ్బందిగా మారింది. పైగా రాహుల్ ఫిట్నెస్ సాధించి ఆసియా కప్లో సూపర్-4 దశ నుంచి ఆడబోతుండటంతో సంజుకు దారులు మూసుకుపోయినట్లే. ప్రపంచకప్ జట్టుకు దూరం కానున్న ఇద్దరిలో ఒకరు సంజునే అన్నది ఖాయం.
ప్రసిద్ధ్ కృష్ణ
ఈ కర్ణాటక పేసర్ గాయంతో పోరాడి ఈ మధ్యే ఫిట్నెస్ సాధించాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. ఐతే బుమ్రా ఫిట్నెస్ సాధించడంతో భారత పేస్ విభాగం బలం పుంజుకుంది. జట్టుకు అవసరమైన స్థాయిలో పేస్ బలగం ఉంది. ప్రస్తుతం జట్టులో బుమ్రా, షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ల రూపంలో నలుగురు స్పెషలిస్టు బౌలర్లున్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో మరో పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయం కూడా ఉంది. ప్రపంచకప్ జరిగేది ఇండియాలో కాబట్టి మరీ ఎక్కువమంది పేసర్లు అవసరం లేదనే అభిప్రాయం ఉండటంతో ఐదో పేసర్గా ప్రసిద్ధ్ అవసరం లేదనే భావిస్తున్నారు. పైగా అతను చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇన్ని రోజులు మైదానానికి దూరంగా ఉన్న పేస్ బౌలర్ను ఆసియా కప్లో కూడా ఆడించట్లేదంటే ప్రపంచకప్నకు దూరం పెట్టబోతున్నట్లే భావించాలి.
తిలక్ వర్మ
కొన్ని నెలల ముందు వరకు ప్రపంచకప్ చర్చల్లోనే లేడు తిలక్ వర్మ. కానీ ఈ హైదరాబాద్ కుర్రాడు వెస్టిండీస్ పర్యటన కోసం తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడ టీ20 సిరీస్లో సత్తా చాటి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో అతణ్ని ప్రపంచకప్కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. ఆసియా కప్ జట్టుకు ఎంపిక కావడంతో ప్రపంచకప్ అవకాశం పైనా ఆశలు రేగాయి. కానీ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో తిలక్కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. కానీ శ్రేయస్, రాహుల్లకు ఫిట్నెస్ సమస్యలు తిరగబెడతాయేమో అన్న భయాలు కొనసాగుతుండటంతో తిలక్ను ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టులో కొనసాగించే అవకాశాలే ఎక్కువ. కానీ ఇప్పటిదాకా ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ను ప్రపంచకప్కు ఎంపిక చేయడం కరెక్టా అనే వాదనా ఉంది. ఒకవేళ అదనపు పేస్ బౌలర్ ఉండాలని ప్రసిద్ధ్ కృష్ణను కొనసాగిస్తే మాత్రం తిలక్ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించవచ్చు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్