ODI WC 2023 - Team India: ప్రపంచకప్ ఛాన్స్ మిస్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు?
ప్రపంచకప్ (ODI WC 2023) కోసం 15 మందితో జట్టును ప్రకటించడానికి బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ సిద్ధమవుతోంది. 17 మంది పేర్లతో దాదాపు సిద్ధమైన జాబితా (Team India)లో ఇద్దరి పేర్లను తీసేయాలి. ఆ ఇద్దరు ఎవరు అనేదే ప్రశ్న.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI WC 2023)కు సరిగ్గా నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రపంచకప్నకు కొన్ని జట్లను ప్రకటించేశాయి. జట్ల ప్రకటనకు తుది గడువు మంగళవారమే. ముందు ముసాయిదా జట్లను ప్రకటించి.. ఆ తర్వాత అత్యవసర పరిస్థితులను బట్టి ICC అనుమతితో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రపంచకప్ దృష్టితోనే ఆసియా కప్ (Asia Cup)కు 17 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు భారత సెలక్టర్లు. ఇందులోంచి ఇద్దరిని తప్పించి.. ప్రపంచకప్ కోసం 15 మందితో జట్టు (Team India)ను ప్రకటించాల్సి ఉంది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ. ప్రపంచకప్ అవకాశం కోల్పోనున్న ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా అయిదుగురి మీద దృష్టి ఉండగా.. అందులోంచి ‘డిలీట్’ బటన్ ఎవరి మీద ప్రెస్ అవుతుందన్నది ఆసక్తికరం.
శ్రేయస్ అయ్యర్
వన్డే ప్రపంచకప్కు ఎంపిక అవుతాడా లేదా అని అనుమానాలు వ్యక్తమైన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఈ ఏడాది ఐపీఎల్ కంటే ముందే అతను గాయపడి మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని సుదీర్ఘ సమయం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో గడిపాడు. కొన్ని వారాల ముందు అయితే అతను ప్రపంచకప్ ఆడటం కష్టమే అనుకున్నారంతా. కానీ వేగంగా ఫిట్నెస్ సాధించి ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్తో మ్యాచ్లో బరిలోకి కూడా దిగాడు. బ్యాటింగ్లో ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా సౌకర్యవంతంగానే కనిపించాడు. వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ రద్దు కాకపోయి ఉంటే.. ఫీల్డింగ్లో శ్రేయస్ ఫిట్నెస్ ఎలాంటిదో చూసేవాళ్లం. ప్రస్తుతానికైతే అతడికి సమస్యలేమీ లేనట్లే కనిపిస్తోంది. నాలుగో స్థానంలో చాన్నాళ్లుగా ఆడుతున్నాడు కాబట్టి ప్రపంచకప్కు శ్రేయస్ ఎంపిక లాంఛనమే. మధ్యలో ఫిట్నెస్ సమస్యలు తిరగబెడితే తప్ప అతను ప్రపంచకప్లో ఆడబోతున్నట్లే.
కేఎల్ రాహుల్
శ్రేయస్ లాగే ఫిట్నెస్ సమస్యలతో కొన్ని నెలల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు కేఎల్ రాహుల్. ఐపీఎల్లో అయిన తొడ గాయానికి అతను కూడా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతను శ్రేయస్ కంటే ముందే కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆసియా కప్నకు ఎంపిక అయినప్పటికీ.. వేరే చిన్న గాయం ఏదో కావడంతో తొలి రెండు మ్యాచ్లకు దూరం అయ్యాడు. సూపర్-4 నుంచి అతను అందుబాటులోకి వస్తాడంటున్నారు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎన్సీఏ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గాయానికి ముందు జట్టులో కీలక బ్యాటర్లలో ఒకడు, పైగా వికెట్ కీపింగ్ కూడా చేయగలడు కాబట్టి రాహుల్ను ప్రపంచకప్నకు ఎంపిక చేయడం ఖాయం అంటున్నారు. ఫిట్నెస్ సమస్యలు తిరగబెడితే అతణ్ని తప్పించి వేరొకరని ఎంచుకోవచ్చు కానీ.. ఇప్పటికైతే అతడిపై వేటు పడదని తెలుస్తోంది.
సంజు శాంసన్
ఈ కేరళ కుర్రాడు ఐపీఎల్ మెరుపులు చూసి.. టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు. అతడికి అవకాశం దక్కని సమయంలో సెలక్టర్లను విమర్శించారు. ఐతే కొంచెం ఆలస్యంగా అయినా అతడికి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అతను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇటీవలి వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనల్లో ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. దీంతో ప్రపంచకప్నకు ఎంపిక చేయాల్సిందే అన్న అభిప్రాయం తన విషయంలో కలగలేదు. ఐతే రాహుల్ ఫిట్నెస్ మీద సందేహాలుండటంతో అతడికి బ్యాకప్గా ఆసియా కప్కు సంజును ఎంపిక చేశారు సెలక్టర్లు. మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సత్తా చాటుతుండటం సంజుకు ఇబ్బందిగా మారింది. పైగా రాహుల్ ఫిట్నెస్ సాధించి ఆసియా కప్లో సూపర్-4 దశ నుంచి ఆడబోతుండటంతో సంజుకు దారులు మూసుకుపోయినట్లే. ప్రపంచకప్ జట్టుకు దూరం కానున్న ఇద్దరిలో ఒకరు సంజునే అన్నది ఖాయం.
ప్రసిద్ధ్ కృష్ణ
ఈ కర్ణాటక పేసర్ గాయంతో పోరాడి ఈ మధ్యే ఫిట్నెస్ సాధించాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. ఐతే బుమ్రా ఫిట్నెస్ సాధించడంతో భారత పేస్ విభాగం బలం పుంజుకుంది. జట్టుకు అవసరమైన స్థాయిలో పేస్ బలగం ఉంది. ప్రస్తుతం జట్టులో బుమ్రా, షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ల రూపంలో నలుగురు స్పెషలిస్టు బౌలర్లున్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో మరో పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయం కూడా ఉంది. ప్రపంచకప్ జరిగేది ఇండియాలో కాబట్టి మరీ ఎక్కువమంది పేసర్లు అవసరం లేదనే అభిప్రాయం ఉండటంతో ఐదో పేసర్గా ప్రసిద్ధ్ అవసరం లేదనే భావిస్తున్నారు. పైగా అతను చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇన్ని రోజులు మైదానానికి దూరంగా ఉన్న పేస్ బౌలర్ను ఆసియా కప్లో కూడా ఆడించట్లేదంటే ప్రపంచకప్నకు దూరం పెట్టబోతున్నట్లే భావించాలి.
తిలక్ వర్మ
కొన్ని నెలల ముందు వరకు ప్రపంచకప్ చర్చల్లోనే లేడు తిలక్ వర్మ. కానీ ఈ హైదరాబాద్ కుర్రాడు వెస్టిండీస్ పర్యటన కోసం తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడ టీ20 సిరీస్లో సత్తా చాటి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో అతణ్ని ప్రపంచకప్కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. ఆసియా కప్ జట్టుకు ఎంపిక కావడంతో ప్రపంచకప్ అవకాశం పైనా ఆశలు రేగాయి. కానీ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో తిలక్కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. కానీ శ్రేయస్, రాహుల్లకు ఫిట్నెస్ సమస్యలు తిరగబెడతాయేమో అన్న భయాలు కొనసాగుతుండటంతో తిలక్ను ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టులో కొనసాగించే అవకాశాలే ఎక్కువ. కానీ ఇప్పటిదాకా ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ను ప్రపంచకప్కు ఎంపిక చేయడం కరెక్టా అనే వాదనా ఉంది. ఒకవేళ అదనపు పేస్ బౌలర్ ఉండాలని ప్రసిద్ధ్ కృష్ణను కొనసాగిస్తే మాత్రం తిలక్ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించవచ్చు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య