Mayank Yadav: కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..
క్రీజ్లో ఇద్దరూ దూకుడుగా ఆడేస్తున్నారు.. అప్పటికే సెంచరీ భాగస్వామ్యం నమోదైంది.. పది వికెట్లు చేతిలో ఉన్నాయి.. 50 బంతుల్లో 98 పరుగులు అవసరం. అప్పుడు మొదలైంది అతడి హవా. తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను తన జట్టువైపు తిప్పేశాడు. తొలిసారి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఈ కుర్రాడు సీనియర్లనే బెంబేలెత్తించాడు. ఇంతకీ ఆ పేసర్ ఎవరా? అని సెర్చింగ్ మొదలెట్టేశారు.. ఇదంతా యువ పేసర్ మయాంక్ యాదవ్ గురించి..
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 199 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 178/5 స్కోరుకే పరిమితమైంది. శిఖర్ ధావన్ (70), జానీ బెయిర్స్టో (42) తొలి వికెట్కు 102 పరుగులు జోడించారు. వికెట్ కోసం లఖ్నవూ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పుడే ధ్రువతారలా ఓ కుర్రాడు పదునైన బౌలింగ్తో వికెట్ తీసి లఖ్నవూ శిబిరంలో ఆశలు రేపాడు. ఆ తర్వాత వరుసగా మరో రెండు వికెట్లు తీశాడు. పంజాబ్ కోల్పోయిన ఐదు వికెట్లలో తొలి మూడు కూడా మయాంక్ యాదవ్ ఖాతాలోకే చేరడం విశేషం. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ప్రత్యర్థులే అభినందించేలా..
ఐపీఎల్ ద్వారా కొత్త పేస్ స్టార్ వెలుగులోకి వచ్చాడని అభిమానులు సంబరపడుతున్నారు. దిల్లీకి చెందిన 21 ఏళ్ల మాయాంక్ వేగం అద్భుతం. నిలకడగా 145 కి.మీకుపైగా వేగంతో బంతులేస్తాడు. ప్రస్తుత సీజన్లో 155.8 వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. త్వరలోనే అతడి నుంచి అత్యంత వేగవంతమైన బంతిని మనం చూసే అవకాశం లేకపోలేదు. మయాంక్ బౌలింగ్లో కేవలం పేస్ మాత్రమే కాకుండా.. వైవిధ్యం ఉండటమే అతడి స్పెషాలిటీ. గతంలో ఉమ్రాన్ మాలిక్ కూడా వేగంగా బంతులేసేవాడు. కానీ, అతడి బౌలింగ్లో లైన్ అండ్ లెంగ్త్ ఉండేది కాదు. దీంతో భారీగా పరుగులు సమర్పించుకొనేవాడు. కానీ, మయాంక్ బౌలింగ్ మాత్రం కచ్చితత్వంతో కూడుకున్నదే. ఎంతలా ఉందంటే అతడి బౌలింగ్ను ఆడిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం మయాంక్ పేస్ను ధావన్ అభినందించకుండా ఉండలేకపోయాడు.
రెండేళ్ల కిందటే వచ్చాడు.. గాయంతో దూరం
రెండేళ్ల కిందటే మయాంక్ ఐపీఎల్లోకి వచ్చాడు. 2022 మెగా వేలంలో లఖ్నవూ అతడిని రూ.20 లక్షలకే తీసుకుంది. కానీ, ఆ సీజన్లో ఒక్క అవకాశమూ రాలేదు. మరుసటి ఏడాదిలో (2023) అతడికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఏకంగా లీగ్ నుంచి వైదొలిగాడు. దీంతో మయాంక్ స్థానంలో ఆర్పిత్ గులేరియాను లఖ్నవూ తీసుకుంది. కానీ, మయాంక్పై లఖ్నవూ నమ్మకం మాత్రం కొనసాగించింది. ఆ ఏడాది దియోధర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా యాదవ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. నార్త్ జోన్ తరఫున ఆడిన అతడు 12 వికెట్లు పడగొట్టాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దిల్లీకి ఆడిన మయాంక్.. రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్ను ఓడించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. లిస్ట్ ఏ కెరీర్లో ఇప్పటి వరకు 34 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. దీంతో గత మినీ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియలోనూ మయాంక్ను లఖ్నవూ తమ వద్దే ఉంచేసుకుంది. ఇప్పుడు వచ్చిన తొలి మ్యాచ్ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మయాంక్.. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే జాతీయ జట్టులోకి అడుగు పెట్టడం ఖాయమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం