Nuwan Seneviratne: అప్పటి బస్సు డ్రైవర్.. ఇప్పుడు టీమ్ ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్
నువాన్ సెనెవిరత్నె (Nuwan Seneviratne)... ఈ పేరు వింటే ఎవరో శ్రీలంక క్రికెటర్ గురించి చెబుతున్నాం అనుకోవచ్చు. నిజమే కానీ ఇప్పుడు ఆయన టీమ్ ఇండియా (Team India)తో కలసి పని చేస్తున్నాడు. ఎవరతను, ఎందుకు మనతో ఉన్నాడు.
భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఎవరెవరున్నారనేది ఆటను అనుసరించే వాళ్లకు తెలుసు. అదే క్రికెట్ పిచ్చి ఉన్న అభిమానులకు అయితే కోచింగ్, సహాయక సిబ్బంది పేర్లు కూడా తెలుసు. కానీ నువాన్ సెనెవిరత్నె (Nuwan Seneviratne) ఎవరు? అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టమే. టీమ్ఇండియా (Team India) డైహార్డ్ అభిమానులకూ అతనెవరో తెలిసి ఉండదు. కానీ పాకిస్థాన్ ప్రమాదకర లెఫ్టార్మ్ పేసర్ షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో రోహిత్, శుభ్మన్, కోహ్లి, రాహుల్.. ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు సాధించడం వెనుక ఈ నువాన్ ఉన్నాడు. టీమ్ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ ఈ నువాన్. మరి శ్రీలంకకు చెందిన అతను.. భారత జట్టులో ఎలా భాగమయ్యాడు?
అలా వెలుగులోకి..
పాకిస్థాన్తో ఆసియా కప్ సూపర్- 4 మ్యాచ్లో షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో రోహిత్ శర్మ ఫ్లిక్తో సిక్సర్ కొట్టగానే అక్కడి కెమెరాలన్నీ భారత డ్రెస్సింగ్ గది బాల్కనీలో నిల్చున్న నువాన్పై ఫోకస్ పెట్టాయి. అప్పుడు అతనెవరూ అన్నది చాలా మందికి తెలీదు. పోనీ అతణ్ని టీవీలో ఎందుకు చూసిస్తున్నారన్నది కూడా తెలీదు. దీంతో నువాన్పై చర్చ మొదలైంది. శ్రీలంకకు చెందిన నువాన్ 2017 నుంచి టీమ్ఇండియాకు త్రోడౌన్ స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్నాడు. జట్టు సహాయక బృందంతో కలిసి పని చేస్తున్నాడు. నెట్స్లో, మైదానంలో తన ఎడమ చేతి వాటంతో వేగంగా నేరుగా త్రోలు విసరడమే నువాన్ పని. కానీ ఈ త్రోలు విసిరే విధానంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ, మంచి వేగాన్ని రాబడుతూ, విభిన్న కోణాలను ప్రయత్నిస్తూ.. బ్యాటర్లకు మంచి ప్రాక్టీస్ లభించేలా చూస్తున్నాడు. నువాన్ కారణంగానే మ్యాచ్లో లెఫ్టార్మ్ పేసర్లను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారని చెప్పొచ్చు.
బస్సు డ్రైవర్గా..
43 ఏళ్ల నువాన్ జీవిత ప్రయాణం ఆసక్తికరం. క్రికెట్పై ఇష్టంతో అతను లెఫ్టార్మ్ పేసర్గా మారాడు. కానీ కేవలం రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లే ఆడగలిగాడు. అక్కడితోనే ఆటగాడిగా అతని క్రికెట్ కెరీర్ ముగిసింది. భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. పొట్టకూటి కోసం ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఓ పాఠశాల బస్సు డ్రైవర్గా చేరాడు. కానీ ఖాళీ సమయంలో తన పాత క్రికెట్ క్లబ్కు వెళ్లేవాడు. అక్కడి జట్లకు బౌలింగ్లో, ఫీల్డింగ్లో సహాయపడేవాడు. అలా ఒకసారి 2015లో వెళ్లిన సమయంలో శ్రీలంక మాజీ బ్యాటర్ చరిత్ సేననాయకేను కలవడంతో నువాన్ దశ తిరిగింది. నువాన్ త్రోలు విసిరే విధానం చరిత్ను ఆకట్టుకుంది. అలాగే అతని అంకితభావం, క్రమశిక్షణ నచ్చింది. అప్పుడు జట్టు మేనేజర్గా ఉన్న చరిత్.. నువాన్ను జట్టు సహాయక బృందంలో చేర్చుకోవాలని సూచించాడు. 2016లో భారత్లో పర్యటించిన శ్రీలంక- ఎ జట్టుతో కలిసి నువాన్ పనిచేశాడు. ఆ తర్వాత శ్రీలంక సీనియర్ జట్టుతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్లాడు. నువాన్ విసిరే వేగాన్ని చూసి శ్రీలంక కోచ్ గ్రాహం ఫోర్డ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇలా భారత్కు..
బవువా అని ముద్దుగా పిలుచుకునే నువాన్ గురించి భారత జట్టుకు తెలిసింది. 2017లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు నెట్స్లో బౌలింగ్ సహాయం కోసం నువాన్ను టీమ్ఇండియా పిలిపించింది. అప్పుడు నెట్స్లో తన వేగంతో కోహ్లీని అతను ఇబ్బంది పెట్టాడు. అతని బంతులు కోహ్లి శరీరానికి కూడా తగిలాయి. దీంతో నువాన్ నైపుణ్యాలకు మెచ్చి టీమ్ఇండియా మేనేజ్మెంట్.. అతనికి ఇంటర్వ్యూ నిర్వహించి జట్టు సహాయక బృందంలో చేర్చుకుంది. దీంతో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన జట్లలో ఒకటైన భారత్తో పనిచేసే అవకాశం అతనికి దక్కింది. డబ్బుతో పాటు మంచి హోదా లభించింది. నువాన్ ఎప్పటికప్పుడూ తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ.. సాధనలో బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతూనే ఉన్నాడు. త్రో విసిరే చేతిని బలంగా ఉంచుకోవడం కోసం జిమ్లో కష్టపడుతున్నాడు. లెఫ్టార్మ్ పేసర్లపై భారత బ్యాటర్లు ఆధిపత్యం చలాయిస్తుంటే.. తన కష్టం ఫలించిందని ఆనందపడుతున్నాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్